ఎన్టీఆర్ కోసం దొంగతనం చేసిన త్రివిక్రమ్
on Oct 15, 2018
ఎన్టీఆర్,త్రివిక్రమ్ కాంబినేషన్లో చిత్రం కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.అభిమానుల నిరీక్షణ ఫలితమే వీరి కాంబినేషన్లో భారీ అంచనాలతో రిలీజ్ అయిన 'అరవింద సమేత'. ఈ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్లు వసూలు చేసి సత్తా చాటింది. అయితే ఈ కథ తనదేనంటూ వేంపల్లి గంగాధర్ ఆరోపిస్తున్నాడు.
త్రివిక్రమ్ నుంచి ఏప్రిల్ 15న తొలిసారి తనకు ఫోన్ వచ్చిందని,హైదరాబాద్ రమ్మని కోరటంతో రామోజీ ఫిలిం సిటీలో ఆయన్ని కలిశానని గంగాధర్ తెలిపాడు.అప్పటికే ఫస్ట్ ఫైట్ తీస్తున్నారని,షాట్ గ్యాప్ లో త్రివిక్రమ్ తో పరిచయం అయిందని, తాను రాసిన పుస్తకాల గురించి త్రివిక్రమ్ తెలుసుకున్నారని గంగాధర్ తెలిపాడు.తిరుపతి శ్రీవెంకటేశ్వర యూనివర్శిటీ నుంచి రాయలసీమ ఫ్యాక్షన్ కథలపై పరిశోధన చేసి సర్టిఫికెట్ పొందిన విషయం విని, తనను అభినందించారని చెప్పాడు.పరిశోధనలో తాను పడిన ఇబ్బందులు,పరిశోధనలో కొంత సమాచారం 'హిరణ్య రాజ్యం' పుస్తకంలో రాసానని త్రివిక్రమ్ కి చెప్పాను.హీరోయిన్ పాత్రకు దాన్ని వాడుకున్నారని చెప్పాడు.ఆ తర్వాత రాయలసీమ మాండలికాల గురించి తెలుసుకున్నారని తెలిపారు.తన పాపాగ్ని కథల్లో ఉన్న 'మొండి కత్తి' నేపథ్యం గురించి తెలుసుకున్నారని, కథకు పునాది మొండి కత్తేనని గంగాధర్ చెప్పాడు. త్రివిక్రమ్ ను కలిసి, తన కథల గురించి లోతుగా చెప్పడం తాను చేసిన మొదటి తప్పని అన్నాడు. త్రివిక్రమ్ తెలివైన మూర్ఖుడని, రకరకాల కథల్లోంచి ఒక్కో పాత్రను దొంగిలించి కొత్త కథను అల్లగలడని చెప్పారు. అలా వండిన మరో కథే 'అరవింద సమేత' అని చెప్పాడు.కథ వాడుకున్న త్రివిక్రమ్ కనీసం తన పేరు కూడా వేయలేదని రచయిత గంగాధర్ సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు.కానీ విచిత్రంగా దీని మీద చర్చ జరుగుతుండగా హఠాత్తుగా రచయిత గంగాధర్ పోస్ట్ ని డిలీట్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
Also Read