సరిలేరు నీకెవ్వరు` రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడంటే...??
on Jun 12, 2019
మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి ప్రజంట్ హాలీడే ట్రిప్ లో జాలీగా గడుపుతున్నాడు. ఇక ట్రిప్ నుంచి రాగానే హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందనున్న `సరిలేరు నీకెవ్వరు` షూటింగ్ లో బిజీ కానున్నాడు. మిలటరీ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాలో మహేష్ ఆర్మీ మేజర్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావొస్తున్నాయి. ఇక జూలై 1 నుంచి జమ్మూ కశ్మీర్ లో ఫస్ట్ షెడ్యూల్ ని ప్రారంభించనున్నటల్లు వార్తలు వస్తున్నాయి. ఈ షెడ్యూల్ మహేష్ పై కొన్ని సినిమాకు అతి కీలకమైన సీన్స్ పిక్చరైజ్ చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేసారట. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న నటిస్తోంది.
విజయశాంతి, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రల్లో అలరించనున్నారు. ఇప్పటికే దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకోసం రెండు అద్భుతమైన ట్యూన్స్ కూడా రెడీ చేసాడట. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో సైనికుల గొప్ప తనాన్ని చెప్పే విధంగా ఒక పేట్రియాటిక్ సాంగ్ కూడా పెట్టనున్నారట. ఎఫ్ 2 విజయంతో అనిల్ రావిపూడి, మహర్షి విజయంతో మహేష్ మాంచి జోష్ లో ఉన్నారు. దీంతో సరిలేరు నీకెవ్వరు పై భారీ ఎక్స్ పెక్టేషన్సే ఏర్పాడ్డాయి. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకోనుందో తెలియాలంటే 2020 సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.