బాలకృష్ణ ఆ పార్టీకి ఎందుకు వెళ్లలేదో?
on Nov 25, 2019
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్' టెన్త్ ఇయర్ రీయూనియన్ పార్టీకి ముంబై నుండి జాకీ ష్రాఫ్ వచ్చారు. చెన్నై నుండి భాగ్యరాజా, ప్రభు, సుహాసిని, రేవతి, ఖుష్బూతో పాటు శరత్ కుమార్, రాధిక దంపతులు వచ్చారు. బెంగళూరు నుండి సుమలత, రమేష్ అరవింద్ తదితరులు వచ్చారు. కేరళ నుండి మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, జయరామ్, రెహమాన్, లిజి, శోభన తదితరులు వచ్చారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి నాగార్జున, అమల దంపతులు, వెంకటేష్, జయప్రద, జయసుధ, భానుచందర్, సుమన్ తదితరులు వచ్చారు. మొత్తం మీద 40మంది వరకూ హాజరయ్యారు.
ఈ పార్టీకి రజనీకాంత్, కమల్ హాసన్ రాకపోవడం ఫిలింనగర్ సర్కిల్స్ లో డిస్కషన్ పాయింట్. ఎందుకంటే... చెన్నైలో ఎప్పుడు 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్' రీయూనియన్ పార్టీ జరిగినా వీరిద్దరిలో ఎవరో ఒకరు కచ్చితంగా కనిపించేవారు. ఈసారి హైదరాబాద్ లో, చిరంజీవి ఇంట్లో జరిగింది. తమిళ ఇండస్ట్రీలో టాప్ స్టార్స్ అయిన వీరిద్దరితో చిరుకు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. ఎందుకు రాలేదో మరి?
ముఖ్యంగా రజనీ, కమల్ కంటే హైదరాబాద్ లో, చిరు ఇంట్లో జరిగిన పార్టీకి బాలకృష్ణ అటెండ్ కాకపోవడం ఫిలింనగర్ సర్కిల్స్ లో మెయిన్ డిస్కషన్ పాయింట్. ఇంతముందు చెన్నైలో జరిగిన పార్టీల్లో బాలకృష్ణ కనిపించారు. ఉత్సాహంగా పాల్గొన్నారు. 2017లో ఒకసారి పార్టీకి వెళ్ళలేదు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళలేదు. ఆదివారం రాత్రి చిరంజీవి ఇంట్లో జరిగిన పార్టీ ఫోటోలు బయటకు రాగానే... బాలకృష్ణ ఎందుకు పార్టీకి వెళ్లలేదో అనే డిస్కషన్ మొదలైంది. బహుశా... 'రూలర్' షూటింగులో బిజీగా ఉండడంతో ఆయన వెళ్లి ఉండకపోవచ్చని సమాచారం.