'భగవద్గీత సాక్షిగా' మెగా హీరో మూవీ!
on Jul 15, 2020
రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ 'చిత్రలహరి', 'ప్రతిరోజూ పండగే' తర్వాత 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు మెగా హీరో సాయిధరమ్ తేజ్. మే 25న రిలీజ్ చేసిన 'నో పెళ్లి' సాంగ్కు మంచి రెస్పాన్స్ వచ్చి, ఇప్పటికి 12 మిలియన్ వ్యూస్ పైగా సాధించింది. డెబ్యూ డైరెక్టర్ సుబ్బు రూపొందిస్తోన్న ఈ మూవీకి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ స్వరాలు కూరుస్తున్నాడు. థియేటర్లు ఓపెన్ అయితే సినిమా రిలీజ్ చెయ్యడానికి నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ సెట్స్ మీద ఉండగానే మరో స్క్రిప్ట్కు సాయితేజ్ ఓకే చెప్పాడు. అది 'ప్రస్థానం' ఫేమ్ దేవా కట్టా డైరెక్షన్లో.
అదింకా సెట్స్ మీదకు వెళ్లకుండానే గోపాల్ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ సాయికి బాగా నచ్చేసిందనీ, దానికి కూడా అతను సరేనన్నాడనీ ఫిల్మ్నగర్లో ప్రచారం జరుగుతోంది. అంతే కాదు.. ఆ సినిమా టైటిల్ 'భగవద్గీత సాక్షిగా' అనేది కూడా బయటకు వచ్చేసింది. ప్రస్తుతం రవితేజతో 'క్రాక్' సినిమా తీస్తున్న ఠాగూర్ మధు ఈ సినిమాని నిర్మించనున్నట్లు సమాచారం. 'భగవద్గీత సాక్షిగా' కథ, టైటిల్ చిరంజీవికి కూడా నచ్చాయంటున్నారు. ఇంతకీ సాయితేజ్ తర్వాతి సినిమా దేవా కట్టాతో ఉంటుందా, లేక 'భగవద్గీత సాక్షిగా' చేస్తాడా అనేది ఆసక్తికరం.