అనుష్కతో పాటు 'అర్జున్ రెడ్డి' హీరోయినూ...
on Sep 22, 2020
'నిశ్శబ్దం';ట్రైలర్ విడుదలైంది. అది చూశాక కథంతా అమెరికా నేపథ్యంలో జరుగుతుందని అర్థమవుతోంది. లొకేషన్స్, సన్నివేశాల్లో ఫారిన్ ఆర్టిస్టులు గట్రా చూశాక హాలీవుడ్ టచ్ ఎక్కువై, లోకల్ ఫ్లేవర్ తగ్గిన ఫీలింగ్ కలుగుతోంది.
'నిశ్శబ్దం'లో అనుష్కది ప్రధాన పాత్ర అని ముందునుంచి చెబుతున్నారు. మాధవన్ హీరో. వాళ్ళిద్దరి మధ్య ట్రాక్ ఉందని ట్రైలర్ క్లారిటీ ఇచ్చింది. అంజలి పోలీస్ ఆఫీసర్ రోల్ చేసింది. మైఖేల్ మ్యాడిసన్ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రోల్ చేశారు. అయితే, వీళ్లందరి కంటే షాలిని పాండే కథలో ఇంపార్టెంట్ రోల్ చేసినట్టు అర్థమవుతోంది. అనుష్కతో పాటు 'అర్జున్ రెడ్డి' హీరోయిన్కీ చాలా ఇంపార్టెన్స్ ఉందని ట్రైలర్ క్లారిటీ ఇచ్చింది. కథలో కీలమైన మలుపులకు, ఉత్కంఠకు షాలిని పాండే పాత్ర మూలంగా నిలవనున్నదట.
అక్టోబర్ 2న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదల కానుంది. ఇప్పటివరకు ఓటీటీలో విడుదలైన తెలుగు సినిమాలతో పోలిస్తే... ఇది కొంచెం భారీ స్టార్ కాస్ట్ ఉన్న సినిమా అని చెప్పుకోవాలి.