తారక్తో కియారా.. కొరటాల ప్లాన్?
on Apr 14, 2021
యంగ్ టైగర్ జూనియర్ యన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న పిరియడ్ డ్రామా 'ఆర్ ఆర్ ఆర్'తో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా తాలూకు చిత్రీకరణ పూర్తిచేయనున్నాడు తారక్. ఆపై జూన్ ద్వితీయార్ధం నుంచి తన నెక్స్ట్ వెంచర్ ని ప్రారంభించనున్నాడు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.
'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్బస్టర్ తరువాత తారక్ - కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ భారీ బడ్జెట్ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. తెలుగుకే పరిమితం కాకుండా పలు భాషల్లో పాన్ - ఇండియా ప్రాజెక్ట్లా 'యన్టీఆర్ 30' రూపొందనుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో తారక్కి జోడీగా ఉత్తరాది భామ కియారా అద్వానిని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఇప్పటికే కియారా తెలుగులో 'భరత్ అనే నేను', 'వినయ విధేయ రామ' చిత్రాలు చేసింది. వీటిలో 'భరత్ అనే నేను'ని కొరటాల శివనే డైరెక్ట్ చేశారు. ఈ నేపథ్యంలో.. తన తొలి తెలుగు చిత్ర దర్శకుడితో మరోసారి కలిసి పనిచేసేందుకు కియారా కూడా ఆసక్తి చూపిస్తోందని టాక్.
త్వరలోనే 'యన్టీఆర్ 30'లో కియారా ఎంట్రీపై క్లారిటీ రానున్నది. కాగా, 2022 ఏప్రిల్ 29న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది.
Also Read