పవన్ 'అత్తారింటిని' మహేష్ దాటుతాడా ..?
on Aug 12, 2014
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ టాపిక్. మహేష్ బాబు నటించిన 'ఆగడు' సినిమా టీజర్ ఇటీవలే తన పుట్టిన రోజున విడుదల చేశారు. ఈ టీజర్ను చూసిన అభిమానులు మళ్లీ ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు. మహేష్ బాబు పంచ్లకు పెట్టింది పేరు. ఈ సినిమాలో మహేష్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఖాకీ డ్రస్సులో మహేష్ విసిరిన 'డిక్కీ బలిసిన కోడి' డైలాగ్ ఇప్పటికే 6.5 లక్షలు వ్యూలు దాటి రికార్డులు క్రియేట్ చేస్తోంది. మహేష్ అభిమానులు సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ద్వారా ఈ ట్రైలర్ని షేర్ చేస్తున్నారు. ఈ టీజర్ అద్బుతంగా ఉందని, మహేష్ చెప్పిన డైలాగులు అదిరాయని, సినిమా కోసం వేచి చూస్తున్నామని అంటున్నారు.
దీంతో ఈ సినిమా 50 కోట్ల క్లబ్లో అవలీలగా చేరుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మహేష్ ఇప్పటి వరకూ 70 కోట్ల క్లబ్లో చేరలేదు. ఈ సినిమా దసరాకి వస్తుండటంతో అన్ని అనుకూలించి 80 కోట్ల వరకూ బాక్సాఫీసు రికార్డుల్ని తిరగరాస్తుందా లేక అత్తారింటికి దారేది సినిమా కలెక్షన్లను కూడా దాటి టాలీవుడ్ ఆల్ టైమ్ రికార్డుల్ని సృష్టిస్తుందా... తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.
ప్రస్తుతం అందరి కళ్లు 'ఆగడు'పైనే ఉన్నాయి. జూ. ఎన్టీఆర్ నటించిన 'రభస' సినిమా ఆగస్టు 29న విడుదలవుతుండటంతో.. ఈ రెండు సినిమాలకు పోటీ లేకుండా పోయింది. దీని తర్వాత రవితేజ పవర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తోన్న 'గోవిందుడు అందరివాడేలే' సినిమా మహేష్ 'ఆగడు' తో పోటీకి వస్తుందా లేక తర్వాత రిలీజ్ అవుతుందా అనే దానిపై స్పష్టత లేదు. కాబట్టి మహేష్ 'ఆగడు'కి ఎటువంటి అడ్డు లేకుండా ఇండస్ట్రీ ఆల్ టైమ్ రికార్డుల్ని తిరగరాస్తుందేమో చూద్దాం..