బిగ్ బాస్లో పుషప్స్ కింగ్ అఖిల్!
on Oct 17, 2020
ఇంటిసభ్యులు తమ శక్తి సామర్థ్యాలు ప్రదర్శించేలా బిగ్బాస్ 'రేసర్ ఆఫ్ ద హౌస్' టాస్క్ ఇచ్చాడు. రెండు రౌండ్లలో ఈ టాస్క్ పూర్తి చేయాలి. మొదటి రౌండ్ లో ఇంటిసభ్యులంతా పుషప్స్ చేయాలి. వారిలో నుంచి ఎక్కువ సమయం పుషప్స్ చేసిన ఐదుగురు రెండో రౌండ్కు అర్హత సాధిస్తారు. రెండో రౌండ్లో అంచెలంచెలుగా ఉన్న అడ్డంకులను దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరు తక్కువ టైమ్ లో టాస్క్ పూర్తి చేస్తే వారికే రేసర్ ఆఫ్ ది హౌస్ టాస్క్ దక్కుతుంది. మొదటి రౌండ్ను అమ్మ రాజశేఖర్ పర్యవేక్షించగా, రెండో రౌండ్కు అభిజిత్ సంచాలకుడిగా వ్యవహరించాడు.
పుషప్స్ తీసే రౌండ్ లోనే అమ్మాయిలందరూ ఓడిపోయారు. రెండోరౌండ్ కు అర్హత పై కుమార్ సాయికి, నోయల్ కు వాదన జరిగింది. కుమార్ సాయి ఆగిపోయినా తాను ఇంకా పుషప్స్ తీస్తూనే ఉన్నానని నోయల్ అన్నాడు. తాను ఆగిపోలేదని.. కంటిన్యూ చేశానని కుమార్ వాదించాడు. "ఎప్పుడూ అబద్ధమే చెప్తావు. నిజాయితీగా ఆడు" అంటూ కుమార్ కు చెప్పాడు నోయల్. చివరకు రెండోరౌండ్ కు కుమార్ సాయి, అఖిల్, అవినాష్, సొహేల్, మెహబూబ్ ఎంపికయ్యారు.
టైర్ల మధ్య నుంచి పరిగెత్తడం, అడ్డంగా కట్టిన తాళ్లను దాటడం, ముళ్లకంచె కిందనుంచి పాకడం, స్విమ్మింగ్ పూల్లో ఒకవైపు నుంచి మరొకవైపుకు ఇసుక మూటలను తీసుకెళ్లడం ఇలా మిలటరీ ట్రైనింగ్ తలపించే టాస్క్ లు పూర్తిచేశారు. హౌస్ నుంచి సరాసరి బార్డర్ కు పంపితే సరిపోతుంది అన్న లెవల్ లో ఫర్మామెన్స్ చేశారు. ఇంటిసభ్యులంతా వారిని ఎంకరేజ్ చేశారు. అతి తక్కువ టైమ్ లో ఈ టాస్క్ లన్నీ పూర్తి చేసిన మెహబూబ్ ను విజేతగా ప్రకటించారు. దాంతో రేసర్ ఆఫ్ ద హౌస్ టైటిల్ మెహబూబ్ గెలుచుకున్నాడు.
అఖిల్ హౌస్ లోకి వెళ్లేముందు వేదికపై ఆగకుండా 50 పుషప్స్ తీసి నాగ్ చేత వావ్ అనిపించాడు. ఆ తర్వాత స్వాతిని ఇంప్రెస్ చేసే క్రమంలో నాన్ స్టాఫ్ గా 75 పుషప్స్ చేశాడు. రేసర్ ఆఫ్ దిహౌస్ టాస్క్ లో భాగంగా 101 పుషప్స్ తీశాడు. అయితే ఈ విషయంపై 101 తీశాడా అంటూ మెహబూబ్ తనను అనుమానంగా అనడం తనకు బాధకలిగిందని సొహేల్ తో చెప్పి బాధపడ్డాడు అఖిల్. "నా విషయంలో ఏమైనా ఉంటే నాతో మాట్లాడండి. చెప్పండి. నా గురించి వేరేవారితో కామెంట్ చేయడం నాకు నచ్చదు" అంటూ మరోసారి అఖిల్ సీరియస్ గా సొహేల్తో చెప్పాడు. మెహబూబ్ తో అఖిల్ కు సారీ చెప్పించాడు సొహేల్. దాంతో ఈ గొడవ సద్దుమణిగింది.
Also Read