LATEST NEWS
వైసీపీ సీనియర్ నాయకుడు, జగన్ హయాంలో అసెంబ్లీ స్పీకర్ గా పని చేసిన  తమ్మినేని సీతారాం ఇప్పుడు కుటుంబంతో సహా పరారీలో ఉన్నారు. తమ్మినేని కుటుంబం   భూకబ్జా, ఫోర్జరీకి పాల్పడిందన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకు సంబంధించిన కేసులోనే అరెస్టును తప్పించుకోవడానికి ఆయన రాత్రికి రాత్రే.. సొంత కార్లు, ఫోన్లూ కూడా వదిలేసి పరారైపోయారు. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. బతికున్న వ్యక్తి చనిపోయినట్లుగా బోగస్ డెత్ సర్టిఫికేట్ సృష్టించి భూమిని కబ్జా చేశారన్న అభియోగాలపై ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మంది అరెస్టయ్యారు. ఆ కేసులో తమ్మినేని కుటుబ సభ్యులు అరెస్టు భయంతో అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. ఈ విషయంపై జగన్ ఇప్పటి వరకూ స్పందించకపోవడంతో పొలిటికల్ సర్కిల్స్ లో జగన్.. తమ్మినేనికి వెనకేసుకు వస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అసలు రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఈ కేసు పూర్వాపరాల్లోకి వెడితే..  శ్రీకాకుళం జిల్లాలో  4 కోట్ల రూపాయల విలువైన  స్థలాన్ని హస్తగతం చేసుకునేందుకు తమ్మినేని సీతారాం నకిలీ పత్రాలు, తప్పుడు వారసత్వ ఆధారాలు సృష్టించారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఈ కేసులో పోలీసులు అరెస్టుల పర్వానికి తెరతీశారు. కొందరిని అరెస్టు చేశారు కూడా.. ఈ నేపథ్యంలోనే తమ్మినేని కుటుంబంతో సహా పరారయ్యారు. ఈ కేసులో   ప్రధాన నిందితులుగా   తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులే ఉన్నారు. అటువంటి తమ్మినేనికి వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ అండగా నిలిచి వెనకేసుకు వస్తున్నారన్న చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది.    చట్టపరమైన విచారణ ఎదుర్కొంటున్న నేతలకు రాజకీయ అభయం ఇస్తూ, వారిపై విచారణ  అధికార తెలుగుదేశం కూటమి కక్షసాధింపుగా అభివర్ణించే ప్రయత్నం చేయడం జగన్ కు రివాజుగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   ఇప్పుడు తమ్మినేని విషయంలో కూడా జగన్ మౌనం ఆయనకు సమర్ధనే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తమ్మినేని కుటుంబం బరితెగింపుగా కబ్జాకు పాల్పడిందన్న విషయంలో   భూ యజమాని కుటుంబ సభ్యులు పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో  వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు చేపట్టిన పోలీసులు,  అక్రమ రిజిస్ట్రేషన్ కుట్ర వెనుక ఉన్న భారీ నెట్‌వర్క్‌ను ఛేదించారు. మొత్తం 13 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా, ఇందులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను A6 గా, ఆయన కుమారుడు చిరంజీవి నాగ్‌ను A5 గా, భార్య తమ్మినేని వాణిని A7 గా చేర్చారు. అంతేకాకుండా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ఈ ఫోర్జరీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసిన స్థానిక సబ్ రిజిస్ట్రార్ బొడ్డేపల్లి అరుణను A13 గా చేర్చారు. ఈ క్రమంలోనే కుట్రలో భాగస్వాములైన 8 మంది నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాధితులకు న్యాయం జరగాల్సిన ఘటనలో, నిందితులుగా ఉన్న తమ పార్టీ సీనియర్ నేతకు   జగన్  మద్దతుగా నిలవడం విమర్శలకు తావిస్తున్నది.  గతంలోనూ పార్టీ నేతలపై కేసులు నమోదైన సందర్భాల్లో జగన్ తీసుకున్న వైఖరి తరహాలోనే, ఈ కేసులోనూ తమ్మినేని సీతారాంకు పూర్తి అభయం ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఈ విషయంపై జగన్ ఇంత వరకూ స్పందించలేదు. పార్టీ పరంగా తమ్మినేని సీతారాంపై చర్యా తీసుకోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.     Srikakulam land grabbing case, fake death certificate forgery, YSR Congress Party
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు అయిన సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నరు.   ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో ఆర్థిక వ్యవస్థ, పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని, విద్యుత్ రంగం, శాంతిభద్రతలు, మైనింగ్ మరియు ఎక్సైజ్ విధానాలపై విడుదల చేసిన 7 కీలక శ్వేతపత్రాలకు   కొనసాగింపుగా, ఇప్పుడు సమగ్ర ప్రగతి నివేదికలను విడుదల చేయాలని నిర్ణయించారు.    వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్రంగా దెబ్బతిన్న వ్యవస్థలను గాడిన పెట్టడమే కాకుండా, సంస్కరణలు, పారదర్శక పాలన,  సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ఎలా నడిపించామో ఈ నివేదికల ద్వారా ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే అన్ని శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలను ఒకే చోట చేర్చి ప్రచురించాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.   ఈ  ప్రగతి ప్రకటనలో భాగంగా ప్రభుత్వం మొత్తం 10 ప్రధాన అంశాలపై ప్రత్యేక నివేదికలు సిద్ధం చేస్తున్నది.  గతంలోని అంటే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రబుత్వం కొలువుదీరిన తొలి నాళ్లలో విడుదల చేసిన 7 శ్వేతపత్రాల యాక్షన్ టేకెన్ నివేదికలతో పాటు,  అభివృద్ధి  , సుపరిపాలన,  సంక్షేమం, సాధికారత   విభాగాలపై సమగ్ర నివేదికలు విడుదల చేయనుంది.  అభివృద్ధి నివేదికలో వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు,  పర్యాటక రంగాల పురోగతిని పొందుపరచగా, సుపరిపాలన నివేదిక ద్వారా నూతన విధానాలు, డిజిటల్ విప్లవం,  వాట్సాప్ గవర్నెన్స్ వంటి  సేవల వివరాలను అందించనుంది.   ఆర్థిక, అభివృద్ధి, సంక్షేమ, పాలనా నివేదికలను స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేస్తారు. మిగిలిన నివేదికలను సంబంధిత శాఖల మంత్రులు ప్రజా సమక్షంలో ఆవిష్కరిస్తారు.   రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రికార్డు స్థాయి నిధులను పంపిణీ చేసింది. ముఖ్యంగా పేదలు, వృద్ధులు,  వికలాంగులకు ఆర్థిక భద్రత కల్పిస్తూ  ఏడాదికి సగటున రూ. 33,000 కోట్లకు పైగా కేవలం పెన్షన్ల కోసమే వెచ్చించడం దేశ సంక్షేమ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం. అదే విధంగా, పేదవారి ఆకలి తీర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చి, ఇప్పటివరకు రూ. 230 కోట్ల నిధులను కేటాయించింది. దీనివల్ల ప్రతి నెలా వేలాది మంది నిరుపేదలు, ఆటో డ్రైవర్లు,  కూలీలు భోజన ఖర్చులలో రూ. 2,500 నుండి రూ. 3,000 వరకు పొదుపు చేయగలుగుతున్నారు. మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ చేపట్టిన  స్త్రీశక్తి  ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకం రాష్ట్రంలో ఊహించని విజయాన్ని సాధించింది. ఈ ఉచిత ప్రయాణ సదుపాయం కోసం ప్రభుత్వం  రూ. 2,565 కోట్ల సబ్సిడీ భార భారాన్ని  భరించి మహిళల ఉపాధి, విద్య,  ప్రయాణ స్వేచ్ఛకు ఊతమిచ్చింది.   అమరావతి ప్రాజెక్టు పనులతో పాటు పోలవరం నిర్మాణం, రహదారుల అభివృద్ధి మరియు డ్రోన్ నిఘా ద్వారా  నిర్మూలన వంటి చర్యలతో రాష్ట్రంలో శాంతిభద్రతలు, ఆర్థిక స్థిరత్వం  నెలకొన్నాయి. ఈ నివేదికలు,  డేటా పాయింట్లు ప్రతి పౌరుడికి ప్రభుత్వ పనితీరుపై పూర్తి అవగాహనను, భరోసాని కలిగిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.  AP Govt White Papers, Chandrababu Naidu 2 Years Governance, AP Coalition Govt Progress Report, NTR Bharosa Pension Scheme
తెలుగు పారిశ్రామిక రంగంలో  ఒకప్పుడు సంచలనం సృష్టించిన అమర రాజా బ్యాటరీస్ ప్రస్థానం రెండు రాష్ట్రాల్లో రాజకీయ, ఆర్థిక విశ్లేషణలకు కేంద్రబిందువుగా మారింది. అమెరికా నుంచి మాతృభూమిపై ఉన్న   ప్రేమతో తిరిగి వచ్చిన రామచంద్ర నాయుడు, రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో ఈ భారీ పారిశ్రామిక సామ్రాజ్యానికి పునాదులు వేశారు. ఆ రోజుల్లో  అప్పటి  ముఖ్యమంత్రి దివంగత ఎన్.టి. రామారావు పారిశ్రామికవేత్తలకు పూర్తి ప్రోత్సాహం అందిస్తూ సబ్సిడీపై భూములు కేటాయించడం ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రాణం పోశారు. చిత్తూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యావంతులైన వేలాది మంది మహిళలకు స్వయంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తూ అమర రాజా ఒక అద్భుతమైన సామాజిక, ఆర్థిక విప్లవానికి అప్పట్లోనే తెరలేపింది. అయితే జగన్ హయాంలో మారిన రాజకీయ పరిణామాల కారణంగా ఈ దిగ్గజ సంస్థ ఆంధ్రప్రదేశ్ నుంచి తన విస్తరణను తెలంగాణ వైపు మళ్లించాల్సి వచ్చింది. అమర రాజా వంటి   గ్లోబల్ టెక్నాలజీ సంస్థ వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏపీలో కాకుండా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పెట్టడం ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీని చేజార్చుకోవడమేనని ప్రముఖ విశ్లేషకుడు సువేరా అన్నారు. తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన  రాజకీయం, కులం, ప్రాంతీయ విద్వేషాల కారణాలతో ఇటువంటి పారిశ్రామిక దిగ్గజం రాష్ట్రం వీడాల్సి రావడం వల్ల యువతకు రావలసిన ఉపాధి అవకాశాలు చేజారిపోయాయన్నారు. మరోవైపు, ఐటీ,  హెవీ ఇండస్ట్రీ రంగాల్లో ఉన్న వ్యత్యాసాన్ని పరిశీలిస్తే, సాఫ్ట్‌వేర్ కంపెనీల మాదిరిగా ప్రతికూల పరిస్థితులు రాగానే లాజిస్టిక్స్‌ను సులభంగా తరలించడం భారీ తయారీ రంగానికి ఏ మంత సులభం కాదు.   తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద అమర రాజా సంస్థ ప్రపంచ స్థాయి గిగా ఫ్యాక్టరీ,  భారీ బ్యాటరీ తయారీ కర్మాగారానికి శ్రీకారం చుట్టింది. ఈ ఆధునిక ప్లాంట్ ప్రారంభోత్సవం తెలంగాణ అభివృద్ధి పథంలో మరొక మైలురాయిగా నిలిచిందనడంలో సందేహం లేదు. నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును దక్కించుకోవడానికి సానుకూల వాతావరణం కల్పించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాష్ట్ర అభివృద్ధి, ఉపాధి కల్పనే ధ్యేయంగా ఈ ప్రాజెక్టుకు పూర్తి మద్దతు ప్రకటించారు. గ్లోబల్ టెక్నాలజీని స్థానిక ఉద్యోగావకాశాలతో సమన్వయం చేస్తూ వేలాది మంది తెలంగాణ యువతకు ఉద్యోగాలు అందించే దిశగా అమర రాజా అడుగులు వేస్తోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ గతంలో అమర రాజా విషయంలో జరిగిన పొరపాట్లను ప్రస్తావిస్తూ, రాష్ట్రం తరఫున పారిశ్రామికవేత్తలకు సానుకూల సందేశాన్ని ఇచ్చారు. పరిశ్రమలకు ఏపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, భవిష్యత్తులో అమర రాజా మళ్లీ తమ సొంత రాష్ట్రంలో కొత్త యూనిట్లను ఏర్పాటు చేయవచ్చని   ధీమా వ్యక్తం చేశారు. గత పాలకుల విధానాలు పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపించినప్పటికీ, మళ్లీ కొత్త కూటమి ప్రభుత్వం రావడంతో పెట్టుబడులకు సురక్షితమైన వాతావరణం ఏర్పడుతోందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఒక సంస్థ పుట్టుక నుంచి అది రెండు తెలుగు రాష్ట్రాల్లో చూపించిన ప్రభావం,  ఆర్థిక ప్రగతి పరిణామాలు పారిశ్రామిక చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచాయి. అటువంటి అమరరాజా విషయంలో కులం, మతం, ప్రాంతం పేరుతో జగన్ ఆడిన క్రూర క్రీడ వల్లే ఏపీ అమరరాజా ఏపీకి దూరం అయ్యిందని సువేరా ఆవేదన వ్యక్తం చేశారు.  Amara Raja Batteries, Divitipally Giga Factory, Amara Raja AP to Telangana, Ramachandra Galla, Revanth Reddy Amara Raja, Nara Lokesh Industrial Policy
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత తన మౌనాన్ని బద్దలు కొట్టారు. బీఆర్ఎస్ నుంచి తాను బయటకు రావడానికి కారణాలను తొలి సారిగా వెళ్లడించారు. బీఆర్ఎస్ నుంచి తాను నిష్క్రమించడానికి పార్టీలోని కొందరు గుంటనక్కల వంటి నేతలే  కారణమంటూ కుండబద్దలు కొట్టారు.  ఆ నక్కల  కారణంగానే తాను తన మార్గాన్ని ఎంచుకుని బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు.  బీఆర్ఎస్ పార్టీలోని తన మాజీ సహచరులపై తీవ్ర విమర్శలు గుప్పించిన కవిత.. బీఆర్ఎస్‌లోని కొందరు గుంటనక్కల వంటి నేతల  బృందం తనను ఒంటరిని చేసి, పక్కన పెట్టడానికి పద్ధతి ప్రకారం పనిచేశారని కవిత చెప్పారు. బీఆర్ఎస్ నుంచి తనను  బయటకు పంపడానికి ఆనక్కల బృందం.. పథకం ప్రకారం తప్పుడు ప్రచారం చేసిందనీ, వారి  కారణంగానే తాను బయటకు రాక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయనీ చెప్పారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదికగా చేసిన పోస్టు ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. తాజాగా కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ లోని తన ప్రత్యర్థులతో ఆమె పోరాటం కొనసాగుతోందని తేటతెల్లం చేస్తున్నాయి.    BRS, Kalvakuntla Kavitha, BRS Party Resignation, Breaks Silence,
  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ అత్యంత కీలకమైన మలుపుగా మారబోతోంది. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ఆమోదం పొందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుండటంతో, రాష్ట్రంలో ఇప్పటివరకు కొనసాగుతున్న సంప్రదాయ రాజకీయ సమీకరణాలు తలకిందులయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల భౌగోళిక సరిహద్దులు మారడం లేదా అవి రిజర్వ్‌డ్ స్థానాలుగా రూపాంతరం చెందడం వంటి పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ వడ్డే వెంకటేశ్వరరావు మరో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్‌ రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ టోన్‌ న్యూస్ నిర్వహించింది. ఈ అంశంపై ప్రస్తుత రాజకీయ పరిస్థితులు - వ్యూహాలుదేశవ్యాప్తంగా మారిన రాజకీయ పరిస్థితుల్లో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సిన అవసరం లేని విధంగా లోక్‌సభలో పూర్తిస్థాయి బలాన్ని పుంజుకుంది. పశ్చిమ బెంగాల్, బిహార్ వంటి రాష్ట్రాల్లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టసభల్లో ఆమోదింపజేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దీని ప్రభావం నేరుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై పడనుంది.ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతమున్న 175 అసెంబ్లీ స్థానాల సంఖ్య పునర్విభజన తర్వాత దాదాపు 250 స్థానాలకు పైగా పెరిగే అవకాశం ఉంది.  ఈ మార్పు కేవలం సంఖ్యాపరంగానే కాకుండా, రాజకీయ వ్యూహాల పరంగా కూడా కీలకమైనదిగా మారనుంది. గతంలో 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన తరహాలోనే, ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా మండలాల సర్దుబాటు చేసే అవకాశాలు ఉన్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బలమైన ప్రతిపక్ష నాయకుల నియోజకవర్గాల్లోని కీలక మండలాలను వేరే నియోజకవర్గాల్లో కలపడం ద్వారా ప్రత్యర్థుల ఓటు బ్యాంకును దెబ్బతీయడం ఈ వ్యూహంలో ప్రధాన భాగం.రాజకీయ పరిణామాలు మరియు అంతరార్థంఈ డీలిమిటేషన్ ప్రక్రియలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంచుకోట అయిన పుంగనూరు నియోజకవర్గాలు అత్యంత ప్రభావితం కానున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.  భౌగోళిక మార్పులు మరియు జనాభా ప్రాతిపదికన ఈ రెండు నియోజకవర్గాలు ఎస్సీ (SC) రిజర్వ్‌డ్ స్థానాలుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది.పులివెందులలోని కొన్ని మండలాలను జమ్మలమడుగు, ధర్మవరం వంటి పక్క నియోజకవర్గాల్లోకి నెట్టడం ద్వారా ఆ స్థానం యొక్క రాజకీయ రూపురేఖలను మార్చే ప్రయత్నాలు జరగొచ్చు. ఇదే జరిగితే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భవిష్యత్తులో పోటీ చేయడానికి కమలాపురం, జమ్మలమడుగు లేదా కొత్తగా ఏర్పడే వేంపల్లి వంటి ప్రత్యామ్నాయ సాధారణ నియోజకవర్గాలను వెతుక్కోవాల్సి వస్తుంది.  నియోజకవర్గాల సరిహద్దులు మార్చే క్రమంలో జిల్లా రిటర్నింగ్ అధికారులు (RO) కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి, అధికార కూటమి తనకు అనుకూలమైన రీతిలో మండలాల విభజనను ప్రణాళికాబద్ధంగా అమలు చేసే అవకాశం ఉంది.భవిష్యత్తు రాజకీయ ప్రభావంనియోజకవర్గాల పునర్విభజన బిల్లు చట్టరూపం దాలిస్తే ఏపీ రాజకీయాల్లో ఒక పెద్ద సంచలనానికి తెరలేస్తుంది. కొత్తగా వందలాది మంది అభ్యర్థులకు రాజకీయ అవకాశాలు లభించినప్పటికీ, సీనియర్ నాయకులు తమ సొంత నియోజకవర్గాలను కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఒకవైపు ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని మండలాలకు సమాన దూరంలో నియోజకవర్గ కేంద్రాలు ఉండాలనే డిమాండ్లు ఉన్నప్పటికీ, ఆచరణలో మాత్రం ఇది రాజకీయ ప్రతీకార వ్యూహాలకు, సరిహద్దుల మార్పుల ద్వారా ప్రత్యర్థులను బలహీనపరిచే సాధనంగా మారే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ భౌగోళిక మార్పులు ఏపీలో సరికొత్త రాజకీయ శకానికి మరియు కొత్త నాయకత్వాల ఆవిర్భావానికి కారణం కానున్నాయి. ఇలాంటి అంశాలపై  పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి. AP Delimitation 2026, Pulivendula Constituency, Punganur Constituency, YS Jagan Mohan Reddy, AP Assembly Seats Increase, Andhra Pradesh Politics, constituency delimitation bill, AP Political Strategy, Delimitation Impact on YSRCP, AP Assembly Elections  
ALSO ON TELUGUONE N E W S
నటసింహం నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్‌కు తీవ్ర ఆందోళన కలిగించే వార్త ఒకటి ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఆయన నటిస్తున్న మోస్ట్ ఏవైటెడ్ ప్రాజెక్ట్ NBK 111 షూటింగ్ సెట్‌లో అనుకోకుండా ప్రమాదం చోటుచేసుకుంది.  కాకినాడ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. విరామం లేకుండా సాగుతున్న ఈ షూటింగ్ షెడ్యూల్‌లో అనుకోకుండా బాలకృష్ణ స్లిప్ అయ్యి కిందపడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బాలకృష్ణ మోకాలికి స్వల్ప గాయమైంది. కాకినాడ పోర్ట్ వద్ద జరుగుతున్న షూటింగ్ స్పాట్‌లో ఈ ఘటన చోటుచేసుకోగానే, వెంటనే అప్రమత్తమైన చిత్ర యూనిట్ సభ్యులు బాలయ్యను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆయనను పరీక్షించి తక్షణమే ప్రాథమిక వైద్య చికిత్స అందించారు. అయితే, బాలకృష్ణ మోకాలికి తగిలిన గాయం చాలా స్వల్పమైనదేనని, అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు వెల్లడించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన కోలుకుంటున్నారని, విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని తెలిపారు.      Nandamuri Balakrishna, Injury, NBK 111, Kakinada Port shooting  
సినిమా.. ఈ విశ్వంలో సినిమా ఇచ్చే ఆనందం మరొకటి ఉండదు. బహుశా సినిమాని మించిన గొప్పది ఇంక రావడానికి ఆస్కారం కూడా లేదు. అటువంటి సినిమాని కుటుంబ సమేతంగా వెళ్లి చూసే వాళ్ళు ఎంతో మంది. ఒక రకంగా కుటుంబ సమేతంగా వెళ్లి చూసే వాళ్ళు ఉన్నప్పుడే సినిమాకి భారీ విజయం లభిస్తుంది. కానీ శృంగారాన్ని వేరే కోణంలో చూపిస్తూ శృతిమించిన సినిమాలు రావడంతో వాళ్ల సంఖ్య తగ్గింది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చర్చకి వస్తుందంటే కాసేపటి క్రితం యష్ టాక్సిక్ నుంచి సాంగ్ రిలీజ్ అయ్యింది. సాంగ్ ని చూసిన వాళ్ళందరూ చాలా బోల్డ్ గా ఉందని చెప్తున్నారు.  దీంతో  యష్ ఒకప్పుడు ఒక బహిరంగ సభలో మాట్లాడిన మాటలని సోషల్ మీడియా వేదికగా గుర్తు చేస్తున్నారు. యష్ మాట్లాడుతు 'నేను చేసే ప్రతీ సినిమా నా తల్లిదండ్రులతో, నా కుటుంబంతో కలసి హాయిగా థియేటర్‌లో కూర్చుని చూడగలిగేలా ఉండాలి. ఎక్కడా అసభ్యతకు తావులేకుండా, అందరూ మెచ్చే కథలనే ఎంచుకుంటాను అని చెప్పాడు. కానీ టాక్సిక్ నుంచి రిలీజ్ అవుతున్న ప్రతి కంటెంట్ శృతిమించిన శృంగారంతో ఉంటుంది. ఎన్ని విమర్శలు వస్తున్నా సరే మేకర్స్ మాత్రం టాక్సిక్ లో రొమాన్స్ ఫ్రీ అనే విధంగా తమ ప్రచార చిత్రాలని రిలీజ్ చేస్తున్నారు. ఇపుడు రిలీజైన సాంగ్ పరిస్థితి కూడా అంతే. Also read: తల్లి పేరు నిలబెడుతుందా.. తెలుగు ప్రేక్షకులు ఎలాంటి వారంటే! దీంతో యష్ గతంలో మాట్లాడిన మాటలని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‌ ని  దృష్టిలో ఉంచుకుని సినిమాలు తీస్తానని చెప్పిన హీరో, ఇప్పుడు 'A Fairy Tale for Grown-ups'అనే ట్యాగ్‌లైన్‌తో ఇంత బోల్డ్ మరియు డార్క్ లవ్ స్టోరీని ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్న కూడా  అందరిలోనూ మెదులుతోంది.   yash, toxic, kiara adwani, geethu mohan das  
మలయాళ చిత్ర పరిశ్రమ నుండి వచ్చే వైవిధ్యమైన కథాంశాలు ఎప్పుడూ భారతీయ సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూనే ఉంటాయి. ముఖ్యంగా హారర్, సస్పెన్స్, మిస్టరీ థ్రిల్లర్ జోనర్లలో మోలీవుడ్ మేకర్స్ చేసే సరికొత్త ప్రయోగాలు థియేటర్లలో విజయం సాధించడమే కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా విపరీతమైన ఆదరణ పొందుతాయి. సాధారణంగా హారర్ సినిమాలకు సస్పెన్స్, మిస్టరీ లేదా కొంత హాస్యం జోడించడం మనం తరచుగా చూస్తుంటాం. కానీ ఈసారి అందుకు పూర్తి భిన్నంగా, భయంకరమైన హారర్ కథాంశానికి అద్భుతమైన ఫాంటసీ అంశాలను జోడించి అత్యంత ఆసక్తికరంగా తెరకెక్కించిన సరికొత్త చిత్రం 'ది సీక్రెట్ ఆఫ్ కళింగ' (The Secret of Kalinga). థియేటర్లలో వీక్షకులను విశేషంగా అలరించిన ఈ వైవిధ్యమైన మలయాళ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించేందుకు సంపూర్ణంగా సిద్ధమైంది. సస్పెన్స్ ఓటీటీ ఆడియన్స్ ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'సన్ నెక్స్ట్' (Sun NXT) లో ఈ నెల 24వ తేదీ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సన్ నెక్స్ట్ యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేయడంతో హారర్ థ్రిల్లర్ ప్రేమికుల్లో ఉత్సాహం రెట్టింపైంది. ఈ చిత్రంలో వర్సటైల్ యాక్టర్ ధ్యాన్ శ్రీనివాసన్ కథానాయకుడిగా ప్రధాన పాత్రలో నటించి తన ప్రతిభావంతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. ప్రతిభావంతుడైన దర్శకుడు సనీష్ ఉన్నికృష్ణన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, కథలో చివరి వరకు సస్పెన్స్ కాపాడిన విధానం ప్రతి ఒక్కరినీ కట్టిపడేసింది. ఈ ఏడాది జూన్ 18వ తేదీన థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'ది సీక్రెట్ ఆఫ్ కళింగ' సినిమా సినీ ప్రియులతో పాటు విమర్శకుల నుంచి కూడా అత్యుత్తమ ప్రశంసలు అందుకుంది. సాధారణంగా ఫాంటసీ హారర్ చిత్రాల్లో కథనం ఎంత ఉత్కంఠభరితంగా ఉంటే ఆ సినిమా అంతగా వీక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ విషయంలో దర్శకుడు సనీష్ ఉన్నికృష్ణన్ నూటికి నూరు శాతం విజయం సాధించారనే చెప్పాలి. 'ఐరా' (Aira) ప్రొడక్షన్ బ్యానర్‌పై అత్యంత ఘనంగా, ఉన్నతమైన నిర్మాణ విలువలతో రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. విజువల్స్, టెక్నికల్ వేల్యూస్ పరంగా ఈ సినిమా ప్రతి ఒక్కరినీ విపరీతంగా అలరించింది. సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది దీని నేపథ్య సంగీతం మరియు ఛాయాగ్రహణం. విమల్ జిత్ విజయన్ అందించిన అధ్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లిందని సినీ విశ్లేషకులు ప్రశంసించారు. ప్రతి హారర్ సన్నివేశంలోనూ విమల్ జిత్ విజయన్ అందించిన సంగీతం ప్రేక్షకులకు ఒళ్ళు గగుర్పొడిచే భయాందోళనను, తీవ్రమైన థ్రిల్లింగ్ అనుభూతిని అందించేలా రూపుదిద్దుకుంది. అలాగే ప్రతిభావంతుడైన కెమెరామెన్ ఆశ్రిత్ సంతోష్ అందించిన ఫొటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్, డార్క్ టోన్ విజువల్స్ సినిమాలోని ఫాంటసీ లోకంలోకి ప్రేక్షకులను నేరుగా తీసుకెళ్తాయి. విజువల్స్ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా ఈ కంటెంట్ సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో చివరి నిమిషం వరకు గ్రిప్పింగ్‌గా కొనసాగుతుంది. ఈ చిత్రంలో ధ్యాన్ శ్రీనివాసన్‌తో పాటు ఇతర కీలక పాత్రల్లో మాళవిక మీనన్, అల్తాఫ్ సలీమ్, రియాజ్ ఖాన్, మెరీనా మైఖేల్ తమ అద్భుతమైన అభినయంతో ఆకట్టుకున్నారు. ప్రతి పాత్రకూ కథలో తగిన ప్రాధాన్యత ఉండటం, నటీనటులు తమ నటనతో ప్రాణం పోయడం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. జూన్ 18న థియేట్రికల్ రిలీజ్ పొంది సూపర్ టాక్ సొంతం చేసుకున్న ఈ మిస్టరీ ఫాంటసీ డ్రామా, జూలై 24 నుంచి సన్ నెక్స్ట్‌లో అందుబాటులోకి రానుండటంతో డిజిటల్ వేదికపై కూడా అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. వీకెండ్‌లో ఒళ్ళు గగుర్పొడిచే భయానక వాతావరణం, ఉత్కంఠభరితమైన ఫాంటసీ మిస్టరీ అనుభూతిని పొందాలనుకునే సినిమా ప్రియులు సన్ నెక్స్ట్‌లో రాబోతున్న 'ది సీక్రెట్ ఆఫ్ కళింగ' సినిమాను అస్సలు మిస్ కాకుండా చూడాల్సిందే!
రాకింగ్ స్టార్ యష్ 'టాక్సిక్' నుంచి విడుదలైన తొలి పాట 'తబాహీ' రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్ తో చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు అదే జోష్‌ను కొనసాగిస్తూ మేకర్స్ రెండో పాట 'మనసాగదే' (తెలుగు వెర్షన్)ను విడుదల చేశారు. 'తబాహీ' ప్రేమలోని ఉప్పొంగే ఉద్వేగాలను చూపిస్తే, 'మనసాగదే' మాత్రం ప్రేమలోని మరో కొత్త కోణాన్ని ప్రజెంట్ చేసింది. మనసులో దాచుకున్న భావాలు, తీరని తపన, మౌనంగా మిగిలిపోయిన ప్రేమను ఈ పాట ఎంతో అందంగా పలికిస్తుంది. ప్రతి ప్రేమకథలో ఎన్నో భావోద్వేగాల పొరలు ఉంటాయని, ప్రతి దశ ప్రేమకు కొత్త అర్థాన్ని ఇస్తుందని ఈ పాట చెబుతోంది. ఈ పాటలో రాయా(యష్), రెబెకా (తారా సుతారియా) పాత్రల మధ్య బంధాన్ని పూర్తిగా కొత్త కోణంలో చూపించారు. వీరిద్దరి మధ్య కనిపించే కెమిస్ట్రీ, ఎమోషన్స్ కట్టిపడేసింది. 'తబాహీ' లో కనిపించిన  రాయా పాత్ర ఈసారి మనసులో నడుస్తున్న సంఘర్షణను కూడా సూచిస్తుంది. నయనతార కూడా యష్ తో కలిసి సిగరెట్ కాలుస్తూ ఈ సాంగ్ లో కనిపించడం విశేషం. ఇప్పటిదాకా విడుదలైన కంటెంట్, ఫస్ట్ సింగిల్ తరహాలోనే ఈ సాంగ్ విజువల్స్ కూడా బోల్డ్ గానే ఉన్నాయి. తనిష్క్ బాగ్చి, అర్స్లాన్ నిజామీ, ఫహీమ్ అబ్దుల్లా స్వరపరిచిన ఈ రొమాంటిక్ మెలోడీకి సిద్ధార్థ్ బస్రూర్ తన వోకల్స్ తో ప్రాణం పోశారు. ఐదు భాషల్లో విడుదలైన ఈ పాట తెలుగు వెర్షన్‌కు 'మనసాగదే' టైటిల్‌ తో రిలీజ్ చేశారు.  తెలుగు సాహిత్యాన్ని రామజోగయ్య శాస్త్రి అందించారు. హిందీలో 'మధోష్', కన్నడలో 'మనమోహక', తమిళంలో 'తడుమారుధేయ్', మలయాళంలో 'మధుమోహిని' పేర్లతో ఈ పాట విడుదలైంది. ఈ చిత్రంలో యష్, నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. యష్, గీతు మోహన్‌దాస్ కలిసి కథను అందించగా, గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మిస్తున్న 'టాక్సిక్' కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతోంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళంతో పాటు పలు భాషల్లో డబ్ వెర్షన్లు విడుదల కానున్నాయి. ఈ చిత్రం 2026 ఆగస్టు 26న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.     Yash, Toxic Movie, Second Single, Manasaagadhe Song, Tara Sutaria  
Yash takes the spotlight alongside Tara Sutaria in the brand-new track Manasaagadhe from the highly anticipated film Toxic: A Fairy Tale for Grown-Ups. Presented by Monster Mind Creations, KVN Productions, and Zee Music Company, this second song arrives following the record-breaking response to the high-energy hit Tabaahi. The song reveals a completely different lens on the evolving relationship between the characters Raya and Rebecca. While their chemistry holds a playful ease, Madhosh focuses deeply on the unspoken longing and emotional conflict beneath the surface. It successfully shows a softer, more carefree side of the leading man, adding rich new layers to the film's overall story. Composed by the acclaimed trio of Tanishk Bagchi, Arslan Nizami, and Faheem Abdullah, this romantic anthem features the soulful vocals of Siddharth Basrur. The singer poured raw honesty into the track, ensuring the music reflects genuine vulnerability and intense unsaid emotions rather than just simple heartbreak. Releasing in Hindi, Kannada, Telugu, Tamil, and Malayalam, the song is a true pan-Indian offering with lyrics penned by celebrated regional writers. Written and directed by Geetu Mohandas, this massive cinematic project promises an unforgettable theatrical experience when it releases globally on August 26.  Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
మాస్ మహారాజా రవితేజ అంటేనే స్క్రీన్ పై ఎనర్జీ, డైనమిక్ డైలాగ్ డెలివరీ, మరియు వినోదాల మేళవింపు గుర్తుకొస్తాయి. కానీ ఈసారి ఆయన సరికొత్త రూపంలో, హృదయాన్ని హత్తుకునే అత్యంత గాఢమైన భావోద్వేగాలతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. రవితేజ కెరీర్‌లో 77వ చిత్రంగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఇరుముడి'. ప్రతిభావంతుడైన దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చి ఫిలిం నగర్ వర్గాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ విశేషంగా ఆకట్టుకుంటోంది. రవితేజ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను అధికారికంగా ప్రారంభించారు. డబ్బింగ్ స్టూడియోలో ఆయన పవర్ ఫుల్ ఎమోషనల్ డైలాగ్ చెబుతున్న మేకింగ్ వీడియోను చిత్రబృందం విడుదల చేయడంతో అభిమానులలో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ వీడియోలో రవితేజ "నాకు ఒకే ఒక్క కూతురు... పేరు మణెమ్మ" అంటూ పూర్తి ఆర్ద్రతతో, గంభీరమైన గొంతుతో చెప్పిన డైలాగ్ ప్రేక్షకులలో ఒళ్లు గగుర్పొడిచే భావోద్వేగాన్ని నింపింది. కేవలం ఒక్క డైలాగ్‌తోనే ఈ సినిమాలో తండ్రీకూతుళ్ల మధ్య ఉండే బంధం ఎంత గాఢంగా ఉండబోతోందో దర్శకుడు స్పష్టం చేశారు. ఈ డబ్బింగ్ పనుల వీడియోలో దర్శకుడు శివ నిర్వాణతో పాటు రవితేజ కూతురి పాత్రలో నటిస్తున్న బాలనటి నక్షత్ర కూడా కనిపించడం విశేషం. ఈ చిత్రంలో రవితేజ ఒక సెంటిమెంటల్ తండ్రిగా కనిపిస్తున్నారు. కథ ప్రకారం కొన్ని అనూహ్య సంఘటనల వల్ల తీవ్రమైన మనస్తాపానికి గురై మద్యానికి బానిసైన ఓ తండ్రి, తన కూతురు చెప్పిన ఒక్క మాటతో తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడు అనేదే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం. కూతురి ప్రేమ కోసమే ఆయన అయ్యప్ప మాల ధరించి, తనలోని చెడు అలవాట్లను వదిలించుకుంటూ సాగించే ఆధ్యాత్మిక, భావోద్వేగ ప్రయాణం ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని అందించనుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఆఖరి దశకు చేరుకుంది. మొత్తం షూటింగ్ దాదాపు పూర్తయిపోగా, కేవలం మరో 3 రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని చిత్రబృందం ప్రకటించింది. ఈ స్వల్ప షూటింగ్ కూడా త్వరలోనే ముగియనుండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరింత జోరందుకున్నాయి. మరోవైపు ప్రసిద్ధ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంబంధించి రీ-రికార్డింగ్ పనులను కూడా ఇప్పటికే ప్రారంభించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి నిర్మాతలు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా ప్రియా భవానీ శంకర్ నటిస్తుండగా, సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర మరియు శ్వాసిక వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. ఈ 77వ చిత్రం రవితేజ కెరీర్‌లోనే అత్యంత ప్రత్యేకంగా నిలవనుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దేవుడిపై భక్తి, తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధం, మరియు కమర్షియల్ మాస్ అంశాలను సమపాళ్లలో మేళవించి శివ నిర్వాణ ఈ చిత్రాన్ని అద్భుతంగా మలచారని సమాచారం. కూతురు మాట విని అయ్యప్ప మాల ధరించిన ఒక సగటు తండ్రి సంఘర్షణ, ఆధ్యాత్మికంగా ఆయన పొందే పరివర్తన ప్రతీ ఒక్కరి హృదయాలను కదిలిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 21న థియేటర్లలోకి రానున్న 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేయడమే కాకుండా, మాస్ మహారాజా రవితేజ నటనకు మరో మలుపుగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.   https://x.com/MythriOfficial/status/2079159318684004557?s=20  
  భారతీయ చిత్ర పరిశ్రమలో తెలుగు సినిమాకి, తెలుగు సినిమా ప్రేక్షకులకి  ఉన్న ప్రత్యేకత వేరు. తమకి నచ్చాలే కానీ లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా అన్ని భాషల సినీ తారల్ని గుండెల్లో పెట్టుకొని పూజిస్తారు. ఈ కోవలోనే  తన అద్భుతమైన పెర్ఫార్మ్ , సమ్మోహన పరిచే గ్లామర్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న బాలీవుడ్ భామ  రవీనా టాండన్. నేటికి రవీనా తెలుగు సాంగ్స్ ని యూట్యూబ్ లో వింటూ ఉండేవాళ్ళు కోకొల్లలు. ఇప్పుడు రవీనా కుమార్తె, నట వారసురాలు  రషా థడానీ 'శ్రీనివాసమంగాపురం' ద్వారా  తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతోంది. 'మంగ' అనే క్యారక్టర్ లో సదరు క్యారక్టర్ ప్రకారం  జీవకళ ఉట్టిపడే స్వచ్ఛమైన తెలుగు అమ్మాయిగా కనిపిస్తోంది. దర్శకుడు అజయ్ భూపతి కథ చెప్పినప్పుడే హీరో, హీరోయిన్ పాత్రల రెంటికీ సమాన ప్రాధాన్యత ఉందనే విషయాన్ని స్పష్టం చేశారని రాషా ఇంటర్వ్యూలలో వెల్లడించింది. తెలుగు భాష కొత్త అయినప్పటికీ, కథలోని భావోద్వేగాలను సరిగ్గా అర్థం చేసుకుని స్వయంగా డైలాగులు చెప్పడానికి ఎంతో శ్రమించింది. షూటింగ్ సమయంలో తిరుపతి ప్రాంతంలో నెలల తరబడి గడిపిన రాషా, అక్కడి వాతావరణానికి, సంస్కృతికి బాగా దగ్గరైంది. సోషల్ మీడియాలో ఇప్పటికే 1 మిలియన్ (10 లక్షలు) పైగా ఫాలోవర్లతో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఈ భామ, తన మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకోవడానికి సర్వశక్తులూ ఒడ్డుతోంది. తల్లి రవీనా టాండన్ ఇచ్చిన సలహాలు, సూచనలు తనకు షూటింగ్‌లో ఎంతగానో ఉపయోగపడ్డాయని, టాలీవుడ్ పరిశ్రమ ఇచ్చే గౌరవం, ఇక్కడి కథల వైవిధ్యం తనకు ఎంతో నచ్చాయని వెల్లడి చేసిన రాషా ఏ మేరకు తెలుగు ప్రేక్షకులని తన చెప్పు చేతల్లో ఉంచుకుంటుందో చూడాలి.  Also read: సరికొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన అందాల నటి.. ఓకూ అంటే ఏమిటో తెలుసా!  జులై 30న విడుదల కానున్న శ్రీనివాస మంగాపురం సూపర్‌స్టార్ మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేనికి కూడా హీరోగా మొదటి చిత్రం .చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తుండగా, ప్రముఖ వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ సమర్పిస్తున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీ రోల్ లో కనిపిస్తున్నాడు.     
హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్ (ORR) పై ఈరోజు తెల్లవారుజామున యాక్సిడెంట్ జరిగింది. టాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘గుమ్మడి నర్సయ్య’ బయోపిక్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న దర్శకుడు పరమేశ్వర్ ప్రయాణిస్తున్న కారు ప్రయాణంలో ఊహించని విధంగా ప్రమాదానికి గురైంది. జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం ఘోరంగా దెబ్బతిన్నప్పటికీ, దర్శకుడు పరమేశ్వర్ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  ప్రమాద తీవ్రతను చూస్తే కారు ముందు భాగం, బోనెట్ మరియు గ్రిల్ పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. కారు బాగా డ్యామేజ్ కావడం చూస్తుంటే ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందో అర్థమవుతోంది. అయితే అదృష్టవశాత్తూ దర్శకుడు పరమేశ్వర్‌ క్షేమంగా బయటపడ్డారు. తెలంగాణ ప్రజా నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న 'గుమ్మడి నర్సయ్య' సినిమాపై సినీ ప్రియుల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. 'గుమ్మడి నర్సయ్య' పాత్రలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ నటిస్తుండటం విశేషం.   Gummadi Narsaiah, Director Parameshwar, Car Accident, Hyderabad ORR  
  రాజా రాణి, కాలా, విశ్వాసం', 'అరణ్మనై 3'  వంటి పలు హిట్ చిత్రాల్లో అర్ధమైన పెర్ఫార్మ్ తో అలరించి, దక్షిణాది చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న భామ సాక్షి అగర్వాల్. ఇప్పుడు ఒక కొత్త అవతారంలో అభిమానుల ముందుకు వచ్చారు. తన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని 'ఓకూ' (OKUU) అనే ప్రీమియం పెర్ఫార్మెన్స్ న్యూట్రిషన్ కంపెనీని అధికారికంగా ప్రారంభించి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఓకూ ని స్టార్ట్ చెయ్యాలనేది తన ఐదేళ్ల కల. జపాన్ తత్వశాస్త్రంలోని 'ఓకూ' అనే పదం నుంచి ఈ పేరును ఆమె ఎంచుకున్నారు. ఆంతరంగిక శక్తి, లోతైన సామర్థ్యం అనే అర్థానిచ్చే ఈ పదం వెనుక ఒక పెద్ద ఆశయమే దాగి ఉంది. సాధారణంగా సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఏదైనా బ్రాండ్‌కు ప్రచారకర్తగా మారడం లేదా వేరే సంస్థల లైసెన్సింగ్ భాగస్వామ్యంతో ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడం చూస్తుంటాం. కానీ సాక్షి అగర్వాల్ దానికి పూర్తి భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఇది కేవలం ఒక సెలబ్రిటీ బ్రాండ్ కాదని, ఐదేళ్ల పాటు తాను రేయింబవళ్లు పడిన కష్టానికి, నిరంతర పరిశోధనకు ఫలితమని ఆమె ఎంతో గర్వంగా చెప్తున్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ప్రతి దశలోనూ ఆమె స్వయంగా పాల్గొని ఈ సంస్థను తీర్చిదిద్దారు. ఒకవైపు బిజీగా సాగే సినిమా షూటింగ్‌లు, మరోవైపు కఠినమైన ఫిట్‌నెస్ నిత్యకృత్యాలను సమతుల్యం చేసుకునే క్రమంలో సాక్షి అగర్వాల్‌కి మార్కెట్‌లో దొరికే పోషకాహార ఉత్పత్తుల్లోని లోపాలు స్పష్టంగా అర్థమయ్యాయి. మార్కెట్లో అందుబాటులో ఉన్న చాలా ఉత్పత్తులు ఆరోగ్యకరమని ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, వాటిల్లో గుప్తంగా దాగి ఉండే చక్కెరలు, అనవసరమైన ఫిల్లర్లు మరియు ఇతర రసాయనాలు ఉండడం ఆమెను కలవరపరిచింది. భారతీయులకు అత్యుత్తమ, నమ్మకమైన, స్వచ్ఛమైన పోషకాహారాన్ని అందించాలనే లక్ష్యంతోనే ఆమె స్వయంగా ఈ రంగానికి శ్రీకారం చుట్టారు. వేరొకరి బ్రాండ్‌ను ప్రమోట్ చేయడం కంటే, తానే స్వయంగా నిలబడి గర్వంగా చెప్పుకోగలిగే ఉత్పత్తిని తయారుచేయడమే సరైన మార్గమని ఆమె నమ్మారు. Also: రాజాసాబ్ మారుతి డైరెక్షన్ లో వరుణ్ తేజ్.. వంద శాతం ఈ వార్త....!   ఈ ప్రయాణం అనుకున్నంత సులభంగా ఏమీ సాగలేదు. పూర్తి నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఉత్పత్తులను అందించడానికి సాక్షి అగర్వాల్ సుదీర్ఘ కాలం శ్రమించారు. ఈ ఐదేళ్ల ప్రయాణంలో కేవలం చివరి 11 నెలల్లోనే ఉత్పత్తుల ఫార్ములేషన్ కోసం ఏకంగా 551 రకాల ప్రయోగాలు మరియు మార్పులు చేశారు. ఎక్కడా ఎలాంటి రాజీ పడకుండా, శాస్త్రీయ ఆధారాలతో ఈ ప్రొటీన్ బార్‌ను రూపుదిద్దారు. ఈ మొక్కల ఆధారిత (ప్లాంట్-బేస్డ్) ప్రొటీన్ బార్‌లో ప్రతి ఒక్కరికీ అవసరమైన సమగ్ర పోషకాలు నిండి ఉన్నాయి. ఇందులో ఏకంగా 35 గ్రాముల అత్యధిక ప్రొటీన్, అసలు చక్కెర లేకుండా జీరో షుగర్, జీర్ణక్రియకు సహాయపడే 14 గ్రాముల డైటరీ ఫైబర్ మరియు చర్మ సౌందర్యానికి, ఆరోగ్యానికి ఉపయోగపడే 6 గ్రాముల కొల్లాజెన్ బూస్ట్ ఉన్నాయి. అంతేకాకుండా ఆరోగ్యానికి హాని కలిగించే మాల్టోడెక్స్ట్రిన్ వంటి పదార్థాలను పూర్తిగా నివారించారు.  ఈ విషయంపై ఆమె మాట్లాడుతు 'గత ఐదేళ్లుగా నేను రెండు వేర్వేరు సమాంతర జీవితాలని  గడిపాను. ప్రపంచం నన్ను ఒక నటిగా చూస్తున్న సమయంలో, చాలా కొద్దిమందికి మాత్రమే తెలిసిన నా ఇంకో ప్రయాణం ఈ 'ఓకూ' నిర్మాణం. భారతదేశానికి ఇంతకంటే మెరుగైన, స్వచ్ఛమైన పోషకాహారం లభించాలనే బలమైన కోరికతో నేను ప్రతిరోజూ శ్రమించాను" అని సాక్షి అగర్వాల్ ఎంతో భావోద్వేగంతో వెల్లడించారు.  
  మారుతి... చోటా డైరెక్టర్ నుంచి బడా డైరెక్టర్ గా ప్రమోషన్ పొంది పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ తో రాజా సాబ్ చేసాడు. చేసాడు అనే కంటే ప్రభాస్ అవకాశం ఇచ్చాడని చెప్పవచ్చు. కానీ కథనంలోని లోపాలు, రిలీజ్ కి ముందు తాత, మనవడు కథలా ప్రమోషన్స్ లో చూపించడం, ఆ తర్వాత నాయనమ్మ, మనవడు కథ అవ్వడం, ఇలా పలు లోపాల వల్ల రాజా సాబ్ డిజాస్టర్ ని అందుకుంది.  మారుతి తన తదుపరి ప్రాజెక్ట్ కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ని  కలిసి కథ వినిపించారని, రీజనబుల్ బడ్జెట్‌తో ఈ సినిమా పట్టాలెక్కనుందని సోషల్ మీడియాలో కథనాలు  వైరల్ అయ్యాయి.  కానీ, ఈ ప్రచారంపై తాజాగా వరుణ్ తేజ్ వర్గాల నుంచి  స్పష్టమైన వివరణ లభించింది. మారుతి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తున్నట్లు వస్తున్న వార్తలు 100 శాతం అవాస్తవమని, వాటిల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు. మెర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’ ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రావడానికి సర్వం సిద్ధమైంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో వరుణ్ తేజ్ కాలికి తీవ్రమైన గాయం అయినప్పటికీ, ఆ నొప్పిని సైతం భరిస్తూ సినిమా ప్రమోషన్లలో అత్యంత చురుగ్గా పాల్గొంటున్నారు. ఆగస్టు 7న ‘కొరియన్ కనకరాజు’ గ్రాండ్ రిలీజ్ తర్వాత చిన్నపాటి విరామం తీసుకుని, ఆ వెంటనే తన చెల్లెలు నిహారిక కొణిదెల నిర్మాణంలో కమిటీ కుర్రోళ్లు ఫేమ్ యదు వంశీ దర్శకత్వంలో రాబోతున్న ‘బరి’ అనే స్పోర్ట్స్ డ్రామా షూటింగ్‌లో పాల్గొననున్నారు. Also read: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఈనాడు యాజమాన్యం గుడ్ న్యూస్.. చరిత్రలో ఇదే ఫస్ట్ టైం  వరుసగా రెండు విభిన్నమైన సినిమాలతో డైరీ ఫుల్ అయి ఉన్న వరుణ్ తేజ్, మారుతి కాంబినేషన్‌పై వస్తున్న కథనాలన్నీ వట్టి పుకార్లేనని తేలడంతో మెగా అభిమానులకు ఓ స్పష్టత వచ్చినట్లయింది. మరోవైపు, దర్శకుడు మారుతి తన కామెడీ బ్రాండ్ మార్క్ కథతో తిరిగి బాక్సాఫీస్ వద్ద బలంగా కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.   varun tej, maruthi, bari  
అంతర్జాతీయ చెస్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై 20న జరుపుకుంటారు . చెస్ అనేది మెదడును ఎక్కువగా ఉపయోగించే ఆట. అందువల్ల, చెస్ ఆడటం పిల్లల మేధస్సును పదును పెడుతుందని చాలా మంది చెబుతుంటారు. చాలా మంది తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ఆలోచనా, గ్రహణ సామర్థ్యాలను మెరుగుపరచడానికి పిల్లలతో చెస్ ఆడించాలని అనుకుంటారు. కానీ కేవలం చెస్ ఆడటం మాత్రమే మేధస్సును పదును పెడుతుందా? దీనిపై వైద్యులు ఏమంటున్నారో తెలుసుకుంటే.. ఆలోచించే అలవాటు.. చదరంగం ఆడేటప్పుడు పిల్లలు ప్రతి ఎత్తును జాగ్రత్తగా పరిశీలించాలి,.  ప్రత్యర్థి ఎలాంటి ఎత్తు వేస్తాడు అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి,  ఇది పిల్లలు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే బదులు ముందుగా ఆలోచించేలా ప్రోత్సహిస్తుంది. క్రమంగా, వారు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే అలవాటును పెంపొందించుకోగలుగుతారు. ఏకాగ్రత.. చదరంగం ఆడుతున్నప్పుడు పిల్లల పూర్తి ఏకాగ్రత ఆటపైనే ఉంటుంది. వారి ఏకాగ్రత ఒక్క క్షణం తగ్గినా,  లేదా డిస్టర్బ్ అయినా  వారు ఆటను ఓడిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల, ఈ ఆట పిల్లల ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అందుకే చెస్ ఆడేటప్పుడు పిల్లలు ఏకాగ్రతగా ఉండటం వారి చదువులకు, ఇతర ముఖ్యమైన పనులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. జ్ఞాపకశక్తి.. చెస్ ఆడేటప్పుడు పిల్లలు అనేక ఎత్తులు, నియమాలు , చెస్ ఆడే ఇతర  పద్ధతులను గుర్తుంచుకోవలసి ఉంటుంది. దీనివల్ల వారి మెదడు నిరంతరం చురుకుగా ఉంటుంది. వైద్యుల ప్రకారం, ఇది వారి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది , కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తిని కూడా పెంచుతుంది. సహనం.. చెస్ అనేది తొందరపడి ఆడే ఆట కాదు. ప్రతి ఎత్తుగడకు జాగ్రత్తగా ఆలోచన అవసరం. కొన్నిసార్లు, గెలవడానికి చాలాసేపు వేచి ఉండాల్సి వస్తుంది. ఇది పిల్లలకు సహనాన్ని నేర్పి, వాస్తవిక దృక్పథంతో నిర్ణయాలు తీసుకునే అలవాటును పెంపొందించడంలో సహాయపడుతుంది. పాఠాలు.. చెస్ అనే కాదు.. ఏ ఆటలో అయినా సరే.. ఎల్లప్పుడూ గెలవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఓడిపోతాం. కానీ ఓటమి పిల్లలు తమ తప్పులను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని వైద్యులు చెబుతారు. ఇది తర్వాతిసారి మరింత మెరుగ్గా ఆడేందుకు వారిని ప్రోత్సహిస్తుంది. ఈ అలవాటు వారి చదువులో , ఇతర జీవిత పనులలో కూడా సహాయపడుతుంది. చెస్ మాత్రమే కాదు.. కేవలం చెస్  ఆడటం వల్ల మాత్రమే పిల్లల మెదడు పదునుదేరదని వైద్యులు చెబుతున్నారు. మంచి నిద్ర, సరైన పోషణ, రోజువారీ శారీరాన్ని చురుగ్గా ఉంచే ఇతర ఆటలు, చదువు కూడా చాలా అవసరం. ఇవన్నీ కలిసినప్పుడే పిల్లల మెదడు చక్కగా అభివృద్ధి చెందుతుంది. అందువల్ల, చదరంగంతో పాటు మంచి రోజువారీ అలవాట్లపై దృష్టి పెట్టడం ముఖ్యం.                                     *రూపశ్రీ.  
చిన్నతనం అంటేనే ఆటలు, అల్లరి పనులు, చిన్న చిన్న గొడవలు. పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు స్నేహితులు, తమ తోటి పిల్లలతో ఆడుకుంటారు.. అలాగే కొన్ని సార్లు గొడవలు కూడా పడతారు.  పిల్లలు తప్పులు చ చేయడం సహజం. తోటి పిల్లలను బాధపెట్టడం కూడా సహజం. కానీ పిల్లలు మాత్రం  కొంత సేపు అయ్యాక లేదా ఒక రోజు తర్వాత అవన్నీ మర్చిపోయి తిరిగి కలిసి ఆడుకుంటారు, మళ్లీ గొడవలు కూడా పడతారు.  అందుకే పిల్లలను కల్మషం లేని వారు అని చెబుతూ ఉంటారు. అయితే గొడవలు పడినప్పుడో.. లేదా ఇతర పిల్లలు మీ పిల్లలను బాధపెట్టినప్పుడు, ఇతర పిల్లలు చేసిన తప్పులను మీ పిల్లలు మర్చిపోకుండా మనసులో ఉంచుకోవడం వంటివి చేసినప్పుడు అది మంచి విషయం కాదని పిల్లల పెంపకం నిపుణులు అంటున్నారు.   దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. కారణం.. పిల్లలు ప్రపంచాన్ని పెద్దల కంటే చాలా భిన్నంగా చూస్తారు. వారికి, ఒక బొమ్మను పగలగొట్టడం లేదా ఆటలో ఓడిపోవడం చాలా పెద్ద విషయం. అటువంటి పరిస్థితిలో, ఒక స్నేహితుడు వారి మాట వినకపోతే, వారు అభద్రతకు గురై, మోసపోయినట్లు భావిస్తారు. క్రమంగా, పిల్లలలో అహంభావం పెరుగుతుంది, దీనివల్ల క్షమాపణ చెప్పడం లేదా క్షమాపణ కోరడం ఒక కష్టమైన పనిగా అనిపిస్తుంది. ప్రవర్తనను మార్చడం వల్ల కలిగే ప్రభావం.. పిల్లవాడికి క్షమించే అలవాటు లేకపోతే, అతను క్రమంగా ఒంటరివాడు అవుతాడు. మనసులో పగను ఉంచుకోవడం అతని మానసిక ఒత్తిడిని పెంచుతుంది. దేనికీ సర్థుకుని పోలేని మనస్తత్వం,  ఇతరుల తప్పులను చూపించే కారణం వల్ల పిల్లవాడు ఎవరితో కూడా ఎక్కువకాలం స్నేహంగా ఉండలేడు.  పిల్లలు సున్నితమైన, అర్థం చేసుకునే వ్యక్తులుగా మారాలంటే,  క్షమించడం నేర్చుకోవాలి. తల్లిదండ్రులే సహాయం చేయాలి.. తల్లిదండ్రులు చిన్న విషయాలకే కోపగించుకుని, క్షమాపణ చెప్పకపోయినా లేదా క్షమించకపోయినా, పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. ఒకవేళ తను తప్పు చేసి ఉంటే ఏమి ఆశించి ఉండేవాడో ఆ పిల్లవాడిని అడగాలి. ఇతర పిల్లల పరిస్థితిని అర్థం చేసుకునేలా పిల్లలను  ప్రోత్సహించాలి. ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు మీరు కూడా క్షమాపణ చెప్పి, ఎదుటి వ్యక్తిని క్షమించడం నేర్చుకోవాలి. క్షమాపణ చెప్పడం బలహీనతకు సంకేతం కాదని, గొప్పతనానికి సంకేతమని పిల్లలు  అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. స్నేహాన్ని బలపరిచే విషయాలు.. ఎవరూ పర్పెక్ట్ కారని పిల్లలకు వివరించాలి. ప్రతిఒక్కరూ తప్పులు చేస్తారు,  కాబట్టి అందరిలో  తప్పులు మాత్రమే  చూడటం తప్పని పిల్లలకు చెప్పాలి. స్నేహ సంబంధం అనేది నమ్మకం , క్షమాగుణం అనే పునాదులపై ఆధారపడి ఉంటుంది. 'క్షమించండి' అని చెప్పడంలో ఉన్న  ప్రాముఖ్యతను పిల్లలకు  వివరించాలి.  క్షమించడం ఎంతో గొప్ప గుణం అని  చెప్పాలి. చిన్నతనంలో క్షమించడం నేర్చుకున్న పిల్లలు భవిష్యత్తులో మరింత సంతోషంగా, విజయవంతంగా ఉంటారని మనస్తత్వవేత్తలు నమ్ముతారు. కాబట్టి పిల్లలకు క్షమాగుణం అలవాటు చేయాలి.                                       *రూపశ్రీ.  
  వయసు పైబడే కొద్దీ, చాలా మంది తల్లిదండ్రులకు రోజువారీ పనులలో సహాయం అవసరం అవుతుంది. ఉద్యోగాల రీత్యా పిల్లలు దూరంగా ఉండటం లేదా విదేశాల్లో ఉండటం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో పిల్లలు తల్లిదండ్రుల కోసం పిల్లలు కేర్ టేకర్ ను నియమించుకోవాలని అనుకుంటారు.  తల్లిదండ్రులు చాలా పెద్దవారైపోయి,  వారికి వారి పనులు కూడా చేసుకోలేని పరిస్థితిలో చాలా కుటుంబాలు కూడా కేర్ టేకర్ ను నియమించుకోవాలి అనుకుంటాయి.  అయితే కేవలం అనుభవం ఉందనో లేదా తక్కువ  పేమెంట్ తో కేర్ టేకర్ వస్తున్నారనో  తల్లిదండ్రుల కోసం కేర్ టేకర్ ను నియమించడం మంచిది కాదని అంటున్నారు లైఫ్ స్టైల్ నిపుణుల.   తల్లిదండ్రుల ఆరోగ్యం, భద్రత , మానసిక ఆరోగ్యం  కోసం  మంచి కేర్ టేకర్ ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే కేర్ టేకర్ ను నియమించుకునే ముందు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి.  అవేంటో తెలుసుకుంటే.. ముఖ్యమైన విషయం.. మొదట తల్లిదండ్రులకు ఎలాంటి సంరక్షణ అవసరమో నిర్ధారించుకోవాలి. వారికి అల్జీమర్స్, డిమెన్షియా లేదా మరో తీవ్రమైన అనారోగ్యం ఉంటే, శిక్షణ పొందిన కేర్ టేకర్  అవసరం అవుతారు. వారికి కేవలం సమయానికి మందులు వేసుకోవడం, ఆహారం తినడం లేదా రోజువారీ పనులు చేసుకోవడంలో సహాయం అవసరమైతే, ఒక సాధారణ కేర్ టేకర్ కూడా  సరిపోతారు. కేర్ టేకర్ ను  ఎంచుకునే ముందు, స్నానం చేయడం, బట్టలు మార్చుకోవడం, ఆహారం తినడం, మరుగుదొడ్డికి వెళ్లడం, మందులు వేసుకోవడం లేదా రాత్రిపూట వారికి ఎంత సంరక్షణ అవసరమో వంటి రోజువారీ అవసరాల లిస్ట్ ను తయారు చేసుకోవాలి. ఇది సరైన కేర్ టేకర్ ను  ఎంచుకోవడాన్ని సులభతరం చేస్తుంది. ప్రశ్నలు అడిగేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు.. కేర్ టేకర్ ను ఇంటర్ప్యూ చేసే  సమయంలో అనుభవం గురించి అడిగితే సరిపోదు. వారు ఇంతకుముందు ఏ జబ్బు ఉన్న వ్యక్తులకు సర్వీస్ చేశారో,  మెడిసిన్ షెడ్యూల్ ను  నిర్వహించగలరో లేదో, అవసరమైతే భోజనం వండగలరో లేదో,  వైద్య అత్యవసర పరిస్థితిలో సరైన నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం ఉందో లేదో కూడా తెలుసుకోవాలి.  వీల్‌చైర్ లో ఉన్న తల్లిదండ్రుల కోసం  లేదా మంచం నుండి లేవడానికి సహాయం అవసరమయ్యే వారి గురించి పై  విషయాన్ని ముందుగానే చర్చించాలి.   తల్లిదండ్రులను కలవాలి.. కేర్ టేకర్ ను నియమించాలనే నిర్ణయం తీసుకునే ముందు, కేర్ టేకర్ ను తల్లిదండ్రులకు తప్పకుండా పరిచయం చేయాలి. దీనివల్ల తల్లిదండ్రులు, కేర్ టేకర్ ఇద్దరూ  ఒకరితో ఒకరు కంఫర్ట్ గా ఉన్నారో లేదో అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. కొన్నిసార్లు, అనుభవం కంటే ప్రవర్తన , మాట్లాడే విధానం వంటివి ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ప్రతి కేర్ టేకర్ ట్రైనింగ్ తీసుకున్నవారే అయి ఉండరు అనే విషయం  గుర్తుంచుకోవాలి. చాలా మందికి వృద్ధులను చూసుకునే విషయంలో అనుభవం లేదా వైద్య శిక్షణ ఉండదు. అందువల్ల వృద్దులకు  ఇన్సులిన్ ఇవ్వడం, రక్తంలో చక్కెర స్థాయిలను చెక్ చేయడంలో,, గాయానికి కట్టు కట్టడం లేదా ఇతర నర్సింగ్ పనులు అవసరం అయితే.. వాటిని చేసేందుకు వీలుగా నర్సింగ్ శిక్షణ తీసుకున్న వారిని ఎంచుకోవాలి. కుటుంబ భాద్యత.. చాలామంది కేర్ టేకర్ ను నియమిస్తే.. ఇక తల్లిదండ్రుల విషయంలో ఎలాంటి బాధ్యత,   భయం లాంటివి తమకు లేనట్టే అని అనుకుంటారు.  కానీ కేర్ టేకర్ ఉన్నంత మాత్రాన కుటుంబ బాధ్యతలు పూర్తిగా  వదిలేయాలని అర్థం కాదు.. కేర్ టేకర్ తల్లిదండ్రులను సరిగా చూసుకుంటున్నారా లేదా అని చెక్ చేస్తూ ఉండాలి.  కేర్ టేకర్ తమను బాగా చూసుకుంటున్నారా లేదా అని పెద్దలను అడిగి తెలుసుకుంటూ ఉండాలి, అలాగే కొందరు పెద్దవాళ్లు చాదస్తంగా కేర్ టేకర్ లు ఎంత బాగా చూసుకున్నా తృప్తి పడరు. ఇలాంటి పరిస్థితులలో కేర్ టేకర్ ను అర్ఖం చేసుకోవడం,  కేర్ టేకర్ కు మద్దతుగా ఉండటం చాలా ముఖ్యం.                                 *రూపశ్రీ.  
డెంగ్యూ పై భారత్ ఘన విజయం.. వ్యాక్సిన్ వచ్చేసింది..! వర్షాకాలం వేడి నుండి ఉపశమనం కలిగించినప్పటికీ, వర్షం, నీరు నిలవడం, వరదలు వంటివి  వివిధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ సమయంలో దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం కూడా గణనీయంగా పెరుగుతుంది. ప్రతి సంవత్సరం వర్షాకాలం రాగానే చాలామంది  డెంగ్యూ గురించి  భయపడతారు.  జూలై - అక్టోబర్ నెలల మధ్య ఆసుపత్రులలో డెంగ్యూ రోగుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. డెంగ్యూ సమస్య చాలా తీవ్రంగా మారితే అంతర్గత రక్తస్రావ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది, ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు. ఈ ప్రమాదాల మధ్య, డెంగ్యూ విషయంలో భారతదేశంలో ఒక పెద్ద పురోగతి సాధించబడింది. జపాన్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ టకేడా ఫార్మాస్యూటికల్ అభివృద్ధి చేసిన డెంగ్యూ వ్యాక్సిన్, క్యూడెంగా, భారత ఔషధ నియంత్రణ సంస్థ నుండి ఆమోదం పొందింది. ముఖ్యంగా, భారతదేశంలో ఆమోదం పొందిన మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్ ఇదే. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. భారతదేశంలో డెంగ్యూ వ్యాక్సిన్.. ఇప్పటివరకు  డెంగ్యూకు ఎలాంటి సరైన చికిత్స లేదు.. రోగి లక్షణాలను తగ్గించడానికి సహాయక చికిత్స అందించబడేది.  కానీ ఇప్పుడు వ్యాక్సిన్ ను కనుగొన్నారు.  నివేదికల ప్రకారం నాలుగు రకాల డెంగ్యూ వైరస్‌ల నుండి రక్షణ కల్పించేలా ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. ఇదే  దీనిలో ప్రత్యేకత. అంతేకాకుండా, ఈ వ్యాక్సిన్ ఇచ్చే ముందు డెంగ్యూ వచ్చిందో లేదో పరీక్షించాల్సిన అవసరం ఉండదట.   గత 20 ఏళ్లుగా భారతదేశంలో డెంగ్యూ కేసులు చాలా రెట్లు పెరిగిన కారణంగా ఈ వ్యాక్సిన్ కు  ఆమోదం లభించింది. ప్రతి సంవత్సరం వేలాది మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు , చాలా మంది రోగులను ఆసుపత్రిలో చేర్చవలసి వస్తోంది. సమర్థవంతమైన వ్యాక్సిన్ ఉంటే మంచిదని ఎంతో కాలంగా వైద్యుల నుండి ప్రజల వరకు అందరూ ఎంతో ఎదురుచూశారు.   భారతీయ కంపెనీ బయోలాజికల్-ఇ సహకారంతో టకేడా ఈ వ్యాక్సిన్‌ను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు కూడా ప్రారంభించింది. కుడెంగా టీకా.. కంపెనీ ప్రకారం క్యూడెంగా ఒక టెట్రావాలెంట్ లైవ్-అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్. సులభంగా చెప్పాలంటే, ఈ వ్యాక్సిన్‌ను నాలుగు రకాల డెంగ్యూ వైరస్‌ల నుండి రక్షణ కల్పించేలా రూపొందించారు. ఇందులో బలహీనంగా ఉన్న వైరస్ ఉంటుందట.. దీన్ని శరీరంలో ప్రవేశపెడితే..   శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ వ్యాధిని కలిగించకుండానే వైరస్‌ను గుర్తించి, పోరాడుతుందట.   భారతదేశంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ వ్యాక్సిన్ ను ఆమోదించడం  చాలా మేలైందని అంటున్నారు.  అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, గత రెండు దశాబ్దాలలో భారతదేశంలో డెంగ్యూ కేసులు దాదాపు 11 రెట్లు పెరిగాయి.   టకేడా 2024 సంవత్సరంలో భారతీయ వ్యాక్సిన్ తయారీ సంస్థ బయోలాజికల్-ఇతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, బయోలాజికల్-ఇ ప్రతి సంవత్సరం సుమారు 50 మిలియన్ డోసులను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తుంది.  ఈ దశాబ్దం చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏటా 100 మిలియన్ డోసులను ఉత్పత్తి చేయాలన్న  లక్ష్యాన్ని సాధించడానికి ఇది టకేడాకు సహాయపడుతుందట.                                          *రూపశ్రీ.  
పిల్లలకు కూడా ఆర్థరైటిస్ వస్తుందా.. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త! రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid Arthritis) అనేది పెద్దవారికే వచ్చే వ్యాధి అని చాలామంది అనుకుంటారు. కానీ ఈ సమస్య పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే కీళ్ల నొప్పులు, వాపులు, కదలికల్లో ఇబ్బందులు, ఎదుగుదలపై ప్రభావం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఈ వీడియోలో హోమియోపతి వైద్య నిపుణులు డా. ప్రవీణ్ కుమార్ పిల్లల్లో వచ్చే రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి సులభంగా వివరించారు. ఈ వ్యాధి ఎందుకు వస్తుంది? ప్రారంభ లక్షణాలు ఎలా గుర్తించాలి? ఏ వయస్సు పిల్లలకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది? తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చికిత్సలో ఆలస్యం చేస్తే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? వంటి ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. అలాగే పిల్లలలో కీళ్ల నొప్పి, ఉదయం లేవగానే కీళ్లు బిగుసుకుపోవడం, తరచూ వాపులు రావడం వంటి లక్షణాలను ఎలా గుర్తించాలో కూడా డాక్టర్ వివరించారు. సరైన సమయంలో వైద్యుడిని సంప్రదించడం వల్ల పిల్లల ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో కూడా ఈ వీడియోలో తెలుసుకోండి. పిల్లల ఆరోగ్యం గురించి ప్రతి తల్లిదండ్రులు తప్పకుండా చూడాల్సిన ఉపయోగకరమైన వీడియో ఇది. గమనిక: ఈ వీడియోలో చెప్పిన సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
స్మోకింగ్ మానాలంటే చాలా కష్టంగా ఉందా? ఇలా చేస్తే ఈజీగా మానేయవచ్చు..! ధూమపానం ఆరోగ్యానికి హానికరం.  ఈ విషయాన్ని పేపర్ లు,  టీవీ యాడ్స్ మాత్రమే కాకుండా ఏకంగా  సిగరెట్ ప్యాకెట్ ల పైన కూడా రాసి ఉంటుంది. ఇలా ఎవరు ఎంత చెప్పినా సరే.. చాలామంది స్మోక్ చేయడం మాత్రం మానరు. స్మోకింగ్ వల్ల ఎవరికి ఎంత సమస్య వచ్చినా దాని విషయంలో చాలా బలహీనంగా ఉంటారు. కానీ స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి, ఆస్తమా, క్షయ,  క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు కూడా కారణం అవుతుంది. కేవలం ధూమపానం చేసేవారికే కాకుండా ఆ పొగను ఇతరులు పీల్చడం వల్ల ఇతరులకు కూడా సమస్య వస్తుంది. అయితే స్మోకింగ్ మానాలని మానలేకపోతున్న వారికి కొన్ని మంచి మార్గాలు ఉన్నాయి.  వాటిని పాటిస్తే స్మోకింగ్ మానేయడం చాలా ఈజీ.. ఆ మార్గాలు ఏెంటో తెలుసుకుంటే.. నిర్ణయం, కట్టుబడి ఉండటం.. ధూమపానం మానేయాలని నిర్ణయించుకుంటే మొదట ఎప్పటి నుండి మానేయాలి అనే విషయాన్ని నిర్ణయించుకోవాలి.  ఈ నిర్ణయం గురించి  కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా చెప్పాలి,  చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలి.  దీని వల్ల ఇతరులకు చెప్పాం కాబట్టి మానెయ్యాలి అనే ఆలోచన కూడా ఉంటుంది. పైగా ఫలానా రోజు నుండి మానేయాలి అని మనసును కూడా సన్నద్ధం చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులు,  స్నేహితులు కూడా ప్రో్త్సహించే అవకాశం ఉంటుంది. కొత్త అలవాట్లు.. ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం, యోగా లేదా వేగంగా నడవడం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా.. కొత్త అభిరుచిని అలవరచుకోవడం లేదా తమను తాము ఏదో ఒక పనిలో  నిమగ్నం చేసుకోవడం  కూడా ధూమపానం చేయాలనే కోరికను తగ్గించడంలో సహాయపడుతుంది. వైద్య సహాయం.. స్మోకింగ్ మానేయడానికి పదేపదే ప్రయత్నించినప్పటికీ  ధూమపానం మానుకోలేకపోతే, వైద్యుడిని లేదా స్మోకింగ్మ మానేయడానికి సహాయపడే నిపుణులను సంప్రదించాలి.  అవసరమైతే వారు నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (NRT), మందులు లేదా కౌన్సెలింగ్‌ను సిఫార్సు చేసే అవకాశం  ఉంటుంది.  వైద్యుడిని సంప్రదించకుండా ఎలాంటి మందులను వాడటం అయితే మంచిది కాదు. 4-డి సూత్రం.. "4-డి" సూత్రం అత్యంత ప్రభావవంతమైన పద్ధతిగా పరిగణించబడుతుంది. స్మౌకింగ్ చేయాలనే కోరికలు కలిగినప్పుడు, వెంటనే చేయకూడదు.. కొద్దిసేపు ఆగాలి, ఎందుకంటే అవి సాధారణంగా ఐదు నిమిషాల్లో తగ్గిపోతాయి, లోతైన శ్వాస తీసుకోవాలి, నీరు త్రాగాలి,  అదే ఆలోచనలో ఉండకుండావేరే పనులలో తమను తాము నిమగ్నం చేసుకోవడం లేదా స్నేహితులతో,  కుటుంబ సభ్యులతో మాట్లాడటం వంటి పనుల ద్వారా మైండ్ డైవర్ట్ చేసుకోవాలి.   స్మోకింగ్ మానడానకి  ప్రయత్నం చేసేటప్పుడు మొదట్లో చాలా కష్టంగా అనిపించవచ్చు.  కానీ పైన చెప్పుకున్నట్టు పాటిస్తూ ఉంటే తొందరలోనే స్మోకింగ్ మానేయవచ్చు.                                       *రూపశ్రీ.