మహేష్ షూటింగుకు సెంట్రల్ మినిస్టర్ హెల్ప్
on Nov 5, 2019
ఆర్మీ ఆఫీసర్లకు కశ్మీర్లో ఎక్కువ పని ఉంటుంది. ఆర్మీ ఆఫీసర్ నేపథ్యంలో సినిమా తీసేటప్పుడు కశ్మీర్లో షూటింగ్ చేయాలి కదా! 'సరిలేరు నీకెవ్వరు'లో మహేష్ బాబు ఆర్మీ అధికారిగా కనిపించే సన్నివేశాలను జమ్మూ కశ్మీర్లో తెరకెక్కించారు. పహల్గామ్లో కొన్ని రోజులు, శ్రీనగర్లో మరికొన్ని రోజులు షూటింగ్ చేశారు. అయితే... అక్కడ షూటింగ్ చేసుకోవడానికి పర్మిషన్ అంత ఈజీగా దొరకలేదు. చాలా కష్టపడ్డారు. సెంట్రల్ మినిష్టర్ రాజనాథ్ సింగ్ హెల్ప్ తీసుకుంది 'సరిలేరు నీకెవ్వరు' టీమ్. ఆయన రికమండేషన్ చేస్తే పర్మిషన్ వచ్చింది.
అది కూడా ఎర్లీ మార్నింగ్ 5 నుండి 10 వరకు షూటింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. హోటల్ నుండి షూటింగ్ లొకేషన్ కి చేరుకోవడానికి, మహేష్ కోసం బుల్లెట్ ప్రూఫ్ సెక్యూరిటీ అప్లై చేశారు నిర్మాతలు. లేకపోతే మరింత కష్టమయ్యేదట. 'సరిలేరు నీకెవ్వరు' టీమ్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని, హైదరాబాద్ లో అడుగుపెట్టిన మరుసటి రోజు 370 ఆర్టికల్ రద్దు చేస్తున్నట్టు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. తర్వాత జమ్మూ కశ్మీర్ లో సెక్యూరిటీ మరింత టైట్ చేశారు. అదే ప్రకటన షూటింగ్ పూర్తికాక ముందు వచ్చి ఉంటే షూటింగ్ చేయడం సాధ్యమయ్యేది కాదు.
Also Read