అందుకే మహేష్ వెళ్లిపోయాడా??
on May 24, 2016
బ్రహ్మోత్సవం దెబ్బ నుంచి తేరుకోవడానికి మహేష్బాబుకి మరి కొంత కాలం పడుతుంది. ఈ విమర్శలు, సెటైర్ల బారీ నుంచి కాస్త రిలాక్స్ అవ్వడానికి తన ఫ్యామిలీతో కలసి లండన్ బయల్దేరి వెళ్లాడు మహేష్. మరో పదిహేను రోజులకు గానీ తిరిగిరాడు. అయితే మహేష్ లండన్ ప్రయాణం వెనుక ఓ పెద్ద కథే ఉందన్నది టాలీవుడ్ జనాల టాక్. బ్రహ్మోత్సవం సినిమాతో ఇటు నిర్మాత, అటు బయ్యర్లు పెద్ద ఎత్తున నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ సినిమాని భారీ రేట్లకు అమ్మేసిన పీవీపీ ఆ నష్టాల్లో ఎంతో కొంత భర్తీ చేయాల్సిన అవసరం ఏర్పడింది. పీవీపీ నష్ట నివారణకు పూనుకొంటే అందులో మహేష్ కూడా ఓ చేయి వేయాల్సిందే. ఎందుకంటే ఈ సినిమాకి మహేష్ ఓ నిర్మాణ భాగస్వామి కూడా. ఈ సినిమాతో ఏకంగా రూ.25కోట్లు పారితోషికం అందుకొన్న మహేష్ ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే అనుకొంటారు. ఈ గొడవలన్నీ పడలేకే మహేష్ లండన్ వెళ్లిపోయి ఉండొచ్చన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు బయ్యర్లంతా పీవిపీ పై పడేందుకు సిద్దంగా ఉన్నారు. మహేష్.. నీ మాటేంటి? అని అడిగినా అడుగుతారు. అందుకే.. మహేష్ రిలాక్సేషన్ పేరుతో లండన్ వెళ్లిపోయాడని, తిరిగొచ్చేనాటికి అంతా కామ్గా అయిపోతుందని ఆయన ఉద్దేశమని గుసగుసలు వినిపిస్తున్నాయి. మహేష్కి లండన్ వెళ్లే ఉద్దేశమేలేదని, ఇది ఇప్పటికిప్పుడు తీసుకొన్న నిర్ణయమని ఆయన సన్నిహితులు చెప్పడంతో ఈ పుకార్లతో మరింత బలం వచ్చినట్టైంది. మరి అందులో నిజమెంతో మహేష్కే తెలియాలి.
Also Read