ఆగస్ట్ 30న 'ఆగడు' ఆడియో
on Aug 23, 2014
సూపర్ మహేష్ బాబు హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆగడు' సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియోను ఈ నెల30న శిల్పకళా వేదికలో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేశారు. ఇప్పటికే రిలీజైన టీజర్ లలో మహేష్ చెప్పిన డైలాగ్స్ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఆగడు చిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా నటిస్తోంది. శృతి హాసన్ ఐటం సాంగు చేయడం మరో ప్రత్యేకత. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు. దూకుడు కంటే ఆగడు పెద్ద హిట్ అవుతుందని చిత్ర బృందం ధీమాను వ్యక్తం చేస్తోంది.