కరోనాతో టాలీవుడ్ హీరో తండ్రి మృతి
on Jul 9, 2020
టాలీవుడ్కు సంబంధించి కరోనాతో మరొకరు మృతి చెందారు. ఇటీవలే నిర్మాత పోకూరి రామారావు కొవిడ్-19 బారినపడి ఒక కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించిన విషయం జ్ఞాపకాల నుంచి మరుగునపడక ముందే మరో మరణం చోటు చేసుకుంది. మారుతి డైరెక్ట్ చేసిన ఈ రోజుల్లో సినిమాతో హీరోగా పరిచయమై ఆకట్టుకున్న శ్రీనివాస్ అలియాస్ శ్రీ తండ్రి మంగం వెంకట దుర్గా రాంప్రసాద్ కరోనా మహమ్మారి బారిన పడి తుదిశ్వాస విడిచారు. కరోనా వైరస్ బారినపడిన ఆయన విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి ఆయన కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
దీంతో టాలీవుడ్లో విషాద వాతావరణం నెలకొంది. కొన్ని రోజులుగా ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీలో, అటు టీవీ ఇండస్ట్రీలో కరోనా కేసులు వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. లాక్డౌన్ ఎత్తివేశాక ప్రభుత్వం కొన్ని నిబంధనలతో షూటింగ్లకు అనుమతులు ఇవ్వడంతో టీవీ సీరియళ్ల, గేమ్ షోల షూటింగ్లు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో టీవీ తారలు నవ్య స్వామి, రవికృష్ణ, రాజశేఖర్, ప్రభాకర్ వంటి వాళ్లకు కొవిడ్-19 సోకి, చికిత్స పొందుతున్నారు. రానున్న రోజుల్లో ఇంకెన్ని కరోనా కేసులు ఈ రెండు ఇండస్ట్రీలలో వెలుగు చూస్తాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది.
Also Read