హైదరాబాద్ పేలుళ్ళు: మతరాజకీయాల పై ధర్మాగ్రహం!

దిల్ షుక్ నగర్ దుర్ఘటనలు : మతరాజకీయాలపై గౌరవ న్యాయమూర్తుల ధర్మాగ్రహం!

- ఎబికె ప్రసాద్
[సీనియర్ సంపాదకులు]

 


"మానవజాతి ప్రగతిపథం వైపు సాగించిన ప్రతి ఒక్క అడుగూ మానవ రక్తతర్పణతోనే సాగింది. ఇంతగా నరరక్తం ప్రవాహం కట్టడానికి అన్ని మతాల ధర్మాచార్యులూ సమానంగా బాధ్యులే! ఏ ఒక్క మతమూ, ఏ ఒక్క మతాచార్యుడూ గర్వించవలసింది ఏమీలేదు''!
                                                                           - 
మహా పండిత రాహుల్ సాంకృత్వాయన్

 


[ముప్పై భాషలలో పండితుడైన త్రిపీఠికాచార్య "దర్శన్-దిగ్దర్శన్'' "ప్రాక్పశ్చిమ దర్శనాలు'' గ్రంథంలో విశ్వోత్పత్తినుంచి మానవ పరిణామక్రమ విశ్వదర్శనం]

 



ఎన్నైనా చెప్పండి, దొంగబుద్ధి దొంగబుద్ధే! దొంగతనానికి అలవాటుపడినవాడు తను చిక్కుబడబోయే సమయానికి వాడే ఎదురుబొంకుగా "దొంగ, దొంగ! పట్టుకోండి, పట్టుకోండి'' అంటూ అరుస్తాడు! అందుకే "రొయ్యల బుద్ధి'' సామెత కూడా పుట్టుకొచ్చి వుంటుంది. అందరూ చూడ్డానికి శ్రీవైష్ణవులేనట, పాపం ఆవగింజంత 'హింస' ఎరగనివాళ్ళు, జీడిగింజంత మాంసంముక్క ఎరగనివాళ్ళు, కాని రొయ్యల బుట్టమాత్రం ఖాళీ అయిపోయిందట! నేడు మన దేశంలోని ఇరువర్గాలకు చెందిన మతఛాందసులు [శాంతిచిహ్నాలయిన అది ఇస్లామ్ కు, లౌకికవాదంపై ఆధారపడిన ఆదిహైందవ ధర్మానికీ విరుద్ధమైన ఇస్లామ్ మతఛాందసులు, సెక్యులర్ వ్యతిరేకులయిన హిందుత్వ ఛాందసులూ] వందలాది సంవత్సరాలుగా విభిన్న జాతుల మధ్య విలసిల్లుతూ వచ్చిన లౌకిక ధర్మాలన్నింటికి చిచ్చుపెడుతూ సామాజిక జీవనాన్ని అల్లకల్లోలానికి గురిచేస్తున్నారు.


ఈ "గురి''లో భాగమే హైదరాబాద్ జంటనగరాలలోని దిల్ షుక్ నగర్ లో [21-02-2013] జరిగిన దారుణమైన బాంబుపేలుళ్ళు. వాటిఫలితంగా ఎందరో బలికావడమూ. చాలాకాలంగా సాగుతున్న అమానుషమైన ఈ గొలుసుకట్టు పరిణామాలన్నీ దేశంలోని ఇరువర్గాల మతఛాందసులు రాజకీయపార్టీలుగానూ, దేశంలోని రెండు ప్రధాన రాజకీయపక్షాలు పదవులు ఆధారంగా 'వోటు'కోసం మతాన్ని ఆశ్రయించినందునా జరుగుతున్నాయని ఇప్పటికి కడచిన ఈ పక్షాల చరిత్రంతా నిరూపిస్తోంది. ఈ విషమ పరిణామాలను దేశంలోని న్యాయవ్యవస్థ. న్యాయమూర్తులూ గమనించకపోవడం లేదు. 'అగ్ర'వాదులకూ, 'ఉగ్ర'వాదులకూ బీజాలు ఎక్కడున్నాయో కూడా ఇంతకు ముందెప్పటికంటే కూడా అనుభవం మీద న్యాయమూర్తులు గ్రహించగలగడం విషాదపరిణామాల మధ్య విజ్ఞతాపూర్వకమైన గుర్తింపుగా మనం భావించాలి.

 


"లౌకికవాదం: మైనారిటీల హక్కులు, రాజ్యాంగచట్టం'' అన్న అంశంపైన "నల్సార్ న్యాయవిద్యాలయం''లో జరిగిన [23-02-2013] జాతీయస్థాయి చర్చాగోష్ఠిని ప్రారంభిస్తూ సుప్రీంకోర్టు గౌరవన్యాయమూర్తి ఇటీవల వరకూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టీస్ ఎం.బి.లోకూర్ విలువైన సందేశం యిచ్చారు. భిన్నత్వంలో ఏకత్వానికి నిలయమైన భారతదేశంలో ఉన్నది మత ప్రసక్తిలేని రాజ్యాంగమైనందున ఈ విలక్షణమైన లౌకికవ్యవస్థను రక్షించుకోవలసిన బాధ్యత దేశప్రజలందరిపైనా ఉందని జస్టీస్ లోకూర్ అన్నారు. ఎందుకంటే, మతం, ప్రార్థనలు, నమాజులు భిన్నత్వంలో ఎకత్వంతో కొనసాగే నిత్యనైమిత్తికాలు మాత్రమే. వ్యక్తిగతమైన మనోనిబ్బరం కోసం మానసిక శాంతికోసం రాగద్వేషాలకు, ఉద్రేకాలకు దూరంగా ఆచరించే సంప్రదాయాలు మాత్రమే. అందుకే, ఈ గుర్తింపుగల భారతరాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన రాజ్యాంగ నిర్ణయసభవారు 1947లోనే అనంతశయనం అయ్యంగార్ మతసంస్థలకు రాజకీయ పక్షాలూ, రాజకీయపార్టీలకు మతసంస్థలూ దూరంగా ఉండాలని, ఈ రెండు వ్యవస్థలమధ్య ఎలాంటి పొత్తూ పొంతన ఉండడానికి వీల్లేదని శాసిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు! కాని కాలక్రమంలో రాజకీయాధికార పక్షాలకూ, మతసంస్థలకూ తలల్లో పురుగు తొలిచి, కేవలం సీట్లకోసం, వోట్లకోసం ఒకరి పరిథిలోకి మరొకరు మెడలుదూర్చి దేశంలోని ప్రతీ సమస్యను మతద్వేషాలు చూసి, అందుకు అనుగుణంగా రాజకీయపక్షాలను, మతరాజకీయాన్ని మలుచుకుంటూ వచ్చి, జనజీవితాన్నే కకావికలుచేసి, సభ్యప్రపంచంలో భారతదేశానికి తలవంపులు తెచ్చిపెడుతున్నారు. ఈ పరిణామాల మధ్యనే జస్టీస్ లోకూర్ మరొకసారి రాజ్యాంగ లక్ష్యాన్ని గుర్తుచేయవలసి వచ్చింది. మతతత్వ ధోరణుల మూలంగానే సమాజంలో వైషమ్యాలు పెరుగుతున్నాయని, ఈ పరిణామాన్ని గుర్తించి విద్యార్థిలోకానికి ప్రాథమికస్థాయిలోనే పరమత సహనం గురించి, మతప్రసక్తి లేని లౌకికవాదం గురించీ అవగాహన కల్పించవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అంతేగాదు, "మతాలపేరిట రాజకీయాలు నడిపిస్తే ప్రజాస్వామ్యాన్ని సమాధి చేయడమే''నని అదే సభలో ప్రసంగిస్తూ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ ఖాద్రీ హెచ్చరించారు. దేశంలో మతాలమధ్య చిచ్చుపెట్టిన బ్రిటిష్ సామ్రాజ్యవాదుల వ్యూహం గురించి ముంబై ఐ.ఐ.టి. ప్రొఫెసర్ రాం పునియా గుర్తు చేశారు.

 

ఎందుకంటే, 1857 నాటి ప్రథమ భారత స్వాంతంత్ర్య సంగ్రామానికి తొలి పూజలందించిన హిందూ-ముస్లీం సమైక్యతా శక్తిని ఆగ్రహాన్ని చవిచూసిన సామ్రాజ్యవాదుపాలకులు భిన్నమతాల, భిన్న సంస్కృతులమధ్య దేశంలో నెలకొన్న ఐక్యతను ఛిన్నాభిన్నం చేస్తే తప్ప తమ పాలనను  కొనసాగించడం అసాధ్యమని భావించి ప్రజల్ని విభజించి, పాలించడం కోసం మతాలమధ్య చిచ్చుపెట్టారు. జాతివ్యతిరేక చర్యను అందిపుచ్చుకున్నవాళ్ళు మన దేశీయపాలకులే అయినా, అదే "విభజించి-పాలించే''దుర్మార్గపునీతిని మాత్రం కాలక్రమంలో అటు కాంగ్రెస్ పాలకులూ, బిజెపి పాలకులూ వదులుకోలేకపోతున్నారు. ఏ రాజకీయపక్షం పదవిలో లేకపోతే ఆ పక్షం, ఎదుటి శత్రుపక్షంతో ఎన్నికలలో పోటీకోసం లబ్ధిపొందడానికి మతసంస్థల్ని ఆశ్రయిస్తున్నారు; ఈ 'సౌకర్యం' కనిపెట్టిన మతసంస్థలూ రాజకీయ పక్షాల్ని, పక్షాలనూ ఆశ్రయిస్తున్నాయి!



అందుకనే, చాలామందికి గుర్తు ఉందొ లేదో గాని - ఆ మధ్యకాలంలో భారత ఎన్నికల ప్రధాన కమీషనర్ గా పనిచేసి రాజకీయపక్షాల్ని ఎన్నికల సమయంలో పాటించవలసిన ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన పక్షాలను చీల్చి చెండాడిన వాడు శేషన్! ఆ సమయంలో బిజెపి ముఠా అనుసరిస్తున్న 'హిందుత్వ' ఎజెండాకు గండికొట్టి తాత్కాలికంగానైనా 'గాడి'లోకి తీసుకువచ్చిన వాడాయన! కేవలం 'హిందుత్వ'రాజకీయంతో వ్యవహరిస్తున్న బిజెపికి, ఆ పార్టీ నాయకత్వం రాజకీయపక్షంగా పదవీ స్వీకార సందర్భంలో "లౌకికవాదానికి కట్టుబడి ఉంటామ''నీ, రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటామని చేసిన ప్రతిజ్ఞను శేషన్ గుర్తుచేసి, ఆ ప్రతిజ్ఞను విస్మరిస్తే బిజెపికి ఎన్నికలసంఘం యిచ్చిన రాజకీయ గుర్తింపును రద్దుచేస్తానని హెచ్చరించడంతో నోరుమూయవలసి వచ్చింది.

 


అందువల్ల నేటి విషమపరిస్థితుల్లో తక్షణం జరగవలసినపని - మతసంస్థలుగా అవతారమెత్తి కాలక్రమంలో అవే రాజకీయపక్షాలుగా [అటు 'మిమ్'నూ, ఇటు బిజెపీని] నమోదై కొనసాగడాన్ని నిషేధించాలి; వాటి సభ్యులకు దేశ సామాన్య పౌరులమాదిరిగానే వోటు హక్కు ఇతర హక్కులూ ఉండాలి. ఎవరి మతసంప్రదాయాల్ని వారు పాటించుకునే హక్కును గుర్తించాలి. కాని రాజకీయపక్షంగా మతం చాటున తలఎత్తే హక్కు మాత్రం ఉండరాదు. అలాంటి అనుబంధసంస్థలన్నింటికీ ఈ నిబంధన వర్తించాలి. మతసంస్థ ఒక రాజకీయపక్షంగా ఈ దేశంలో వ్యవహరించడానికి అవకాశం లేకుండా పార్లమెంటు నిర్దిష్టమైన రాజ్యాంగసవరణ చేయాల్సిన సమయం వచ్చింది. అయితే అదే సందర్భంలో, నిషేధాలతోపాటు ఈ పితపబుద్ధులతో, సమాజాన్ని భ్రష్టుపట్టించే పక్షాలు తలెత్తడానికి మూలకారణమైన ఆర్థిక అసమానతల నిర్మూలనపైన పాలనావ్యవస్థ కేంద్రీకరించాలి. "సమాజంలో ఉగ్రవాదం హెచ్చరిల్లడానికి ఈ అసమానతలే కారణమ''ని రాష్ట్ర హైకోర్టు గౌరవ న్యాయమూర్తి జస్టీస్ నూతి రామ్మోహన్ రావు [23-02-2013] దిల్ షుక్ నగర్ లో కిరాతకాన్ని ప్రస్తావిస్తూ పాలకవ్యవస్థకు గుర్తుచేశారు. అయితే ఈ అసమానతలు తొలగడానికి అవసరమైన ఆదేశం రాజ్యాంగంలోని 38-39వ అధికరణలు పాలనావ్యవస్థకు పూర్తీ అవకాశం కల్పించినప్పటికీ పాలకపక్షాలు ఎందుకని వాటిని తు.చ. అమలు జరపకుండా నాటకమాడుతున్నాయో కూడా న్యాయమూర్తులు గ్రహించగలగాలి. సర్వత్ర ధనికవర్గ రాజకీయాలు రాజ్యమేలుతున్న సమాజాలలో పాలకుల ఆచరణ 'పెదవులు'దాటదని, మాటలు కోటలు దాటినా, కాలు గడపదాటదనీ గ్రహించాలి.

 


భారత నగరాలలో ఉగ్రవాదుల బాంబుపేలుళ్ళకు కారణాలు వెతికేవాళ్ళు ఎక్కడ ఘటన జరిగిందో అక్కడ క్షుణ్ణంగా వెతక్కుండా, మెడలురిక్కించి గంటలోనే బీహార్, నేపాల్ సరిహద్దుల దాకా సాగతీయడం విచిత్రం. పైగా తరచుగా ఈ దుర్మార్గాలకు గుజరాత్, మహారాష్ట్ర (బొంబాయి), కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలే ఎందుకు కేంద్రబిందువులు కావలసివస్తోంది? ఈ నాల్గురాష్ట్రాలపైన ఉగ్రవాదులు ఎందుకు కేంద్రీకరించావలసివస్తోంది? వీటిలో మూడు రాష్ట్రాలలో బిజెపి, బిజెపి-శివసేన మతరాజకీయాలు తీవ్రస్థాయిలో కొనసాగుతుండడమే ఉగ్రవాదులూ అయా మేరకు ఈ రాష్ట్రాలలోనే కేంద్రీకరించవలసి వస్తోందని భావించాలి. ఇక ఆంధ్రప్రదేశ్ లో పాత రజకార్ మత సంస్థే ఆ తర్వాత మజ్లీస్ ఇత్తిహదుల్-ఇ-ముస్లిమీన్ రాజకీయసంస్థగా రూపాంతరం చెందింది. బాబ్రీమసీదు విధ్వంసకాండ, అందుకు ప్రతిగా ఆ పిమ్మట ముంబై కల్లోలాలు ఆ దరిమిలా గుజరాత్ లో మోడీ ప్రభుత్వం మైనారిటీలను పెద్దసంఖ్యలో ఊచకోత కోయటం, గుజరాత్ హోంమంత్రి పాండ్యా, జస్టీస్ కృష్ణయ్యర్ విచారణ సంఘం ముందు హాజరై, మైనారిటీల ఊచకోతకు బిజెపి మోడి ఎలా పోలీసులను అనుమతించిందీ ఆ ఆదేశానికి ఒక సాక్షిగా హీరేన్ పాండ్యా నివేదించడం, ఆ దరిమిలా పాండ్యా హత్యకు గురికావడం, ఆ హత్య తబిశీళ్ళు అహ్మదాబాద్ లో ఉండగా, అందుకు కారకులయిన హంతకుల్ని హైదరాబాద్ లో వెతకడానికి గుజరాత్ పోలీసుల్ని పంపడం - నాడొక పెద్ద ప్రహసనంగా సాగింది. ఈ క్రమంలో హైదరాబాద్ నగరాన్ని ఉగ్రవాదుల పేరిట అందరూ కలిసి ఒక హంతక నగరంగానూ, హత్యల అడ్డాగానూ సంబంధిత మత రాజకీయశాక్తులు మార్చివేశారు! ఇటువంటి వాతావరణంలో శాసనవేదికల ఉసురు సహితం మతోగ్రవాదుల చేతుల్లోనే ఉంటుంది! ఇందుకు ఉదాహరణ కోసం ఎక్కడికో వెళ్ళి వెతకనక్కరలేదు.

 

ప్రపంచయుద్ధానికి ముందు, ఆ యుద్ధకాండకొక 'మిష'ను సృష్టించవలసివచ్చి, నరమేధానికి కీర్తివహించిన నాజీ హిట్లర్, జర్మన్ పార్లమెంట్ భవనాన్ని (రీచ్గ్ స్టాగ్)కి తన పార్టీవాళ్ళతోనే తగులబెట్టించి, ఆ దుర్మార్గాన్ని కమ్యూనిస్టులపైకి నెట్టాడు! అలాగే గుజరాత్ లో 2002  నాటి మైనారిటీలపై జరిగిన ఊచకోతకు తులతూగే విధంగా 1938లో జర్మనీలోని మైనారిటీ యూదు జాతీయులని ఊచకోతకోసి, వాళ్ళ వ్యాపారాలను, ఇల్లనూ ధ్వంసం చేసిన క్రిస్తాల్నాక్డ్ (KRISTALLNACHT) ఉదంతం చరిత్రకు తెలుసు! 1925 నాటి ఇండియాలో ప్రస్తుతపు "హిందుత్వ''వాదుల నాటి నాయకులకు హిట్లర్ ముఠాతో ఉన్న సంబంధాలను జిఫర్లాటో అనే ప్రసిద్ధ చరిత్రపరిశోధకుడు వెల్లడించాడు. ఆ హిట్లర్ ఆరాధకులు ఆధునిక భారతంలో బిజెపికి పూర్వ ప్రేరకులయిన "హిందూ మహాసభ'' 'జనసంఘ్', ఆర్.ఎస్.ఎస్. లలో కూడ పొదిగిలేరని ఎవరైనా చెప్పగలరా? అందుకే మతం మానవతావాదాన్ని మాత్రమే అభిమతంగా ఆరాధించగలిగితే నవభారతం నవమన్మోహితంగా వృద్ధి కాగల్గుతుంది.

 

అందుకే మానవత, లౌకికధర్మం, సమతాధర్మం ఇరుసులుగా ఎదిగిన హైందవాన్ని మాత్రమే స్వామి వివేకానందుడు అభిమానించి, ప్రవంచించి ప్రచారం చేశాడు. చివరికి తప్పుదారి పట్టిన హైందవానికి తిరిగి పూర్వవైభవం తీసుకురావడం కోసం హైందవంలో సంస్కరణభావాలు వ్యాప్తి చెంది తీవ్రతరం కానంతకాలం దేశంలోని మైనారిటీలు అన్యమతాలను ఆశ్రయించడంలో తప్పులేదని కూడా వివేకానందుడు ఒకదశలో వకాల్తా పట్టవలసివచ్చిందని మనలోని మూఢమతులు గుర్తించాలి! అందుకోసమే ఆయన - సమాజశాంతిని భంగపరుస్తున్న కొందరు మతాచార్యులను సహితం దేశసరిహద్దుల్ని దాటించాలని చాటిచెప్పేవరకూ నిద్రపోలేదు! అప్పటిదాకా ఎదుటి పక్షంపైన అన్యమత ద్వేశంతోనే కారాలు మిరియాలు నూరుతూ తనవద్దకు వచ్చేసరికి "మత రాజకీయాల సమయంకాద''ని శ్రీరంగనీతులు వల్లించడమూ మనలోని ద్వంద్వ ప్రవృత్తికి నిదర్శనం. నేడు రెండు మత రాజకీయ సంస్థలూ లేదా రాజకీయ మతసంస్థలూ 2014 ఎన్నికలు లక్ష్యంగానే సమాజశాంతిని భగ్నం చేస్తున్నాయి.

 

ఒకవైపున కేంద్ర హోంమంత్రి షిండే దిల్ షుక్ నగర్ బాంబుపేలుళ్ళకు కారకులు ఎవరని తొందరపడి నిర్థారణ చేయరాదని చెబుతూండగా, పేలుళ్ళ వెనక పాకిస్తాన్ హస్తముందని బిజెపి నాయకుడు అద్వానీ నిర్ణయించేశాడు. పాకిస్తాన్ కూడా ఉగ్రవాద దాడులకు తరచుగా గురవుతున్న సమయంలోనే అద్వానీ ఈ ప్రకటన చేయడం రెండు దేశాల మధ్య సంబంధాల పునరుద్దరణకు దోహదం చేయదు; ఇదిలా ఉండగా "ఉగ్రవాదులకు శిక్షణ యిస్తున్న పాకిస్తాన్ కే వెళ్ళి క్షేత్రస్థాయిలోనే ఉగ్రవాదాన్ని మట్టుపెట్టిరావాలని "హిందూ దేవాలయాల ప్రతిష్ఠాపాన పీఠాధిపతి'' ఒకరు (23-02-2013) మహా ఉచిత సలహా యిచ్చాడు! ఇక ఒక బిజెపి సీనియర్ నేతగారు "హైదరాబాద్ లో ఇంటింటికీ సర్వే జరిపి ఉగ్రవాదులను వారికి ఆశ్రయిస్తున్నవారిని'' పట్టుకోవాలని కోరారు! అయితే ఇన్నేళ్ళుగా సవాలక్ష కేసుల్లో ఇరుక్కుపోయిన, లేదా ఇరికించిన డజన్లకొలదీ మైనారిటీల యువకులలో హెచ్చుమందిపైన ఒక్క ఆరోపణా రుజువు కాకుండా న్యాస్తానాలు ఎందుకు విడుదల చేయవలసి వచ్చిందో, పోలీసుల్ని ఎందుకు శాఠించవలసి వచ్చిందో బుద్ధిజీవులు ఆలోచించాలి! మనిషికి అభిమతమయినది మతం. కాని ఆ అభిమతాన్ని మానవీయంగా మలుచుకోగలగాలి. ఏది ఏమైనా విచారణల, సోదాల, అరెస్టుల పేరిట మైనారిటీలను వేధించడాన్ని ప్రజాస్వామ్యవాదులంతా నిరసించాలి. అలాగే ఇరువర్గాలలోని మతఛాందసుల చర్యలను సకాలంలో తుంచివేయాలి. ఈ క్రమంలో మిలిటెంట్ మైనారిటీకన్నా, మౌనంగా మన్నుతిన్న పింజేరుల్లా ఉండే మెజారిటీ దేశసమైక్యతకు, దాని పరిరక్షణకు అసలు పెద్దచెరువు అని గ్రహించాలి.

 


మైనారిటీలపై మతవిద్వేషంతో సాగిస్తున్న మత రాజకీయశక్తుల ప్రచార ఫలితంగా దేశంలో ఏర్పడుతూ వచ్చిన భయకంపిత వాతావరణం చివరికి దేశ పోలీసువర్గాలను కూడా ప్రభావితం చేస్తోంది. విద్వేష ప్రచారానికి పరోక్షంగా చట్టబద్ధ వాతావరణం సృష్టి అవుతోంది. ఇది రెండు మతాలకూ చెందిన సాధారణ పౌరుల్నికూడా ప్రభావితం చేసి అనిశ్చిత పరిస్థితుల్ని అశాంతిని కల్గిస్తోంది. 1993లో అమెరికాలోని నల్లజాతి యువకులపై జరిగిన విద్వేష ప్రచారం ఫలితంగా ఒక యువకుడు హత్యకు గురైన ఉదంతంపైన విచారణ జరిపిన స్టీఫెన్ లారెన్స్ ఇంక్వయిరీలో నివేదిక "యూనిఫారమ్ లో ఉన్న పోలీసులు'' కూడా విద్వేష ప్రచారానికి లోనవుతారని వెల్లడించింది.

 


అస్సాంనుంచి ఆంధ్రప్రదేశ్ వరకూ మత విద్వేష ప్రచారాల మూలంగా 1983 నుంచీ మైనారిటీల ధన, మాన, ప్రాణాల్ని ఎలా కోల్పోయారో "కంయూనలిజం కంబాట్'' పత్రిక సంపాదకురాలు, జస్టీస్ కృష్ణయ్యర్ ఆధ్వర్యంలో ఏర్పడిన మానవహక్కుల పరిరక్షణా సంస్థ సభ్యురాలు, గుజరాత్ మారణకాండకు గురైన కుటుంబాల తరపున ఈ రాజకీయ న్యాయస్థానాలలో పోరు సల్పుతున్న తీస్తా సెతల్వాడ్ అనేక ఉదాహరణలు పేర్కొన్నారు: 1983లో నెల్లి (అస్సామ్) పరిసరాలలో ప్రేరేపితమైన మతఘర్షణలలో 3000 మంది సామాన్య ముస్లీం పౌరులు హతులయ్యారు; ఈ హత్యాకాండలో పోలీసులు కూడా పాలుపంచుకోవడం న్యాయస్థానాల దృష్టిని ఆకర్షించింది; 1984లో ఢిల్లీలో జరిగిన ఘర్షణల్లో పనిగట్టుకుని 3000మంది సిక్కు పౌరులను చంపారు; 1987లో హషింపురా (ఉత్తరప్రదేశ్)లో 51 మంది ముస్లీంపోరులను రాష్ట్రీయ సాయుధ కాన్ స్టాబ్యులరీ గురిపెట్టి చంపారు; 1989లో భాగల్పూర్ (బీహార్) లో తలపెట్టిన ఊచకోతకు వేలమంది బలి అయ్యారు; ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారానలను కాలిఫ్లవర్ పంటభూమిలో ఆగమేఘాలమీద పూడ్చిపెట్టారు; 1992-1993లో 1200 మందికి పైగా హతులయ్యారు; 2008 నాటి కందమహల్ (ఒడిషా)లో జరిపిన మతవిద్వేషంతో జరిగిన ఘాతుకానికి సుమారు 100 మంది క్రిస్టియన్ పౌరులు బలయ్యారు; ఇక 2002లో గుజరాత్ లో మైనారిటీలపై జరిపిన హత్యాకాండలో 2000 మందికి పైగానే బలయ్యారు; ఈ అన్ని దుర్ఘటనలను పరిశీలించి విచారించిన కోర్టులూ, జ్యుడిషియల్ కమీషన్లూ మైనారిటీలకు వ్యతిరేకంగా పాక్షిక ధోరణిలో దేశంలోని పోలీసులు కూడా వ్యవహరిస్తున్నందుకు తీవ్రంగా విమర్శించవలసి వచ్చింది! దేశంలో మతవిద్వేష వాతావరణాన్ని పనిగట్టుకుని ఒక వర్గం మతరాజకీయపక్షం అన్యమతాలపైన సృష్టిస్తున్న ఫలితంగా ప్రజల భద్రతకు పూచీపడవలసిన పోలీసుయంత్రాంగం కూడా ఎలా ప్రభావితమయ్యే ప్రమాదముందో నిరూపిస్తున్నాయి. రాజ్యాంగం హామీపడిన సెక్యులర్ వ్యవస్థను రక్షించుకోవడం ద్వారా మాత్రమే ఇండియాను, ప్రజాస్వామ్య సంప్రదాయాలను కాపాడుకోగలుగుతాం. మనకు కావలసింది గాంధీలు మాత్రమే గాని ఉన్మాదులూ, మతోన్మాద గాడ్సేలూ, కాశిం రజ్వీలూ కాదు!




కేసీఆర్ హాజరు సంతకం అనే లాంఛనం కోసమేనా?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిల మధ్య రాజకీయ స్నేహం గురించి కొత్తగా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇరువురూ ఒకరి ప్రయోజనాల పరిరక్షణ కోసం మరొకరు అన్నట్లుగా నిలబడ్డారన్న సంగతి తెలిసిందే. అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.  ఈ నేపథ్యంలో  తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం (డిసెంబర్ 29) అసెంబ్లీ శీతాకాల సమావేశాల ప్రారంభం రోజున సభకు హాజరయ్యారు. ఇందుకు నేపథ్యం ఏమిటని చూస్తే.. గత కొన్ని రోజులుగా  సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పటి వరకూ ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటూ కేసీఆర్ చాటడంతో ఆయన అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగింది. ఆ ప్రచారానికి అనుగుణంగానే ఆయన సోమవారం (డిసెంబర్ 29) అసెంబ్లీకి హాజరయ్యారు. అయితే ఆయన సవాల్ చేసినట్లుగా అసెంబ్లీలో ఆయన గళమెత్తలేదు. సభలో ఐదారు నిముషాల పాటు.. అదీ సంతాప తీర్మానాల ఆమోదం వరకూ మాత్రమే సభలో ఉన్నారు. ఆ తరువాత బయటకు వెళ్లిపోయారు. సభలో బీఆర్ఎస్ కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, సభా కార్యక్రమాలను అడ్డుకోవడం లాంటి చర్యలకు పాల్పడలేదు.  ప్రశ్నోత్తరాల సమయం సజావుగా సాగింది.  దీంతో కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యింది కేవలం అనర్హత వేటు పడకుండా ఉండేందుకు సభలో అటెండెన్స్ వేయించుకోవడానికేనన్న చర్చ మొదలైంది. సభకు హాజరై ఒక సంతకం చేసేసి మౌనంగా ఆయన సభ నుంచి నిష్క్రమించేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక్కడే వారు కేసీఆర్ వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ తీరుతో పోలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ కూడా ఒకే ఒక సారి అసెంబ్లీకి హాజరై రిజిస్టర్ లో సంతకం చేసి, ఆ తరువాత అసెంబ్లీ సమావేశాలకు ముఖం చాటేస్తున్నారు. అసలు అసెంబ్లీ అవసరమేమిటి? ప్రజా సమస్యలపై ప్రెస్ మీట్లలో మాట్లాడితే సరిపోదా అన్న తీరులో ఆయన వ్యవహార శైలి ఉంది. ఇక ఇప్పుడు కేసీఆర్ కూడా సరిగ్గా అలానే వ్యవహరించనున్నారా అన్న అనుమానాలు అత్యధికుల్లో వ్యక్తం అవుతున్నాయి.   మొత్తం మీద శాసన సభ సభ్యత్వాన్ని కాపాడుకోవడానికి హాజరు వేయించుకునే లాంఛనాన్ని కేసీఆర్ పూర్తి చేసి.. తాను తన రాజకీయ మిత్రుడు, వైసీపీ అధినేత జగన్ నే ఫాలో అవుతున్నానని చాటినట్లైందని అంటున్నారు.  

అసెంబ్లీలో సుహృద్భావ వాతావరణం.. కేటీఆర్ తీరు పంటి కింద రాయి తీరు!

చట్ట సభలు అంటే ఒకప్పుడు ప్రజాస్వామ్య దేవాలయాలుగా భాసిల్లేవి. అసెంబ్లీ, లోక్ సభలో జరిగే చర్చలు బాధ్యతాయుతంగా, అర్ధవంతంగా సాగేవి. సభలో సభ్యుల మధ్య అంశాలవారీగానే విభేదాలు తలెత్తేవి తప్ప.. ఎన్నడూ వ్యక్తిగత స్థాయికి దిగజారేవి కాదు. అయితే రాను రాను ఆ పరిస్థితి మారిపోయింది. సభ వేదికగా వ్యక్తిగత విమర్శలు, దూషణలు అన్నవి సర్వసాధారణమన్నట్లుగా మారిపోయాయి. సభలో ప్రజా సమస్యలపై చర్చ అన్నదే మృగ్యమైపోయిన పరిస్థితి ఏర్పడింది.  తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన  మార్పు కానవచ్చింది.  సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.  ఆ వాతావరణం తాజాగా సోమవారం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలలోనూ ప్రస్ఫుటంగా కనిపించింది. నిప్పుల తూటాలలాంటి విమర్శలతో ఇటీవల ఒకరిపై ఒకరు విరుచుకుపడిన రేవంత్, కేసీఆర్ లు సభలో పరస్పరం పలకరించుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. సీఎం రేవంత్ ఆప్యాయంగా, కలుపుగోరు తనంగా మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవలి కాలంలో తెలంగాణ అసెంబ్లీలో ఎన్నడూ కనబడని అరుదైన దృశ్యంగా ఇది చాలా కాలం యాదుండి పోతుందనడంలో సందేహం లేదు. ఈ సుహృద్భావ పూరిత వాతావరణం ఏర్పడటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చొరవ తీసుకున్నారు. అసెంబ్లీలోకి అడుగుపెడుతూనే రేవంత్ రెడ్డి ముందుగా ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్థానం వద్దకు వెళ్లారు. ఆయనను మర్యాదగా పలకరించి, ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ఆ తరువాత ఆప్యాయంగా షేక్ హ్యాండిచ్చి మరీ తన స్థానానికి వెళ్లారు. పలువురు మంత్రులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనుసరించి కేసీఆర్ ను పలుకరించి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇది అసెంబ్లీలో సభా మర్యాదలు ఎలా ఉండాలన్నదానికి అద్దంపట్టింది. అ యితే ఇంత జరిగినా పంటి కింద రాయిలా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు వ్యవహరించారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి స్వయంగా విపక్షాల వద్దకు వచ్చిన సమయంలో  కేసీఆర్ సహా అక్కడ అందరూ గౌరవ సూచకంగా లేచి నిలబడినా కేటీఆర్, కౌషిక్ రెడ్డిలు మాత్రం  తన స్థానం నుంచి లేవకుండా మౌనంగా కూర్చుండిపోవడం సభలో వాతావరణం సమూలంగా మారలేదనడానికి తార్కానంగా నిలిచింది. రేవంత్ చూపిన స్ఫూర్తికి విఘాతంగా కేటీఆర్ తీరు ఉందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.  

జగన్ చేసి కూడా చెప్పుకోలేకపోయిన పనులేంటో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ పరాజయానికి ప్రధాన కారణం తన హయాంలో జరిగిన మేలు ప్రజలకు చెప్పుకోవడంలో విఫలం కావడమేనని తరచూ చెబుతుంటారు. తన ఓటమికి కారణం ఆ చెప్పుకోలేకపోవడమేనని నమ్ముతుంటారు.  ఇంతకీ ఆయన హయాంలో చేసి కూడా చెప్పుకోలేకపోయినవి ఏమిటి?  అంత చేసీ ఎందుకు చెప్పుకోలేకపోయారు అన్న విషయంపై సామాజిక మాధ్యమంలో ఓ స్థాయిలో డిబేట్ జరుగుతోంది. వాస్తవానికి ఆయన అరకొరగా అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలకు అంతకు వందింతల ప్రచారం చేసుకున్నారు.   జ‌గ‌న్ చేసిన సంక్షేమ ప‌థ‌కాల ప్ర‌చారానికి ప్రత్యేకంగా ఒక నెట్ వర్కే  ఉండేది.  ఏపీడీసీ వంటి  సంస్థ‌లు కూడా ఆ నెట్ వర్కక లో ఉండేది. ఏపీసీసీని జగన్ ఆంధ్రప్రదేశ్  డిజిట‌ల్ కార్పొరేష‌న్ (ఏపీడీసీ)గా పేరు మార్చి దానికి భారీ ఎత్తున బడ్జెట్ కేటాయించారు.   ఒక నిమిషానికి రెండున్న‌ర వేలు ఇవ్వాల్సింది కాస్తా  ప‌ది ప‌న్నెండు వేలుగా ఇచ్చి.. మ‌రీ వీడియోల రూప‌క‌ల్ప‌న చేశారు. ఇదిలా ఉంటే సంక్షేమ ప‌థ‌కాల బ‌ట‌న్ నొక్కుడు కార్య‌క్ర‌మాల‌కు సిద్దం  సభ‌ల‌క‌న్నా మించిన స‌భ‌లు ఏర్పాటు చేసి... వాటి ద్వారా జ‌నాన్ని పోగేసి సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను కూడా ఏర్పాటు చేశారు. వీటి ద్వారా కూడా జగన్ హయాంలో ప్రభుత్వ సంక్షేమాన్ని గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ప్రచారం నిర్వహించారు.   ఇందుకు ఒక ఎమ్మెల్సీ తన సిబ్బందితో ఈ కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్య‌వేక్షించ‌గా.. వాటిని నాటి మంత్రి పెద్ది రెడ్డి సూప‌ర్వైజ్ చేసేవారు. ఇందుకు రూ.కోట్లు ఖర్చు చేసేవారు. ఇక్కడ చెప్పుకోవల సిందేమిటంటే..  ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు. వారి శోధనలో జగన్ చేసి కూడా చెప్పుకోలేకపోయినవి ఏమిటంటే..  ఎలుక‌లు ప‌ట్ట‌డానికి  కేటాయించిన రూ. 1. 6 కోట్లు, తాడేప‌ల్లి ప్యాలెస్ చుట్టూ కంచె కోసం ఖర్చు చేసిన రూ. 12. 5 కోట్లు, ఎగ్ ప‌ఫ్ ల కోసం రూ. 3. 6 కోట్లు, పాస్ పుస్త‌కాల‌పై తన ఫోటోల కోసం రూ. 13 కోట్లు,  వైయ‌స్ విగ్ర‌హాల ఖ‌ర్చు రూ. 18 కోట్లు, స్కూళ్లు, ఇతర ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేసుకోవడానికి ఖర్చు చేసిన రూ.150 కోట్లు.  తన పర్యటనల కోసం విమానాలు, హెలికాప్టర్ల కోసం ఖర్చు చేసిన  రూ. 222 కోట్లు. వీటి గురించే జగన్ చెప్పుకోలేకపోయారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అంతేనా  రుషికొండ ప్యాలెస్ కి రూ. 600 కోట్లు, బియ్యం సంచులు మోయ‌డానికి  రూ. 700 కోట్లు, స‌రిహ‌ద్దు రాళ్ల‌పై ఫోటోల‌కు ఇంకో రూ. 700 కోట్లు కూడా జగన్ ప్రభుత్వ ధనాన్ని వెచ్చించారు. ఆ ఖర్చుల గురించి కూడా జగన్ జనాలకు చెప్పుకోలేకపోయారట. ఆ కారణంగానే వైసీపీ ఘోరంగా ఓడిపోయిందన్నది జగన్ భావన అని నెటిజనులు తేల్చారు. అవి చెప్పుకోలేకపోవడం వల్లనే కనీసం 11 స్థానాలైనా వచ్చాయనీ, వాటి గురించి కూడా ఘనంగా చెప్పుకుని ఉంటే, అవి కూడా వచ్చేవి కావని సామాజిక మాధ్యమంలో జగన్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. 

కేసీఆర్ కు రేవంత్ షేక్ హ్యాండ్

నిప్పూ ఉప్పులా పరస్పర విమర్శలు గుప్పించుకునే కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ఆసెంబ్లీలో ఆప్యాయంగా పలకరించుకున్న సన్నివేశం అందరినీ అలరించింది. సర్వత్రా ఆసక్తి కలిగించింది. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం (డిసెంబర్ 29) ప్రారంభమైన సంగతి తెలిసిందే. సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ క్షేమ సమాచారాలు అడిగారు. ఆ తరువాత కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ సంఘటన అధికార ప్రతిపక్ష సభ్యులను విస్మయానికి గురి చేసింది. సభా మర్యాదలంటే అలా ఉండాలన్న చర్చ అధికార ప్రతిపక్షాలలో జరిగింది.   అదలా ఉంటే.. రేవంత్ కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన తరువాత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క తదితరులు కూడా కేసీఆర్ ను పలుకరించి ఆయనతో కరచాలనం చేశారు.  ఇక ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించిన నవీన్ యాదవ్ కూడా కేసీఆర్ కు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.  ‎

ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలేంటంటే?

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన సోమవారం (డిసెంబర్ 29) ప్రారంభమైంది. వెలగపూడిలోని సచివాలయంలో జరుగుతున్న ఈ కేబినెట్  భేటీలో రాష్ట్ర అభివృద్ధి,  పాలనాపరమైన కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.  ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా   కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే  కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.  అమరావతిని గ్లోబల్ క్వాంటమ్ హబ్‌గా మార్చే లక్ష్యంతో.. రూ.103.96 కోట్ల వ్యయంతో రెండెకరాల విస్తీర్ణంలో అత్యాధునిక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ చర్చించి ఆమోదముద్ర వేయనుంది.  అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణం, నిర్వహణలో పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టడంపై సీఎం మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.  ఇకపోతే..  రాజధాని అమరావతి అభివృద్ధి పనుల వేగవంతంపై కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలో  సంక్షేమ పథకాల అమలు తీరుపై కూడా సమీక్ష జరిగే అవకాశం ఉంది.   ఇంకా వర్షాకాలంలో రాజధాని పరిసర ప్రాంతాలను వరద ముంపు నుంచి కాపాడేలా ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే  అఖిల భారత సేవా అధికారుల నివాస భవనాలకు అదనపు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు  109 కోట్ల రూపాయల కేటాయింపునకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.   అమరావతి పరిధిలోని శాఖమూరు లో 23 ఎకరాలలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల  నిర్మాణానికీ, అలాగే తాళ్లూరులో  6 ఎకరాలో  హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి కూడా కేబినెట్ పచ్చ జెండా ఊపే అవకాశం ఉంది. ఎల్పీఎస్ జోన్-8 పరిధిలో లేఅవుట్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం  నిధుల కేటాయింపుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక రాజధాని పరిధిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకూ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.  

సినిమాలకు తమిళ హీరో విజయ్ గుడ్ బై.. రాజకీయాలకే పూర్తి సమయం

రాజకీయ నాయకుడిగా మారిన తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పారు. ఆయన తమిళ వెట్రి కళగం అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన పార్టీ సభలో తొక్కిసలాట జరిగి 40 మందికి పైగా మరణించిన సంఘటనతో ఆయన తొలి అడుగులు ఒకింత తడబడ్డాయి.  దాని నుంచి తేరుకుని ముందుకు సాగడానికి ఒకింత సమయం తీసుకున్న విజయ్ ఇప్పుడ పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయించడానికి తీసుకున్న నిర్ణయంలో భాగంగానే  సినిమాల‌కు గుడ్ బై చెప్పారు విజ‌య్.  ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం. వచ్చే ఏడాది త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆ ఎన్నికలకు విజయ్ సర్వసన్నద్ధం అవుతున్నారు.  ఏ పార్టీలతోనూ పొత్తు లేకుండా ఒంటరిగానే ఎన్నికల సమరంలోకి అడుగుపెట్టనున్నట్లు  ఆయన ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే రాజకీయవర్గాలలో విజయ్  టీవీకే పార్టీకి ఉన్న విజయావకాశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలోనే సీఓటర్ సంస్థ నిర్వహించిన సర్వేలో టీవీకే విజయం కంటే ఎన్డీయే కూటమికి భారీ నష్టం కలిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తేలింది.  టీవీకే పోటీ వల్ల బీజేపీ, అన్నాడీఎంకే  కూటమి ఓట్లు భారీగా చీలుతాయని పేర్కొంది. అంటే విజయ్ పార్టీ పోటీ వల్ల లాభపడేది అధికార డీఎంకే అన్నది సీఓటర్ సర్వే సారాశంం.   ఇక సైద్ధాంతికంగా బీజేపీతో, రాజ‌కీయంగా డీఎంకేతోనే త‌మ  పోటీ అని విజయ్ ప్రకటించిన నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. విజయ్ స్వయంగా మధురై ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.  విజయ్ ది చెన్నై. అయితే ఆయ‌న మ‌ధురైని త‌న సొంత  నియోజ‌క‌వ‌ర్గం చేసుకోవాల‌ని భావిస్తున్నారు. స్టార్ హీరో కావడంతో విజయ్ కు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. సామాన్య జనంలోనూ మంచి పాపులారిటీ ఉంది. దీంతో మధురైలో ఆయన స్థానికేతరుడు అన్న సమస్య తలెత్తే అవకాశం ఉండదన్నది పరిశీలకులు అంచనా.    ఇక పోతే విజ‌య్ పార్టీకి సంబంధించినంత వరకూ ఆ పార్టీలో విజయ్ వినా పెద్దగా  ఫెమిలియ‌ర్ ఫేస్ మరొకటి లేదు. ఒక వేళ విజ‌య్ పార్టీలోకి రావడానికి డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ, కాంగ్రెస్ వంటి  పార్టీలు ఆసక్తి చూపుతున్నా.. వారికి రెడ్ కార్పెట్ పరిచి పార్టీలోని ఆహ్వానించడానికి విజయ్ పెద్దగా సుముఖత చూపడం లేదు.  ఆయ‌న వారిని ఏమంత‌గా  తీసుకోవ‌డం లేదు.  ఏపీ నుంచి న‌గ‌రి మాజీ ఎమ్మెల్యే రోజా సైతం త‌న భ‌ర్త ఇన్ ఫ్లూయెన్స్ వాడి విజ‌య్ ఏర్పాటు చేసిన టీవీకేలో చేరాల‌ని ప్రయత్నించినా, ఆమెకు అక్కడ నుంచి పెద్దగా సానుకూలత వ్యక్తం కాలేదని అంటున్నారు. దీంతో పార్టీలో పెద్దగా పాపులర్ అండ్ ఫేమస్ నేతలు లేకపోవడం విజయ్ టీవీకే పార్టీకి ఒకింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.   ఒక తమిళ రాజకీయాలలో ప్రస్తుత పరిస్థితిని ఒక సారి గమనిస్తే.. రాష్ట్రంలో  బీజేపీకి ఉన్న పట్టు అంతంత మాత్రమే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పొత్తులో భాగంగా ఒకటి రెండు స్థానాలు దక్కితే అదే చాలనుకునే పరిస్థితిలో  బీజేపీ ఉంది.  దీంతో ప్రధాన పోటీ  డీఎంకే- టీవీకే మ‌ధ్యే ఉంటుందన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.    ఇక విజ‌య్ టీవీకే పార్టీ నుంచి అత్యధికంగా ఆయన అభిమాన సంఘాల నాయకులకే టికెట్ లు లభించే అవకాశం కనిపిస్తోంది. అంటే టీవీకే తరఫున పోటీ చేసే అభ్యర్థులలో అత్యథికులు ఆ పార్టీ నేత విజయ్ తో కలిసి రాజకీయాలకు కొత్తవారే అవుతారు. ఇది పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు పరిశీలకులు. మొత్తం మీద  డీఎంకే,  టీవీకే మ‌ధ్య  ముఖాముఖీ అన్నట్లుగా జరగనున్న   త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉందనడంలో సందేహం లేదు.  

అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేసీఆర్.. హీట్ మామూలుగా ఉండదుగా?

తెలంగాణ ఆవిర్భావం తరువాత వరుసగా రెండు పర్యాయాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్.. 2023 అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత ప్రతిపక్ష నాయకుడి పాత్రకు పరిమి తమయ్యారు. అయితే ఆ పాత్రలో ఆయన ఎంత మాత్రం క్రియాశీలంగా లేరు. ఓటమి తరువాత ఆయన పూర్తిగా ఇన్ యాక్టివ్ అయిపోయారు. పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ప్రతిపక్ష నేతగా ఆయన అసెంబ్లీకి కూడా హాజరు కాకుండా రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారా అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తూ వస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన  ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.   అయితే పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత, ఆయన అనివార్యంగా రాజకీయాలలో క్రీయాశీలం కావలసిన పరిస్థితి ఏర్పడింది. పార్టీ ఉనికిని కాపాడుకోవడానికీ, పార్టీని బలోపేతం చేయడానికి కేసీఆర్ స్వయంగా నడుంబిగించకుంటే లాభం లేదన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో కూడా బలోపేతం అవుతోంది. దీంతో తన పొలిటికల్ అజ్ణాత వాసానికి ఫుల్ స్టాప్ పెట్టి జనంలోకి రావడానికి సిద్ధమైపోయారు. తాజాగా ఇటీవల ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో జరిపిన సమావేశంలో ఇక నుంచీ తాను పొలిటికల్ గా క్రియాశీలమౌతాననీ,  అదే సమయంలో అసెంబ్లీలో పార్టీ తరఫున బలమైన గొంతు వినిపించాల్సిన అవసరాన్ని గట్టిగా చెప్పారు. ఈ మాటలే ఆయన ఈ సారి అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరు అవుతారని తేటతెల్లం చేసింది. అయినా ఎక్కడో ఏదో అనుమానం.  గతంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో కూడా ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తారనీ, అధికార పక్షాన్ని తన ప్రశ్నల పరంపరతో ఉక్కిరిబిక్కిర చేస్తారనీ బీఆర్ఎస్ వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.  కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలను సభ సాక్షిగా ఎండగడతారనీ బీఆర్ఎస్ శ్రేణులు గట్టిగా నమ్మాయి. అయితే  అయితే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. గొంతు విప్పలేదు. ఫామ్ హౌస్ గడప దాటలేదు. మరి ఇప్పుడైనా అసెంబ్లీకి వస్తారా? అన్న అనుమానాలు పరిశీలకుల నుంచే కాదు, పార్టీ శ్రేణులనుంచి కూడా వ్యక్తం అయ్యాయి. అయితే ఆ అనుమానాలన్నిటినీ పటాపంచలు చేస్తూ కేసీఆర్ ఈ సారి అసెంబ్లీ హాజరౌతున్నారు. సోమవారం (డిసెంబర్ 29) ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు.  ఇక ఇప్పుడు ఆయన అసెంబ్లీలో గొంతు విప్పి రేవంత్ సర్కార్ ను ఇరుకున పెడతారా? స్పీకర్ ఆయనకు కోరినంత సమయం మైక్ ఇస్తారా? లేకుంటే? అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేసీఆర్  తలపడితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఎవరు పై చేయి సాధిస్తారు అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతున్నది. మొత్తం మీద కేసీఆర్ హాజరుతో ఈ శీతాకాల సమావేశాలు రోహిణీ కార్తెను మించిన హీట్ తో సాగుతాయనడంలో ఎలాంటి సందేహాలు లేవంటున్నారు. 

కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామ్ తో చంద్రబాబు భేటీ.. ఎక్కడంటే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా సీఎం చంద్రబాబు ఆమెతో భేటీ అయ్యారు. ఇరువురి మధ్యా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పలు అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ  అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.   రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి   సహకారం, బడ్జెట్ లో ప్రాధాన్యత వంటి అంశాలను చంద్రబాబు ఆమెతో ప్రస్తావించినట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం చంద్రబాబు కృష్ణా జిల్లా  పెద్దఅవుటపల్లిలోని మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు నివాసానికి వెళ్లారు ఆయనను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కంభంపాటి తల్లి వెంకటనరసమ్మ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కంభంపాటి రామ్మోహనరావు ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు.   వెంకటనరసమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

దేశం శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధికి కారణం ఇందిరా, రాజీవ్‌లే : టీపీసీసీ చీఫ్

  శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా గాంధీ, పటేల్ చిత్రపటాలకు పూలమాల సమర్పించి టీపీసీసీ చీఫ్ నివాళులు అర్పించారు. ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని ప్రగతి పథంలో నడిపింది పీవీ నరసింహారావు అని గుర్తు చేశారు. పేద ప్రజలకు ఉపయోగపడేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని తీసుకొస్తే మోదీ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.  మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామ మహారథి జాతి నిర్మాణ సారథి. ప్రజాస్వామ్య ఆకాంక్షల వారధి. పేదల ఆకలి తీర్చిన పెన్నిధి. 140 కోట్ల భారతీయుల ప్రతినిధి. 141 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం.  కార్యకర్తల చెమట చుక్కలే సిరా చుక్కలై రాసిన చరిత్ర కాంగ్రెస్. కార్యకర్తలకు, నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అని రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు.

ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు కాంగ్రెస్ నిరసనలు

  జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రను గ్రామీణ ప్రజలకు తెలియజేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చిందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రేపు (28న) గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే జిల్లా కేంద్రాలలో కాంగ్రెస్ శ్రేణులు మహాత్మాగాంధీ చిత్రపటాలను పట్టుకొని నిరసన కార్యక్రమాలు చేపట్టాయని ఆయన తెలిపారు. ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మహాత్మా ఉపాధి హామీ పథక అమలు బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం పక్కకు తప్పుకోవాలని చూస్తోందని, పేదలు, గ్రామీణ కూలీలకు భరోసాగా ఉన్న ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే గాంధీ పేరును తొలగించే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. దీనికి నిరసనగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 28న రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాల వద్ద, గాంధీ చిత్రపటాలను పట్టుకొని నిరసనలు తెలియజేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి, పనికి ఇచ్చే గౌరవాన్ని ప్రజలకు వివరంగా తెలియజేయాలని సూచించారు.రేపు జరగబోయే నిరసన కార్యక్రమాలను పెద్దఎత్తున విజయవంతం చేయడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకుడు కృషి చేయాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.