బాలకృష్ణ చిత్రంలో రమ్యకృష్ణ?
on Feb 27, 2021
నటసింహ నందమూరి బాలకృష్ణకి అచ్చొచ్చిన కథానాయికల్లో రమ్యకృష్ణ ఒకరు. వీరిద్దరి కాంబోలో వచ్చిన తొలి, మలి చిత్రాలు `బంగారు బుల్లోడు`, `వంశానికొక్కడు` బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. ఆ తరువాత వచ్చిన `దేవుడు` నిరాశపరచగా.. `వంశోద్ధారకుడు` ఫర్లేదనిపించింది.
కట్ చేస్తే.. మరోమారు బాలయ్యతో కలిసి నటించబోతున్నారట రమ్య. అయితే, ఈ సారి హీరోయిన్ గా కాదు.. నెగటివ్ టచ్ ఉన్న రోల్ లో. ఆ వివరాల్లోకి వెళితే.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మాస్ ఎంటర్ టైనర్ మే నుంచి సెట్స్ పైకి వెళ్ళనుంది. కాగా, ఈ సినిమాలో కీలక పాత్ర కోసం రమ్యకృష్ణతో సంప్రదింపులు జరుపుతున్నారట. గోపీచంద్ గత చిత్రం `క్రాక్`లో వరలక్ష్మీ శరత్ కుమార్ పోషించిన జయమ్మ పాత్ర తరహాలో ఈ క్యారెక్టర్ ఉంటుందని టాక్. త్వరలోనే బాలయ్య - గోపీచంద్ కాంబో మూవీలో రమ్యకృష్ణ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.