వెంకటేష్ తర్వాతే చిరంజీవి!!
on Jan 10, 2019
ఇప్పటికే త్రివిక్రమ్- అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన కూడా అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే ...త్రివిక్రమ్...వెంకటేష్ తో కూడా ఓ సినిమా కమిటయ్యాడట. ఈ విషయాన్ని స్వయంగా వెంకటేష్ ....`ఎఫ్2` సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు. `మల్లీశ్వరి, నువ్వునాకు నచ్చావ్ చిత్రాలకు కథా, మాటలు అందించాడు త్రివిక్రమ్. అప్పటి నుంచి వీరి కలయికలో సినిమా రాలేదు. ఆ తరహాలో ఓ సినిమా చేయబోతున్నామంటూ వెంకీ చెప్పుకొచ్చాడు. అయితే ఇటీవల `వినయ విధేయ రామ` ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి కూడా త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. మరి ఈ రెండిట్లో ఏది ముందుంటుంది అంటూ ఇప్పుడు అందరిలో ఓ సందిగ్థంమొదలైంది. ఫిలింనగర్ సమాచారం ప్రకారం...ప్రస్తుతం చిరంజీవి సైరా లో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల సినిమా ఉంటుంది. ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యే లోపు తివిక్రమ్ అల్లు అర్జున్, వెంకటేష్లతో సినిమాలు చేయాలన్న ఆలోచనలో ఉన్నాడట. దీన్ని బట్టి చూస్తుంటే వెంకటేష్ సినిమా తర్వాతే త్రివిక్రమ్ చిరంజీవితో సినిమా చేయబోతున్నాడని అర్ధమవుతోంది.