బాలయ్యతో ముచ్చటగా మూడో సారి..!
on Jul 25, 2019
నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో సి. కల్యాణ్ నిర్మించిన 'జై సింహా' సంక్రాంతికి విడుదలై హిట్ కొట్టింది. మళ్లీ అదే హీరో, అదే దర్శకుడితో సి. కల్యాణ్ మరో సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. హిట్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్లు ఫైనలైజ్ అయ్యారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు చోటుంది. అందులో ఒకరిగా ఇంతకు ముందు బాలకృష్ణతో 'లెజెండ్', 'డిక్టేటర్' సినిమాల్లో నటించిన సోనాల్ చౌహన్ ను సెలెక్ట్ చేశారు. ఈమెకు బాలయ్యతో ముచ్చటగా మూడో సినిమా అన్నమాట. మరొక హీరోయిన్గా 'కాంచన' ఫేమ్ వేదికను సెలెక్ట్ చేశారు. ఇప్పటివరకూ బాలయ్య సినిమాలో ఈమె నటించలేదు. ఇదే తొలి సినిమా. ఆగస్టు 7 నుండి ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్లో స్టార్ట్ కానుంది. ఆల్మోస్ట్ 30 రోజులు అక్కడే షూటింగ్ చేస్తారట. ఫైట్స్, రెండు సాంగ్స్, ఇంపార్టెంట్ సీన్స్ తీయడానికి ప్లాన్ చేశారు.
Also Read