బాప్రే.. ఆ హీరో సినిమాకి రూ.30 కోట్లు తీసుకుంటున్నాడా?
on Sep 15, 2020
బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ ఒక్క సినిమాకు 30 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడని ముంబై వర్గాల తాజా సమాచారం. అతడి సినిమాలకు విమర్శకుల నుంచి టాప్ రేటింగులు రాకపోయినా... బాక్సాఫీస్ దగ్గర టాప్ కలెక్షన్లు వస్తున్నాయి. అలవోకగా వంద కోట్ల రూపాయల వసూళ్లను సాధిస్తున్నాయి. అందుకని, నిర్మాత జాకీ భగ్నాని అతడికి 30 కోట్ల రూపాయల పారితోషికం ఇవ్వడానికి ముందుకు వచ్చారట.
వికాస్ బెహల్ దర్శకత్వంలో టైగర్ ష్రాఫ్ హీరోగా జాకీ భగ్నాని ఒక సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్పోర్ట్స్ బెస్ట్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసమే 30 కోట్లు ఇస్తున్నారట. టైగర్ ష్రాఫ్ తీసుకుంటున్న అత్యధిక పారితోషికం ఇదే.
'పరుగు' హిందీ రీమేక్ 'హీరోపంతి'తో హీరోగా పరిచయమైన టైగర్ ష్రాఫ్ ఒకప్పటి హీరో జాకీ ష్రాఫ్ కుమారుడు. 'బాఘి' సిరీస్ చిత్రాలతో యాక్షన్ హీరోగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. హృతిక్ రోషన్ తో కలిసి నటించిన 'వార్' సైతం బ్లాక్బస్టర్ సాధించింది. దాంతో అతడి మార్కెట్ పెరిగింది.