మరో దర్శకుడిని లైన్లో పెట్టిన బన్ని!!
on Mar 30, 2019
'నా పేరు సూర్య' తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న బన్నీ, త్రివిక్రమ్ తో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసుకుంటోన్న ఈ చిత్రం త్వరలో షూటింగ్ ప్రారంభించుకోనుంది. అలాగే సుకుమార్ కాంబినేషన్ లో రానున్న సినిమా స్క్రిప్టు దశలో ఉంది. ఇదిలా ఉంటే బన్నీ మరో దర్శకుడుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. ఒక సారి ఆ వివరాల్లోకి వెళితే... 'ఓ మై ఫ్రెండ్' చిత్రంతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన వేణు శ్రీరామ్ ఆ తర్వాత నాని హీరోగా 'ఎమ్ సిఏ' సినిమా చేసి కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. ఇటీవల వేణు శ్రీరామ్ బన్నీకి స్టోరి లైన్ వినిపించాడట. లైన్ నచ్చడంతో వేణుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది.
ఎమ్ సిఏ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న వేణు శ్రీరామ్ ఈ సినిమాతో మరో సక్సెస్ కొట్టి సక్సెస్ ఫుల్ దర్శకులు జాబితాలో నిలవాలని కసి తో వర్క్ చేస్తున్నాడట. ఇక బన్ని విక్రమ్ కె.కుమార్, మురగదాస్ లతో కూడా సినిమాలు చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.