Read more!

షర్మిలకు తెలంగాణ సెగ, వైకాపా దాడి

 

 

షర్మిల పాదయాత్రకు తెలంగాణ సెగ తగిలింది. మహబూబ్ నగర్ జిల్ల వడ్డేపల్లి మండలం శాంతినగర్‌లో షర్మిల పాదయాత్రను తెలంగాణ వాదులను అడ్డుకున్నారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పాలని, జైతెలంగాణ అనాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యకర్తలు తెలంగాణవాదులపై విరుచుకుపడి విపరీతంగా చితకబాదారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి తెలంగాణ వాదులపై లాఠీ ఝళిపించారు. పలువురు తెలంగాణ వాదులను పోలీసులు అరెస్టు చేశారు.



తెలంగాణవాదులపై వైఎస్‌ఆర్‌సీపీ నేతల దాడికి నిరసనగా ఐజాలో టీఆర్‌ఎస్‌వీ కార్యకర్తలు ఐజా చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు.  భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణపై వైఎస్‌ఆర్‌సీపీ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ వడ్డేపల్లి మండలం శాంతినగర్‌లో తెలంగాణవాదులు షర్మిల పాదయాత్రను అడ్డుకుంటే వైఎస్‌ఆర్‌సీపీ నేతలు దాడి చేశారు. దీనికి నిరసనగా ఈ రాస్తారోకో జరుగుతుంది.