రాజ్ తరుణ్ స్పీడ్ పెంచాడు!
on Jun 19, 2019
వరుసగా రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అవడంతో కొంత కాలం గ్యాప్ ఇచ్చాడు యంగ్ హీరో రాజ్ తరుణ్. కథల ఎంచుకునే విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఇప్పటికే దిల్ రాజు బేనర్ లో `ఇద్దరి లోకం ఒకటే` అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ ప్రారంభించుకుంది. ఇదిలా ఉంటే `గుండెజారి గల్లంతయ్యిందే` సినిమాతో దర్శకుడు పరిచయమై తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్న విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మాణంలో రాజ్ తరుణ్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ రోజు పూజా కార్యక్రమాలు సంస్థ కార్యాలయంలో జరిగాయి. ఇదిలా ఉంటే `సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు` చిత్ర దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి కి మరో సారి అవకాశం కల్పించాడట రాజ్ తరుణ్. ఈ సినిమా అన్నపూర్ణ బేనర్ లో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నవంబర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ఇక విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో రూపొందే సినిమాలో రాజ్ తరుణ్ సరసన అదితి రావ్ ని హీరోయిన్ గా తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ నుండి నాన్స్టాప్గా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో నటించే నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఫొటోగ్రఫీ: ఆండ్రూస్, మాటలు: నంద్యాల రవి, ఆర్ట్: రాజ్కుమార్, కో-డైరెక్టర్: వేణు కూరపాటి, మేకప్: శివ, కాస్ట్యూమ్స్: నాగులు, స్టిల్స్: ఆనంద్, పబ్లిసిటీ: ధని ఏలె, నిర్మాత: కె.కె. రాధామోహన్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: కొండా విజయ్కుమార్.