కీమోథెరపీకి ఇండియా రానున్న మున్నాభాయ్...
on Sep 25, 2020
బాలీవుడ్ మున్నాభాయ్ సంజయ్ దత్ ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారు. భార్య మాన్యత, పిల్లలు షరాన్, ఇక్రాతో టైం స్పెండ్ చేస్తున్నారు. త్వరలో ఆయన ముంబైకి రానున్నారు. ఇండియాకి వచ్చి కీమోథెరపీ తీసుకోనున్నారు.
సంజయ్ దత్ కి లంగ్ క్యాన్సర్ అని ఇటీవల బయటపడిన సంగతి తెలిసిందే. అది స్టేజ్ త్రీలో ఉంది. ఎన్నిసార్లు కీమోథెరపీ చేయాలనేది డాక్టర్లు కూడా చెప్పలేకపోతున్నారు. ఇప్పటికి రెండు సార్లు సంజయ్ దత్ కి కీమోథెరపీ చికిత్స అందించారు. ఈ నెలాఖరున మూడోసారి చికిత్స అందించాలి. 30వ తేదీన సంజయ్ ఆసుపత్రికి వెళ్లాలి. ఈలోపే దుబాయ్ నుంచి ముంబై రానున్నారు. మొదట అమెరికా వెళ్లి చికిత్స తీసుకోవాలని సంజయ్ దత్ అనుకున్నప్పటికీ... కొన్ని సమస్యల వల్ల వెళ్లలేదు. సింగపూర్ వెళితే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేశారు. చివరికి ముంబైలోనే మంచి డాక్టర్ దగ్గర చికిత్స తీసుకుంటున్నారు.
సంజయ్ దత్ కి లంగ్ క్యాన్సర్ అని తెలిసిన సమయంలో భార్య పిల్లలు దుబాయ్ లో ఉన్నారు. అక్కడి నుండి ఇండియాకి రావడానికి పరిస్థితులు అనుకూలించలేదు. రెండు సార్లు కీమోథెరపీ చికిత్స తీసుకున్న తరువాత ఈ నెల 16న సంజయ్ స్వయంగా దుబాయ్ వెళ్లారు. భర్త పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు మాన్యత సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
Also Read