సినిమా చూడు...సగమే చూడు..!
on Mar 30, 2016
'సార్. సినిమాకికథచెబుతాననివచ్చాడుఒకాయన. రైటరుట. సుమారుఅరవైఏళ్ళుంటాయి. పేరు గజేంద్రప్రసాద్. పంపమంటారా?'
అడిగాడుఅసిస్టెంటు.
అప్పుడే తలమీద మిగిలిన నాలుగున్నర వెంట్రుకలూ పీకేసుకోగా మిగిలిన గుండు తడుముకుంటూ, ముఖంచిరాగ్గాపెట్టి 'ముసలాడా?
కథచెబుతాడా? నీకేమైనా మతిపోయిందా?' అనిచాలా కోపంగా చూసి 'వెళ్ళు వెంటనే లోపలికి లాక్కురా ' అని ఎదురుగా వున్న కుర్చీ
తుడవటానికి లేచాడు, సదరు డైరెక్టరు సత్తిపండు. అసిస్టెంటు పరుగు లంకించుకుని ఆ ముసలి రైటరుని లాక్కొచ్చి, డైరెక్టరు ఎదురుగా
తుడిచిపెట్టిన కుర్చీలో కుదేసాడు.
'నాపేరు గజేంద్రప్రసాద్. నా దగ్గర సూపర్ హిట్టయ్యే సినిమాకి, ఓ మాంచి కథ వుంది ' అన్నాడు రైటరు, కుర్చీలో సద్దుకుని కూర్చుంటూ.
'సినిమాకి కథా? మరీ టూమచండీ. తెలుగుసినిమాలు హిట్టవ్వాలంటే కథ వుండకూడదు. సెంటిమెంటు ' అన్నాడు సత్తి.
'గాలి వుందా?' అడిగాడు రైటరు.
'వుంది ' అన్నాడు సత్తి.
'చూపించండి ' అన్నాడు రైటరు గజేంద్రప్రసాద్.
'కనిపించదుగా ' అన్నాడు అమాయకంగా సత్తి.
'సినిమాలో కథా అంతే. వుంటుంది. కానీ కనిపించదు ' అన్నాడు గజేంద్రప్రసాద్.
'ఓహ్! అలా వచ్చారా. అయితే ఓకే ' అని సగం అడ్వాన్స్ ఇచ్చిఅగ్రిమెంట్ చేసేశాడు సత్తిబాబు.
సినిమా మొదలయ్యింది. హీరోకీ, విలనుకీ డబ్బివ్వలేదు. 'సార్. ఓముప్పావలా ఇవ్వండి సార్. గడ్డాలు గీసుకుంటాం ఇద్దరం ' అని భోరున
ఏడుస్తూ అడిగారు. వాళ్ళు గడ్డాలు పెంచేసుకుని బూచాళ్ళలా, రోగిష్టాళ్ళలా అయ్యిపోయారు. అయినా సరే ఇవ్వలేదు సత్తి. తీరిక వేళల్లో,
ఒకరి గడ్డాల్లోంచి ఒకరు పేలు తీసుకుంటూ లెక్కలేసుకుంటున్నారు. పాతచెక్కల్తో సెట్ వేయించి సినిమా తీసిపారేస్తున్నాడు సత్తిపండు.
అలా సత్తి, ఓ రెండేళ్ళు తీసాడు సినిమాని. ఈలోగాహీరో, విలన్లకి తెగ పెరిగిపోయిన గడ్డాలు చూసి, పాకిస్తాన్ టెర్రరిస్టులని, అల్ ఖైదా
వాళ్ళో, అల్ మైదా వాళ్ళో హఠాత్తుగా వచ్చి పట్టుకుపోయారు. సత్తి దగర కూడా డబ్బులయ్యిపోయాయి. ఇక రైటరు సగం డబ్బే
ఇచ్చినందుకు, మిగతా సగం కథ చెప్పనుపో, దిక్కున్న చోట చెప్పుకో అని వేరే హిందీ నిర్మాతకి, కిడ్నాపయ్యిన హీరో విలన్ల కథని మార్చి
చెప్పేయటానికి, చొక్కా వేసుకోనీ ఓహిందీనటుడి దగ్గరకి చక్కాపోయాడు.
సత్తి, ఏమయితే అయ్యిందని, సగం వుడికిన కూర ఆరోగ్యానికి మంచిదని వెంటనే గుర్తు తెచ్చేసుకుని, తాను తీసిన సగం సినిమాని జనాల
మీదకి వదిలేసాడు. అందులో అర్ధాంతరంగా ఆగిపోయిన చివరిసీనులో ' ఇంకావుంది ' అని పెట్టేసి శుభంకార్డేసేసాడు. ఆ సినిమా చూసిన
జనం, సినిమా అయ్యిందా? అవ్వలేదా అనే మీమాంసలో కొట్టుకు చచ్చి, అర్ధం కాక జుట్టు పీకేసుకుని, బయటకి వెళ్ళే ఓపిక లేక, తలని
అక్కడే థియేటర్లో వున్న గోడకి కొట్టేసుకుని, భోరున ఏడుస్తూ బయటకెళ్ళిపోయారు. పూర్తి డబ్బులు తీసుకుని, సగం సినిమా చూపిస్తారా
అని గొడవచేసారు. ఇలా అర్ధం కాలేదనిటాక్ వచ్చాకా, అన్ని భాషల్లోనూ కూడా విడుదలచేసారు. అలా దేశం మొత్తంలో వున్న వెర్రిజనం,
సినిమా చూసి, మరీ వెర్రాళ్ళయ్యి, దిక్కులు చూస్తూంటే, అవార్డు కమిటీ వాళ్ళు ఆ దిక్కుకెళ్ళి, ఆ సినిమా చూసి, చూసీ చూడనట్టు
అవార్డిచ్చేసారు.
ఇప్పుడు మధ్యలో ఆగిపోయిన సినిమాల తాలూకు నిర్మాతలు, 'వార్నీ. సినిమాకి అవార్డ్ రావటానికి సినిమా పూర్తిగాతీయక్కర్లేదా ' అని
వాళ్ళ వాళ్ళ సినిమాలు భుజానేసుకుని అవార్డ్ కమిటీ ఆఫీసు ముందు క్యూకట్టారు. కొత్త నిర్మాతలు కూడా తలలు బద్దలు కొట్టుకోకుండా,
వాయిదా పద్ధతుల్లో సినిమాలు తీయటం మొదలెట్టారు.
---- గిరీశం
Also Read