నాగ్కు ఏమైంది.. వరుసగా రెండో ఫెయిల్యూర్
on Jan 18, 2018
టాలీవుడ్లో హీరోగా.. మోస్గ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్గా గుర్తింపు తెచ్చుకున్నారు కింగ్ నాగార్జున. ఆయన ఒక డిషెషన్ తీసుకున్నారు అంటే అది రూపాయికి వందరూపాయలు లాభం తీసుకువచ్చే నిర్ణయమేనని టాలీవుడ్లో అనుకునే మాట. అలాంటి వ్యక్తి గత కొద్దిరోజులుగా నిర్మాతగా ఫెయిల్ అవుతున్నాడు. తన పెద్ద కొడుకు నాగచైతన్య హీరోగా ఆయన నిర్మించిన రారండోయ్ వేడుక చూద్దామ్కి పర్వాలేదు అనిపించేలా వసూళ్లు వచ్చాయి. ఇక రెండో కొడుకు అఖిల్ కెరీర్ని ట్రాక్ ఎక్కించాలని భావించిన నాగార్జున భారీ బడ్జెట్తో.. డిఫరెండ్ కథతో.. క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్తో కలిసి హలో అనే సినిమాను తీశాడు. సినిమా బాగుంది.. కుర్రాడు బాగా చేశాడు అన్న ప్రశంసలు తప్ప దీనికి డబ్బులు రాలేదు.
ఆ తర్వాత చిన్న బడ్జెట్తో.. చిన్న హీరో రాజ్తరుణ్తో నిర్మించిన రాంగుల రాట్నం తనను నిలబెడుతుందని భావించిన నాగ్కు మరోసారి నిరాశే ఎదురైంది. సంక్రాంతికి విడుదలైన రాంగుల రాట్నం చూసిన వారికి.. ఎటు వెళుతుందో తెలియని కథ.. మరీ ఓవర్ అయిన విషాదం అన్ని కలిపి నాగార్జునకు నష్టాలను తీసుకొచ్చింది. పండుగ టైంలో జనం రాంగుల రాట్నం వైపు చూడటానికి కూడా భయపడ్డారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఇవన్నీ చూస్తున్న వారు నాగార్జునకు అసలు ఏమైంది.. పక్కాగా నిర్ణయం తీసుకుని లాభాల పండ పండించుకునే మనిషికి వరుసగా ఈ నష్టాలేంటి అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే హలోకి చేసినంత భారీగా రాంగుల రాట్నానికి ప్రమోషన్ చేయలేదని.. చేసుంటే కనీసం బ్రేక్ ఈవెన్ అయినా అయ్యేదని సినీ జనాలు అంటున్నారు. అలాగే తన సినిమా రెగ్యులర్ షూట్తో పాటు.. బిజినెస్ పనుల్లో బిజీగా ఉండటం అన్నపూర్ణ స్టూడియోస్కి వరుసగా ఫ్లాప్స్ తీసుకువచ్చాయి అంటూ ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో అయినా నాగ్కు సక్సెస్ రావాలని వారు కోరుకుంటున్నారు.