`సైలెన్స్`గా అనుష్క ఫస్ట్ లుక్ !!
on Jul 2, 2019
బాహుబలి, భాగమతి లాంటి అద్భతమైన చిత్రాలతో నటించిన అనుష్క తాజాగా `నిశ్శబ్దం` అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే 50 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర దర్శకుడు హేమంత్ మధుకర్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు. అలాగే అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారని కూడా తెలిపారు. ఇక తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లోనే ప్రారంభించనున్నారని సమాచారం. పలు భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రం తెలుగులో `నిశ్శబ్దం` ఇతర భాషల్లో సైలెన్స్ ` పేరుతో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో అనుష్కతో పాటు విభిన్న నటుడు మాధవన్ , అంజలి, షాలిని పాండే , అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భాగమతి తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క నిశ్శబ్దం తో సంచలనం సృష్టించబోతుందంటున్నారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అనుష్క అభిమానులు.