రష్మిక హీరోకు కరోనా!
on Jul 15, 2020
వెటరన్ స్టార్ యాక్టర్ అర్జున్ సోదరుని కుమారుడు, ఇటీవల హార్ట్ ఎటాక్తో ఆకస్మికంగా మృతి చెందిన చిరంజీవి సర్జా తమ్ముడు ధ్రువ సర్జా కరోనా వైరస్ బారిన పడ్డాడు. అతనితో పాటు భార్య ప్రేరణకు కూడా టెస్ట్లో పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఆ ఇద్దరూ ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ధ్రువ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ధ్రువీకరించాడు. "నా భార్య, నేను ఇద్దరం కొవిడ్-19 పాజిటివ్గా టెస్టుల్లో నిర్ధారణ అయ్యింది. మాకు స్వల్పంగా లక్షణాలు కనిపించాయి. డాక్టర్ల సలహా మేరకు హాస్పిటల్లో చేరాం. మళ్లీ మేం సాధారణ స్థితికి వస్తామని నమ్మకంతో ఉన్నాం. మాతో సన్నిహితంగా మెలగిన వాళ్లందరూ దయచేసి టెస్ట్ చేయించుకొని క్షేమంగా ఉండాల్సిందిగా కోరుతున్నా. జై ఆంజనేయ" అని అతను ట్వీట్ చేశాడు.
కాగా అతని ఇతర కటుంబ సభ్యుల శాంపిల్స్ను బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) అధికారులు టెస్టులకు పంపారు. ధ్రువ ఇంటికి సీల్ వేశారు. ధ్రువ దంపతులకు వైరస్ ఎలా సోకిందనేది ఇంకా తేలలేదు. వాళ్ల ఇంటి పరిసరాల్లో వైరస్ ఏమైనా వ్యాప్తి చెందిందా, లేదా అనే విషయాన్ని బీబీఎంపీ పరిశీలిస్తోంది.
ఇటీవల ధ్రువ సర్జా హీరోగా నటిస్తోన్న 'పొగరు' సినిమా వార్తల్లో నిలిచింది. అందులో హీరోయిన్గా రష్మికా మందన్న నటిస్తోంది. ఆ ఇద్దరిపై తీసిన ఓ పాటను కొద్ది రోజుల క్రితం విడుదల చేశారు. ఆ పాట చాలా హింసాత్మకంగా ఉందనీ, పాటలో హీరోయిన్ రష్మికను ధ్రువ టీజ్ చేసిన విధానం దారుణంగా ఉందంటూ విమర్శలు వెల్లువెత్తాయి.