మైత్రి మూవీ మేకర్సైనా తేజ్కు హిట్టిస్తుందా!!!
on Oct 15, 2018
వరుస ఫ్లాపులతో డీలా పడిపోయిన హీరో సాయి ధరమ్ తేజ్. `పిల్లా నువ్వు లే ని జీవితం `చిత్రంతో హీరోగా పరిచయమైన సాయి ధరమ్ తేజ్ సుబ్రమణ్య ఫర్ సేల్, సుప్రీమ్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చేసిన తిక్క, విన్నర్ , నక్షత్రం, జవాన్ , ఇంటిలిజెంట్ , తేజ్ ఐలవ్ యు, చిత్రాలు వరుస పరాజయాలను అందించాయి. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న సాయి ధరమ్ తేజ్ నేను శైలజ చిత్రంతో దర్శకుడుగా తనేంటో ప్రూవ్ చేసుకున్న కిషోర్ తిరుమలతో ` చిత్రలహరి` అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు సోమవారం సంస్థ కార్యాలయంలో సాయి ధరమ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి దర్శకుడు కొరటాల శివ తో పాటు మరికొంత మంది సినీ తారలు హాజరయ్యారు. స్టార్ డైరక్టర్స్, స్టార్ హీరోస్ తో వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మరి ఈ సంస్థ అయినా సాయి ధరమ్ తేజ్ కు హిట్ ఇస్తుందా? లేదో చూడాలి. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం లో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.