డ్రగ్ కేసులో తన పేరు వెల్లడైన సమయంలో గోవాలో ఎంజాయ్ చేస్తున్న సారా!
on Sep 13, 2020
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఇంటరాగేషన్లో డ్రగ్స్ వాడుతున్న 25 మంది దాకా బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లను రియా చక్రవర్తి వెల్లడించిందంటూ ప్రచారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ పేర్లలో రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ పేర్లు బయటకు వచ్చాయి. సుశాంత్సింగ్ రాజ్పుత్తో కలిసి ఆ ఇద్దరు తారలు డ్రగ్స్ తీసుకున్నారని రియా చెప్పినట్లు 'పింక్విల్లా' ఓ రిపోర్ట్లో వెల్లడించింది. అదే నిజమైతే, ఆ ఇద్దరినీ ఎన్సీబీ అతి త్వరలోనే విచారించే అవకాశాలున్నాయి.
సారా పేరు బయటకు వచ్చిన సమయంలో ఆమె ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోక మానరు. అప్పుడామె తన సోదరుడు ఇబ్రహీం అలీఖాన్, మరికొంతమంది స్నేహితులతో కలిసి గోవా బీచ్లలో ఎంజాయ్ చేస్తోంది. సారా ఫ్యాన్ పేజ్లో అందుకు సంబంధించిన కొన్ని పిక్చర్లు దర్శనమిచ్చాయి. వాటిలో ఓ పిక్చర్లో సారా ఇద్దరు స్నేహితురాళ్లను గట్టిగా హగ్ చేసుకుంటూ ఉండగా, మరో రెండు పిక్చర్లలో మగ స్నేహితుల భుజాలపై ఎక్కి కూర్చున్న సారా, ఆమె స్నేహితురాళ్లు ఒకళ్ల చేతులను మరొకరు పట్టుకొని ఉన్నారు. ఇబ్రహీం కూడా ఓ స్నేహితురాలిని అలాగే మోస్తున్నాడు.
ఓవైపు సుశాంత్, సారా మధ్య రిలేషన్షిప్ బ్రేకప్ అయిన వార్తలు హల్చల్ చేస్తూ, మరోవైపు రియా చక్రవర్తిని మొదట సీబీఐ అధికారులు, తర్వాత ఎన్సీబీ అధికారులు ఇంటరాగేట్ చేస్తున్న వార్తలు, వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతుండగా, సారా మాత్రం హాయిగా తన స్నేహితులతో గోవాలో ఎంజాయ్ చేస్తుండటం చూసి ఔరా అనుకుంటున్నారు నెటిజన్లు!
Also Read