ఆ హీరోయిన్ సింగిల్ కాదు.. మింగిల్ అయ్యింది!
on Oct 14, 2020
ఇటీవల బిగ్ బాస్ షోను షిట్ గేమ్ షోగా అభివర్ణించి వార్తల్లోకి ఎక్కిన ముక్కుసూటి అమ్మాయి లక్ష్మీ మీనన్ తాజాగా తను సింగిల్ కాదనీ, మరొకరితో మింగిల్ అయ్యాననీ వెల్లడించి ఫ్యాన్స్ను ఆశ్చర్యంలో ముంచేసింది. తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఆమె తన రిలేషన్షిప్ స్టేటస్ను ఆమె వెల్లడించింది. తన ఫాలోయర్స్తో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించిన ఆమెను ఒక అభిమాని "మీరు సింగిలేనా?" అని ప్రశ్నించాడు. దానికి ఆమె ఈ ప్రశ్నను ఎదుర్కొని విసిగెత్తిపోయానంటూనే "కాదు" అని జవాబిచ్చింది. దాంతో పాటు హార్ట్ ఎమోజీనీ, సిగ్గుపడుతున్న జిఫ్నూ జోడించింది. అయితే తను ఎవరితో మింగిల్ అయ్యిందో, ఆ బాయ్ఫ్రెండ్ పేరు మాత్రం లక్ష్మీ మీనన్ వెల్లడించలేదు. మరో అభిమాని "పెళ్లిలో నమ్మకముందా?" అని అడిగితే, "Overrated sh*t (sic).ష అంటూ రిప్లై ఇచ్చింది.
తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి లక్ష్మీ మీనన్ వెల్లడించిన మరుక్షణం నుంచే, ఆమె ఎవరితో డేటింగ్ చేస్తోందంటూ ఫ్యాన్స్తో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా కుతూహలాన్ని వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే మనకు ఆమె ఎవరితో డేటింగ్లో ఉందో తెలియవచ్చు. కాగా ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లోనే కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన 'జిగర్తాండ' తన ఫేవరేట్ ఫిల్మ్ అనీ, ధనుష్ తన ఫేవరేట్ యాక్టర్ అనీ తెలిపింది లక్ష్మి.
ఇటీవల బిగ్ బాస్ షో గురించి ఆమె చేసిన కామెంట్స్ కాంట్రవర్సీ సృష్టించాయి. "బిగ్ బాస్ తమిళ్ సీజన్ 4లో భాగమవుతున్నారా?" అని అడిగినప్పుడు, ఇతరుల ప్లేట్లను, వాళ్ల టాయిలెట్లను కడగాలని తాను అనుకోనని చెప్పి, దాని షిట్ గేమ్ షోగా ఆమె పేర్కొంది. విశాల్ సరసన 'పల్నాడు'లో హీరోయిన్గా, 'వేదాళం'లో అజిత్ చెల్లెలిగా నటించిన ఆమె జయం రవి, కార్తీ, విజయ్ సేతుపతి వంటి హీరోల సరసన నాయికగా నటించి ప్రతిభావంతురాలైన నటిగా పేరు తెచ్చుకుంది.