రామ్చరణ్ కన్ఫర్మ్ చేశాడు!!!
on Nov 30, 2018
రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో `వినయ విధేయ రామ` చిత్రం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఓ పాట మినహా టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసుకుంది. త్వరలో ఓ స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. అయితే ఈ పాటకోసం ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ ను సంప్రదించారు. అందులో మొదట ఇలియానాను సంప్రదించారు. ఆమె ఓకే చెప్పినప్పటికీ రెమ్యూనిరేషన్ పరంగా భారీ మొత్తంలో డిమాండ్ చేసిందట. దీంతో చిత్ర బృందం ఆమెను పక్కన పెట్టి మరో యంగ్ హీరోయిన్ కేథరిన్ సంప్రదించినట్లు తెలుస్తోంది. గతంలో క్యాథరిన్ బోయపాటి చేసిన సినిమాల్లో నటించింది. దీంతో ఆమె అడిగిన వెంటనే ఓకే చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ పాటను గ్రాండ్ గా చిత్రీకరించనున్నారు. కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రశాంత్ , స్నేహ ఇంపార్టెంట్ రోల్స్ లో నటిస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ చేయనున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. డి.వి.వి దానయ్యనిర్మిస్తున్నారు.