Read more!

మంత్రి దానం కాన్వాయ్ పై దాడి..అద్దాలు ధ్వంసం

 

 

 

 

మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద మంత్రి దానం నాగేందర్ కాన్వాయ్పై తెలంగాణవాదులు గురువారం దాడి చేశారు. దాడిలో మంత్రి వాహనం అద్దాలు ధ్వంసం అయ్యాయి. కాగా దాడికి పాల్పడినవారిలో ఒకరిని దానం నాగేందర్ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దాడి నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సంఘటనతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రం ఇస్తుందన్న సంకేతాలున్నాయని అన్న దానం నాగేందర్ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అన్నారు. ఆ తరువాత రోజే ఆయన తెలంగాణ ఇస్తే హైదరాబాద్ ను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని మరో మంత్రి ముఖేష్ గౌడ్ తో కలిసి డిమాండ్ చేశారు. సీమాంధ్ర నేతలతో కుమ్మక్కయిన దానం ఇలా మాట మార్చి తెలంగాణకు అడ్డుపడుతున్నాడని తెలంగాణ వాదులు ఆగ్రహంగా ఉన్నారు.