లోక్ సభలో తెలంగాణ బిల్లు పెట్టిన కాంగ్రెస్
posted on Feb 13, 2014 @ 11:38AM
తెలంగాణ బిల్లుపై దేశ రాజధానిలో నెలకొన్న ఉత్కంఠకు కాంగ్రెస్ అధిష్టాన౦ తెరదించింది. లోక్ సభలో గంధరగోళ పరిస్థితుల మధ్య నాటకీయంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును 12గంటలకు సుశీల్ కుమార్ షిండే సభలో ప్రవేశపెట్టారు. దీంతో సభలో తీవ్ర ఉద్రిక్త వాతావారణం నెలకొంది. సీమాంధ్ర ఎంపీలు సమైక్యనినాదాలు చేస్తూ బల్లలపైకి ఎక్కి మైకులు విరకొట్టి, దస్త్రాలు పడేశారు. లోకసభ లో సీమాంధ్ర ఎంపీ లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చల్లడంతో దాని ఘాటుకి దగ్గు, కళ్ళ నుంచి నీళ్ళు రావడంతో ఏం జరుగుతుందో తెలియక భయంతో ఎంపీలు బయటకు పరుగులు తీశారు. లోక్ సభను స్పీకర్ వాయిదా వేశారు.
Watch This Video