బాపు అంత్యక్రియలు పూర్తి
on Sep 2, 2014
ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు అంత్యక్రియలు పూర్తయ్యాయి. హిందూ సాంప్రదాయాల ప్రకారం బీసెంట్ నగర్ శ్మశానవాటికలో బాపుకు అంత్యక్రియలు నిర్వహించారు.ఈ అంతిమయాత్రలో ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రావికొండలరావు, బోనీ కపూర్, అనిల్ కపూర్ తదితర సినీ ప్రముఖులు, పలువురు అభిమానులు పాల్గొన్నారు. బాపును చివరి చూపు చూసుకోవడానికి భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు.