పృథ్వీకి షాక్ ఇచ్చిన చిరు!
on Jan 5, 2017
ఈమధ్య టాలీవుడ్ ని షేక్ చేసేస్తూ టాప్ కమెడియన్ గా దూసుకుపోతున్నాడు పృథ్వీ. 30 ఇయర్స్ ఇండ్రస్ట్రీ అంటూ ముద్దుగా పిలుచుకొనే ఈ పృథ్వీ.. టాలీవుడ్లో ఇప్పుడు అత్యధిక పారితోషికం అందుకొనే హాస్యనటుల్లో ఒకడు. అలాంటి పృథ్వీకి ఇప్పుడో షాక్ తగిలింది. అదీ..చిరు సినిమాతో. ఖైదీ నెం.150లో పృథ్వీకి కూడా నటించాడు. తనపై కొన్ని కామెడీ ట్రాక్లు రూపొందించారు. అయితే.. కథాగమనానికి అడ్డు తగులుతున్నాయన్న నెపంతో చిత్ర బృందం ఆ సీన్లని తొలగించింది. పైనల్ అవుట్ పుట్ చూసుకొన్న పృథ్వీ తన సీన్లు లేకపోవడంతో చాలా నిరుత్సాహానికి గురయ్యాడు. తన మనసులో బాధ దాచుకోలేక ఓ ట్వీట్ కూడా పెట్టాడు.
`చిరంజీవిగారి 150వ సినిమాలో నటించడం నా అదృష్టం. నేను నటించిన సీన్లని తొలగించడం నా దురదృష్టం. సంక్రాంతి పండగ రోజున నా తల్లిని కోల్పోయినంత బాధగా ఉంది` అంటూ ట్వీట్ చేశాడు. సీన్లని తొలగించడం అమ్మమరణంతో లింకు పెట్టాడంటే... పృథ్వీ ఎంత డిప్రెషన్లోకి వెళ్లిపోయాడో అర్థం చేసుకోవొచ్చు. స్వయంగా చిరునే రంగంలోకి దిగి.. కత్తెర్లు వేశాడంటే.. ఇక మిగిలినవాళ్లు అడ్డు చెబుతారా? వినాయక్ కి చాలా ఇష్టమైన ట్రాక్ అట. చాలా బాగా వచ్చిందట. కానీ. కేవలం కథకు అడ్డుపడుతుందన్న ఉద్దేశంతోనే చిరు వాటిని కత్తిరించాడట. దాంతో పృథ్వీ ఇలా బయటపడిపోవాల్సివచ్చింది.