`థాంక్ యూ`.. ఆ ముగ్గురు ఫిక్స్
on Apr 6, 2021
ఒకవైపు యువ సామ్రాట్ నాగచైతన్య తాజా చిత్రం `లవ్ స్టోరి` ఈ నెల 16న విడుదలకు సిద్ధమవుతుండగా.. మరోవైపు `థాంక్ యూ` శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ రూపొందిస్తున్న ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు నిర్మిస్తున్నారు. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. `థాంక్ యూ`లో ముగ్గురు కథానాయికలకు స్థానముందని చాలాకాలంగా కథనాలు వస్తూనే ఉన్నాయి. అయితే, ఇప్పటివరకు ఆ ముగ్గురు ఎవరు అన్నదానిపై మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాశీఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ నాయికల పాత్రల్లో కనిపిస్తారని తెలిసింది. కథానాయకుడి జీవితంలోని మూడు కీలక దశల్లో వచ్చే అమ్మాయిల పాత్రలతో `థాంక్ యూ` నడుస్తుందని బజ్.
కాగా చైతూ శ్రీమతి, అగ్ర కథానాయిక సమంత అతిథి పాత్రలో దర్శమివ్వనున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది. త్వరలోనే `థాంక్ యూ` ఫిమేల్ లీడ్స్ పై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశముంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో `థాంక్ యూ` థియేటర్స్ లో సందడి చేయనుంది.