రానా పెళ్లి గ్రూప్ ఫొటో.. రామానాయుడు ఒక్కరు మిస్సయ్యారు!
on Aug 8, 2020
టాలీవుడ్ అందగాడు రానా దగ్గుబాటి, ఇంటీరియర్ డిజైనర్ మిహీకా బజాజ్ వివాహం శనివారం రాత్రి రామానాయుడు స్టూడియోస్లో కొద్దిమంది అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన విషయం తెలిసిందే. వధూవరుల కుటుంబ సభ్యులతో పాటు అక్కినేని ఫ్యామిలీలోని నాగచైతన్య, సమంత దంపతులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. రానాకు చైతూ మేనత్త కుమారుడనే విషయం తెలిసిందే. చైతూ తల్లి లక్ష్మి కూడా ఈ పెళ్లికి వచ్చారు.
ఈ సందర్భంగా దగ్గుబాటి ఫ్యామిలీతో పాటు వీరంతా కలిసి గ్రూప్ ఫొటో దిగారు. అందులో ఒకే ఒకరు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వ్యక్తి.. రామానాయుడు. పెద్ద మనవడి పెళ్లి చూసుకోకుండానే ఐదేళ్ల క్రితం రామానాయుడు మృతి చెందారు. రానా పెళ్లి గ్రూప్ ఫొటోలో రామానాయుడి సతీమణి రాజేశ్వరి ఆయనను గుర్తుకు తెచ్చారు. రామానాయుడి ఇద్దరు కుమారులు సురేశ్బాబు, వెంకటేశ్, ఇద్దరు కోడళ్లు, కుమార్తె లక్ష్మి, మనవళ్లు, మనవరాళ్లు కలిసి ఉన్న ఈ గ్రూప్ ఫొటో ఆన్లైన్లో వైరల్గా మారింది. రానా పెళ్లి ఆల్బమ్కు ఈ ఫొటోనే హైలైట్.
Also Read