హిలేరియస్ కామెడీతో `సరిలేరు నీకెవ్వరు`
on Aug 2, 2019
సూపర్ స్టార్ మహేష్ హీరోగా వరుస హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి డైరక్షన్ లో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్ టైనర్ `సరిలేరు నీకెవ్వరు`. ఈ చిత్రం ఇటీవల కశ్మీర్ లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని ప్రజంట్ అన్నపూర్ణ స్టూడియోలో సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటోంది. అన్నపూర్ణ లో వేసిన ఓ రైలు సెట్ లో షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. 30 నిమిషాల పాటు సాగే ఈ ట్రైన్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ లో హిలేరియస్ కామెడీ ఉంటుందట. హీరో, హీరోయిన్ కు మధ్య లవ్ స్టార్ట్ అయ్యేది కూడా ఈ ట్రైన్ ఎపిసోడ్ లోనే అని తెలుస్తోంది. అందుకే ప్రత్యేకంగా సెట్ వేసి ఈ ఎపిసోడ్ ని చిత్రీకరిస్తున్నారు. ఇక ఖలేజా సినిమాలో తనదైన స్టైల్ లో కామెడీ పండించిన మహేష్ మరోసారి తనలోని కామెడీ యాంగిల్ ని ఈ సినిమాలో చూపించబోతున్నాడట. రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడట.