పవన్ కళ్యాణ్ సాంగ్ రీమిక్స్!
on Jul 2, 2019
పవన్ కళ్యాణ్ నటించిన క్లాసిక్ ఫిలిమ్స్ లో 'తొలి ప్రేమ' ఒకటి. ఈ చిత్రానికి, అందులో పాటలకు అభిమానులు ఎంతో మంది ఉన్నారు. వారిలో హీరో నితిన్ ఒకడు. 'గుండెజారి గల్లంతయ్యిందే' సినిమాలో 'తొలి ప్రేమ'లోని 'ఏమయిందో ఏమో...' పాటను రీమిక్స్ చేశాడు. ఇప్పుడు మరో హీరో ఉదయ శంకర్ 'ఈ మనసే సే...' పాటను రీమిక్స్ చేశాడు. 'అట గదరా శివ' సినిమాతో పరిచయమైన ఈ హీరో ప్రస్తుతం నటిస్తున్న సినిమా 'మిస్ మ్యాచ్'. ఇందులో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్. పవన్ కళ్యాణ్ తొలిప్రేమ నిర్మాత జివిజి రాజు ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరు. గతంలో ఆయన నిర్మించిన సినిమాలో పాటను మరో సినిమా కోసం రీమిక్స్ చేసారన్నమాట. ఈ రీమిక్స్ స్పెషాలిటీ ఏంటంటే... పాట అంతటిని సింగిల్ షాట్ లో షూట్ చేశారు. అందుకోసం రెండు రోజులు ప్రాక్టీస్ చేశామని ఐశ్వర్య రాజేష్ తెలిపింది. సింగల్ షాట్ సాంగ్ మధ్యలో వచ్చే స్లో మోషన్ పిక్చరైజేషన్ హైలైట్ అవుతుందని ఆమె అన్నారు. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.