నితిన్ సెట్కి కీర్తి వచ్చేది వచ్చే వారమే!
on Sep 25, 2020
రీసెంట్గా యుంగ్ హీరో నితిన్ షూటింగ్ స్టార్ట్ చేశాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్న 'రంగ్ దే' సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లాడు. కరోనా నేపథ్యంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణ చేస్తున్నారు. ఆయనతో పాటు నటుడు బ్రహ్మాజీ తదితరులు చిత్రీకరణలో పాల్గొంటున్నారు. కానీ, సినిమా హీరోయిన్ కీర్తి సురేష్ మాత్రం సెట్లో లేరు. వచ్చే వారమే ఆమె సెట్కి వస్తారు. దీనికి కరోనా నిబంధనలే కారణం.
ఇతర రాష్ట్రాల నుండి షూటింగుకు వచ్చేవారు కంపల్సరీ రెండు వారాలు క్వారంటైన్లో ఉండాలని ఒక రూల్ ఉంది. 'గుడ్ లుక్ సఖి' షూటింగ్ చేసిన తరవాత కీర్తి సురేష్ కేరళలోని ఇంటికి వెళ్ళారు. ప్రస్తుతం ఆమె అక్కడ క్వారంటైన్లో ఉన్నారట. వచ్చే వారం హైదరాబాద్ వచ్చి 'రంగ్ దే' చిత్రీకరణలో పాల్గొంటారని తెలిసింది. ప్రస్తుతం నితిన్, ఇతర తారాగణంపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కొన్ని పాటలను విదేశాలలో తీయాలని ముందు అనుకున్నారు. కానీ, ప్రస్తుత పరిస్థితులలో సాధ్యం అవుతుందో? లేదో? అని ఆలోచిస్తున్నారు.