కాశీకి `ఇస్మార్ట్ శంకర్ `!!
on Mar 26, 2019
పూరీ జగన్నాథ్ దర్శకత్వం లో ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా తాజా అప్ డేట్ ఏంటంటే గత కొద్దిరోజులుగా ఈ సినిమా గోవాలో షూటింగ్ జరుపుకుంటుండగా నిన్న రాత్రితో అక్కడ షూటింగ్ కూడా పూర్తయిందట. ఈ విషయాన్ని చార్మి తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. అంతేకాదు ఈ సందర్భంగా అంతా కలిసి డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసినట్టుగా ఆ సందర్భంలో దిగిన ఒక సెల్పీని తన ట్విట్టర్లో షేర్ చేసింది.
ఇక గోవా తర్వాత షెడ్యూల్ ను `వారణాసి` (కాశీ) లో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట చిత్ర యూనిట్. ఇక త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకొని మే నెలలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.
కాగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కన్న ఈ సినిమాలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను పూరీ టూరింగ్ టాకీస్ పతాకంపై పూరి జగన్నాథ్, చార్మి కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి
మణిశర్మ సంగీతం అందిచనుండగా `అర్జున్ రెడ్డి` ఫేమ్ రాజ్ తోట సినిమాటోగ్రఫీని అందించనున్నారు.