ప్రధాని మోడీకి రాఖీ సావంత్ రిక్వెస్ట్..!
on Apr 5, 2016
నిత్యం వార్తల్లో ఉండటం కొంతమందికి చాలా ఇష్టం. తమను ఎవరూ పట్టించుకోకపోయినా, ఏదోక న్యూస్ తో జనాల నోళ్లలో నలుగుతుండాలి అని భావిస్తారు వాళ్లు. ఆ కోవలోకే వస్తుంది రాఖీ సావంత్. ఐటెం గాళ్ గా హద్దులు దాటేసినా, రాఖీ కా స్వయంవర్ పేరుతో పెళ్లి చేసుకుని వదిలేసినా, అది ఆమెకే చెల్లింది. తాజాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో, రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రత్యూష బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్, ఆమెను నిరంతరం హింసించేవాడని, ఆమెను కొట్టద్దని రాహుల్ కు తాను చాలాసార్లు చెప్పానంటోంది. ఆమె మరణానికి పరిహారంగా, ప్రత్యూష కుటుంబానికి 5 కోట్లు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తోంది రాఖీ. మరో వైపు ఇండియాలో సీలింగ్ ఫ్యాన్స్ వాడకాన్ని పిఎం మోడీ బ్యాన్ చేయాలని, భారతీయులందరూ కూడా తమ ఇళ్లలో ఉన్న సీలింగ్ ఫ్యాన్స్ అన్నింటినీ పీకి బయటపారేయాలని సూచిస్తోంది. తప్పదనుకుంటే టేబుల్ ఫ్యాన్ లేదా ఏసీలను వాడాలని సలహా ఇస్తోంది. కాగా ప్రత్యూష ఆత్మహత్య కేసులో ఆమె ప్రియుడు రాహుల్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో, ఆమె మరణం వెనుక మిస్టరీ వీడిపోయే అవకాశం ఉంది.