Read more!

కొండచరియలు విరిగిపడి 12 మంది మృతి

 

మన పొరుగుదేశం నేపాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తూ వుండటంతో నేపాల్ పడమర ప్రాంతంలో వున్న గుల్మి జిల్లాలో కొండచరియలు విరిగి ఓ ఇంటిమీద పడటంతో ఆ ఇంటిలో నివసిస్తు్న్న ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిదిమంది అక్కడికక్కడే మరణించారు. మరణించిన వారిలో నలుగురు చిన్నపిల్లలు కూడా వున్నారు. అలాగే నేపాల్‌లోని పైథాన్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడి ముగ్గురు మరణించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నేపాల్‌లో ఇప్పటికే అనేకమంది గల్లంతయ్యారు. వర్షాలు తగ్గుముఖం పట్టాకే ఎంత ప్రాణ నష్టం జరిగింది, ఎంత ఆస్తి నష్టం జరిగిందనేది అంచనాలకి దొరికే అవకాశం వుంది.