శర్వానంద్ ప్లేస్లో రానా వచ్చాడు!!
on Nov 2, 2018
విభిన్నమైన కాన్సెప్ట్ తో వేణు ఉడుగుల దర్శకత్వంలో వచ్చిన చిత్రం `నీదినాది ఒకే ప్రేమ కథ`. శ్రీ విష్ణు హీరోగా నటించిన ఈ చిత్రం క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూస్ రాబట్టుకుంది. అయితే వేణు ఉడుగుల తన తదుపరి చిత్రంగా `విరాట పర్వం` అనే చిత్రం చేస్తున్నాడు. అయితే ఇందులో మొదట శర్వానంద్, సాయి పల్లవి హీరో హీరోయిన్స్ గా అనుకున్నారు. కానీ శర్వానంత్ బిజీగా ఉండటంతో ఇప్పుడు శర్వానంద్ ప్లేస్ రానాను తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం శర్వానంద్, సాయి పల్లవి జంటగా `పడి పడిలేచే మనసు` చిత్రం రూపొందుతుంది. ఇది కంప్లీట్ కావొచ్చింది. రానా కూడా మరో రెండు చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇవి కంప్లీట్ అయిన వెంటనే రానా, ఫిదా బ్యూటీ సాయి పల్లవి సినిమా ప్రారంభమవుతుందట. ఇప్పటికే స్ర్కిప్టు పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.