వైరల్ న్యూస్.. డిసెంబర్లో త్రిష, శింబు పెళ్లి?
on Oct 16, 2020
సెప్టెంబర్ నెల మొదట్లో త్రిష, శింబు పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. ఈ విషయంలో అఫిషియల్ అప్డేట్ లేకపోయినప్పటికీ, ఈ వదంతులు సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఫ్యాన్స్ ఆ ప్రచారాన్ని అన్ని ప్లాట్ఫామ్ల మీదా షేర్ చేశారు. లేటెస్ట్గా మరోసారి ఈ వార్త ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తోన్న శింబు తండ్రి టి. రాజేందర్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా, శింబు పెళ్లి గురించిన ప్రశ్న ఆయనకు ఎదురైంది.
అవునో, కాదో నేరుగా చెప్పకుండా, నవ్వుతూ ఆ ప్రశ్నను దాటేశారు. దీంతో త్రిష, శింబు పెళ్లి వార్తలు మరోసారి గుప్పుమన్నాయి. ఈ ఏడాది డిసెంబర్లో గుడ్ న్యూస్ అనౌన్స్ చేస్తానని శింబు ఇదివరకు చెప్పాడు. అది పర్సనల్ లైఫ్కు సంబంధించిందా, లేక, ప్రొఫెషనల్ లైఫ్కు సంబంధించిందా అనే విషయం అతను వెల్లడించలేదు. దాంతో అది త్రిషతో పెళ్లి విషయమే అయివుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
గమనించదగ్గ విషయమేమంటే, 'ఏ మాయ చేశావే' సినిమాలో జంటగా నటించిన నాగచైతన్య, సమంత ప్రేమలో పడి, పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అదే సినిమా తమిళ వెర్షన్ 'విన్నైతాండి వరువాయ'లో జోడీగా నటించిన శింబు, త్రిష కూడా ప్రేమలో పడటం, పెళ్లి వదంతులు వస్తుండటం విశేషం.
Also Read