మెహబూబ్ చొక్కా పట్టుకున్న దేవి!
on Sep 23, 2020
మూడోవారం బిగ్ హౌస్ లో కెప్టెన్ ఎంపిక కోసం బిగ్ బాస్ ఇంటి సభ్యులకు పెద్ద టాస్కే ఇచ్చాడు. ఇంటిసభ్యులన రెండు టీమ్లుగా విడదీశాడు. ఒకటి మనుషుల టీమ్, ఇంకొకటి రోబోల టీమ్. వారికి ఉక్కు హృదయం టాస్క్ ఇచ్చాడు. మనుషుల టీమ్లో అఖిల్, అమ్మ రాజశేఖర్, దివి, నోయల్, సోహైల్, సుజాత పేర్లు ఉండగా, రోబోల టీమ్లో దేవి, అరియానా, కుమార్ సాయి, లాస్య, అవినాష్, అభిజిత్, గంగవ్వ, హారిక పేర్లు ఉన్నాయి. గార్డెన్ ఏరియాలో ఉన్న సిల్వర్ బాల్ను మనుషులు పగలగొడితే ఓ రోబో చనిపోయినట్లు. అలా అన్ని రోబోలను చంపేస్తే మనుషుల టీమ్ గెలిచినట్లు లెక్క. అయితే ఏ రోబోను చంపాలనుకున్నారో పేరు చెప్పి సిల్వర్ బాల్ పగలకొట్టాలి. చివరి వరకు ఒక్క రోబో బతికి ఉన్నా రోబోల టీమ్ గెలిచినట్లే.
మనుషుల అవసరాలను రోబోలు తీర్చాలి, రోబోలకు మనుషులు చార్జింగ్ పెట్టాలి అన్న నిబంధనలు పెట్టాడు బిగ్ బాస్. గెలిచిన టీమ్ సభ్యులు మాత్రమే కెప్టెన్ పోటీకి అర్హులు అవుతారని ట్విస్ట్ పెట్టాడు. టీమ్ సభ్యులందరికీ రెండురంగుల యూనిఫామ్ ఇచ్చారు స్టోర్ రూంలోని డ్రస్ లను వేసుకుని బజర్ మోగకముందే అత్యుత్సాహంతో ఆట మొదలెట్టారు.
బజర్ మోగగానే రోబో టీమ్ సభ్యులు సిల్వర్ బాల్ కు రక్షకులుగా నిలబడ్డారు. గంగవ్వ, హారిక, అవినాష్ సిల్వర్ బాల్ ను కవర్ చేస్తూ నిలబడగా, దేవి, కుమార్ సాయి, అరియానా తమ వైపు వచ్చేవారిని వారించారు. గంగవ్వను సిల్వర్ బాల్ దగ్గర ఉంచగా చాలా చాకచక్యంగా బాల్ ను రక్షించే ప్రయత్నం చేసింది మోహబూబ్ చాలా తెలివిగా సిల్వర్ బాల్ వైపు రావడంతో దేవి అతనిని వారించే ప్రయత్నంలో షర్ట్ పట్టుకుంది. దాంతో మోహబూబ్ ఆమెను అడ్డుకున్నాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. మాటలు జాగ్రత్తగా రావాలి అంటూ దేవికి వార్నింగ్ ఇచ్చాడు. ఇంటిసభ్యులు కల్పించుకుని గొడవను ఆపారు.
సిల్వర్ బాల్ పలకొట్టే ముందు ఏ రోబోను చంపాలనుకుంటున్నారో చెప్పాలని, పిచ్చినా ఆట ఆడవద్దని దేవి అంది. దాంతో మనుషుల టీమ్ సభ్యులంతా కలిసి దేవి పేరు చెప్పారు. రెండో టీమ్ ల్లోని కంటెస్టెంట్లు ఒకరి మీద ఒకరు పడటం, కొట్టుకోవడం, గిల్లుకోవడం చేస్తూ చివరకు సిల్వర్ బాల్ ను రోబోల నుంచి మనుషుల టీమ్ దక్కించుకుంది. మోహబూబ్ దాన్ని పగలకొట్టాడు. రోబోల చార్జింగ్ అయిపోవడంతో వారంతా హౌస్ లోకి వెళ్లారు. మనుషుల టీమ్ సభ్యులు మాత్రం లాన్ లోనే ఉండిపోయారు. ఈ రెండు టీమ్ ల మధ్య సాగే ఫైట్లో ఎవరు గెలుస్తారో నేటి ఎపిసోడ్లో చూడాలి.
Also Read