కరోనాపై సినిమాలో హీరోగా సమంత మనవడు
on Aug 8, 2020
'ఓ బేబీ' సినిమాలో మనవడి పాత్రలో నటించిన తేజ సజ్జ గుర్తున్నాడు కదా! అదేనండీ సమంతగా మారిన లక్ష్మీకి మనవడిగా నటించాడు. ప్రస్తుతం కరోనాపై తెరకెక్కుతున్న ఓ సినిమాలో అతడు కథానాయకుడిగా నటిస్తున్నాడు. దర్శకుడిగా 'అ!', 'కల్కి' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ, కరోనా వైరస్ మీద ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు. ఇంకా ఈ సినిమాలో హర్షవర్ధన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో రెండో చిత్రమిది. వీళ్ళిద్దరూ చాలా ఏళ్లుగా స్నేహితులు. ఆల్రెడీ ప్రశాంత్ వర్మ రాసిన ఓ ఫాంటసీ ప్రేమకథా సినిమాలో తేజ సజ్జా హీరోగా చేస్తున్నాడు. దానికి మల్లిక్ రామ్ దర్శకుడు. ఇది రెండో సినిమా అన్నమాట. కరోనా నేపథ్యంలో ప్రజలకు ఎదురైన వింత అనుభవాలను వినోదాత్మకంగా చూపిస్తున్నారట. ఈ సినిమాకి 'జాంబీ రెడ్డి' టైటిల్ ఖరారు చేశారు.