టబు క్యారెక్టర్కు ఐశ్వర్యా రాయ్ ఓకే అంటుందా?
on Oct 14, 2020
ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ మూవీ 'అంధాధున్' ఇండియన్ ఫిలిం హిస్టరీలో క్లాసిక్ అనిపించుకుంది. ఇప్పుడీ సినిమాను ప్రాంతీయ భాషలలో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో నితిన్ హీరోగా 'అంధాధున్' తెరకెక్కనుంది. ఇందులో టబు పాత్రను తమన్నా చేస్తున్నారు. తమిళంలో ఈ సినిమాను 'జీన్స్' హీరో ప్రశాంత్ రీమేక్ చేస్తున్నాడు. టబు పాత్రకు ఐశ్వర్యా రాయ్ బచ్చన్ ను సంప్రదిస్తున్నారట.
'జీన్స్'లో ప్రశాంత్, ఐశ్వర్య జోడీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ఆ తరవాత సరైన విజయాలు లేక ప్రశాంత్ హీరోగా టాప్ లీగ్ లోకి రాలేకపోయాడు. ఐశ్వర్యా రాయ్ మాత్రం హిందీలోనూ వరుస విజయాలతో దూసుకువెళ్లారు. మరి, గతంలో తనకు హిట్ ఇచ్చిన హీరో కోసం రీమేక్ సినిమా చేస్తుందా? హిందీలో టబు చేసిన పాత్రలో కనిపించడానికి ఓకే అంటుందా? అనేది చూడాలి. 'జీన్స్' జోడీ మరోసారి సినిమా చేస్తున్నారంటే దానికి వచ్చే క్రేజే వేరు కదా!