రానా-మిహీకా పెళ్లి వేడుకకు స్ఫూర్తి ఈ పెయింటింగే!
on Aug 10, 2020
ప్రేమించిన వాళ్లను పెళ్లి చేసుకోవడం కంటే ఆనందకరమైంది ఈ ప్రపంచంలో ఇంకేముంటుంది! టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి అలాంటి ఆనందాన్నే అనుభూతి చెందుతున్నాడు. ఈవెంట్ ప్లానర్ మిహీకా బజాజ్తో తన అనుబంధాన్ని రానా వెల్లడి చేసినప్పుడు దేశమంతా షాక్ అయ్యింది. ఈ ఏడాది మే 20న అండ్ ఇట్స్ అఫిషియల్ అంటూ మిహీకాతో తను కలిసున్న ఫొటోను షేర్ చేశాడు రానా. అంటే అప్పటికే వాళ్లిద్దరి కుటుంబాలు కలిసి కూర్చొని మాట్లాడుకోవడం అయిపోయిందన్న మాట. దానికి సంబంధించిన రెండు ఫొటోలను మిహీకా షేర్ చేసింది. "To the beginning of forever @ranadaggubatiష, "My happy place! @ranadaggubati." అని ఆమె పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆగస్ట్ 8న పెళ్లి చేసుకొని ఇద్దరూ అధికారికంగా దంపతులయ్యారు.
ఫారెస్ట్ థీమ్తో వారి పెళ్లి జరిగింది. దాని వెనుక ఉన్నది స్వయంగా వెడ్డింగ్ ప్లానర్ అయిన బంటీ బజాజ్.. మిహీకా తల్లి! పైగా ఇది తన కూతురి పెళ్లాయె. అందుకు మరింత శ్రద్ధగా ఈ వేడుకను ఆమె ప్లాన్ చేశారు. వివాహ వేదిక అలంకరణల కోసం ఆమె ఎక్కడ నుంచి స్ఫూర్తి పొందారో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. విఖ్యాత తెలంగాణ చిత్రకారుడు తోట వైకుంఠం పెయింట్ చేసిన రాధాకృష్ణుల బొమ్మను స్ఫూర్తిగా తీసుకుని బంటీ బజాజ్ వివాహ వేడుక ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. ఈ విషయాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఆమె పంచుకున్నారు. ఆ రాధాకృష్ణుల పెయింటింగ్ అంటే రానాకు బాగా ఇష్టమని తెలుసుకొని, ఆ పెయింటింగ్ కేంద్రంగా వేదికను ఆమె తీర్చిదిద్దానని ఆమె తెలిపారు.
Also Read