ఆస్కార్2020... బెస్ట్ సినిమాపై గొడవ షురూ...
on Feb 19, 2020
ఆస్కార్ అవార్డులో కొరియన్ సినిమా 'పారా సైట్' చరిత్ర సృష్టించింది. ఉత్తమ చిత్రం, అంతర్జాతీయ చిత్రం, దర్శకుడు, స్క్రీన్ ప్లే విభాగాల్లో ఆస్కార్స్ అందుకుంది. ఈ సినిమా కథ చదివి చాలామంది ఇదేదో తెలుగు సినిమా కథలా ఉందని అనుకున్నారు. అసలు ఆ సినిమా కథేంటి? అంటే... సంపన్నుల కుటుంబంలో ఒక పేదింటి కుర్రాడికి ఉద్యోగం వస్తుంది. అక్కడ చేరిన తర్వాత మిగతా ఉద్యోగాల్లో ఉన్నవాళ్లను పథకం ప్రకారం తప్పించి తన కుటంబ సభ్యులకు ఉద్యోగాలు వచ్చేలా చేస్తాడు. అతడి పన్నాగం ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్లలో ఒకరికి తెలుస్తుంది. పేదింటి కుర్రాడిని బ్లాక్ మెయిల్ చేస్తుంది. అప్పుడు అతడు ఏం చేశాడు? తర్వాత ఏమైంది? అనేది టూకీగా కథ. మెయిన్ ట్విస్టులు రివీల్ చేయకుండా చెప్పాలంటే ఇంతే! ఈ టైప్ లైన్ తో సౌతిండియాలో చాలా సినిమాలు వచ్చాయి. ఒక సినిమా తామిద్దరం భార్యాభర్తలు అని చెప్పకుండా బ్రహ్మానందం, మరొక కమెడియన్ ఉద్యోగాలు చేస్తారు. ఈ టైపు కథతో తమిళంలో ఒక సినిమా వచ్చిందట. దాంతో వాళ్ళు కేసు పెట్టడానికి రెడీ అవుతున్నారు.
రెండు దశాబ్దాల క్రితం తమిళంలో విజయ్ హీరోగా 'మిసారా కన్న' అని ఒక సినిమా వచ్చింది. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో రంభ హీరోయిన్. ఆ సినిమా ప్లాట్, 'పారా సైట్' ప్లాట్ ఒక్కటేనని నిర్మాత పీఎల్ తేనప్ప చెబుతున్నారు. ఒరిజినల్ ప్రొడ్యూసర్ ఈయన కాదు. కానీ, రైట్స్ ఎప్పుడో కొనుక్కుని పెట్టుకున్నారు. తమ సినిమా లైన్, కథ కాపీ కొట్టి సినిమా తీశారని 'పారా సైట్' టీమ్ కి ఒక మెయిల్ చేశారు. అక్కడ నుండి రిప్లై రాకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెబుతున్నారు. అకాడమీ అవార్డ్స్ టీమ్ కి కూడా ఈ సంగతి చెబుతామని అంటున్నారు. అసలు, కొరియన్ సినిమా టీమ్ తమిళ నిర్మాత ఆరోపణలపై స్పందిస్తారో? లేదో? ఈయన మాత్రం హడావిడి గట్టిగా చేస్తున్నాడు.