LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో పర్యటిస్తున్నారు. పులివెందుల జగన్ అడ్డాగా చెబుతారు. అక్కడ ఆయనకు తిరుగులేని ఆధిపత్యం ఉందని అంటారు. అయితే ప్రస్తుతం పరిస్థితి మాత్రం అందుకు ఒకింత భిన్నంగా ఉంది. గత ఏడాది ఆగస్టులో జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికలలో పులివెందులలో వైసీపీ అభ్యర్థి అవమానకరం అన్న రీతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోవడంతో జగన్ అడ్డాగా అప్పటి వరకూ అంతా భావించిన పులివెందులలో వైసీపీ గాలిపోయినట్లైంది. జగన్ కోట బీటలు వారిందని అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు.  అటువంటి పులివెందులలో జగన్ ఇప్పుడు పర్యటిస్తున్నారు. సాధారణంగా ఒక ఎమ్మెల్యే తన సొంత నియోజకవర్గంలో పర్యటించడం అన్నది సాధారణమే. అలాగే జగన్ కూడా పర్యటిస్తున్నారు అనుకోవడానికి లేకుండా ఆయన గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయంలో నూతన విగ్రహ ప్రతిస్ఠాపన చేశారు. ఔను నందిపల్లిలోని నందీశ్వర ఆలయంలో జగన్ బుధవారం (ఫిబ్రవరి 25) నూతన విగ్రహ ప్రతిష్ఠాపన చేయడమే కాకుండా ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , దేవాలయాలను మన సంస్కృతీ, సంప్రదాయాల ప్రతీకలుగా అభివర్ణించారు. అయితే గతంలో  ఎన్నడూ ఇలా ఆలయాల సందర్శన, పూజలు నిర్వహించిన దాఖలాలు లేవు. పైపెచ్చు తన హయాంలో ఆలయాలపై జరిగిన దాడులపై కూడా జగన్ పెద్దగా స్పందించలేదు. అయితే ఇప్పుడు జగన్ తన పులివెందుల పర్యటనలో ప్రత్యేకంగా ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేయడం, ప్రత్యేక పూజలు నిర్వహించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఓ వైపు అసెంబ్లీలో తిరుమల లడ్డూపై చర్చకు గైర్హాజర్ కావడంతో తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో వైసీపీ తప్పు చేసినట్లుగా సర్వత్రా ఒక భావన అయితే వ్యక్తం అవుతోంది. జగన్ యాంటీ హిందూ అన్న ప్రచారం ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో  హిందూత్వ వ్యతిరేకి అనే ముద్రకు దూరం కావడానికి జగన్ ఇప్పుడు తన నియోజకవర్గ పరిధిలోని ఓ ఆలయాన్ని సందర్శించి, విగ్రహ ప్రతిష్ఠ చేశారన్న చర్చ జోరుగా సాగుతోంది. గతంలో అంటే వైసీపీ హయాంలో కూడా జగన్ ఇలా హిందూ వ్యతిరేక ముద్ర తొలగించుకునేందుకు  పీఠాధిపతుల వద్దకు వెళ్లిన సంగతి విదితమే. ఇప్పుడు కూడా అదే తరహాలో పులివెందులలో కూడా ఆలయ విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇక పోతే.. జడ్పీటీసీ ఎన్నికలో వైసీపీ ఓటమి తరువాత పులివెందులలో జగన్ హవా తగ్గిందన్న భావన వైసీపీ శ్రేణులలోనే వ్యక్తం అయ్యింది. ఈ నేపథ్యంలోనే జగన్ వ్యూహం మార్చి తన పర్యటనలో ప్రజాదర్బార్ లు నిర్వహిస్తున్నారు. అయితే ఇవేమంత సత్ఫలితాలను ఇస్తున్నట్లు కనిపించడం లేదని పరిశీలకులు అంటున్నారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాయలసీమ కరవును నివారించడానికి, సాగు, తాగు నీరు అందించడానికీ చేస్తున్న పనులు, చేపడుతున్న కార్యక్రమాలు ఇందుకు కారణమంటున్నారు. అలాగే రాయలసీమ అభివృద్ధి పనులు సైతం జోరుగా సాగుతున్నాయి. అలాగే పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన ద్వారా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జనంలో పాగా వేస్తున్నది. ఈ నేపథ్యంలోనే జడ్పీటీసీ ఉప ఎన్నికలో పులివెందులలో వైసీపీ ఓటమి తరువాత నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి అంపశయ్యపై ఉన్నట్లుగా తయారైందనీ, జగన్ తన పర్యటనలు, ఆలయ సందర్శనతో ఈ పరిస్థితి మర్చగలుగుతారా అన్న అనుమానాలు రాజకీయవర్గాలలో వ్యక్తమౌతున్నాయి. 
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సెక్యూరిటీ తొలగింపు వ్యవహారంలో సుప్రీంకోర్టులో ఆసక్తికరమైన చర్చ జరిగింది. డబ్బున్న వారికి పోలీసు సెక్యూరిటీ ఎందుకు? మీ డబ్బు శక్తి వాడండంటూ, పోలీసు భద్రత ఇప్పుడు హోదా గా మారిందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.   నాలిక కోస్తా అనడం ఇప్పుడు సర్వసాధారణంగా మారిందన్న పేర్కొన్న సుప్రీం కోర్టు..   ఆ మాటలను పట్టుకుని అదే నిజమని నమ్మి సెక్యూరిటీ కోరడం తగదని సూచించింది. గతంలో మీ కుటుంబంలో  ఆరుగురి హత్య జరిగిందని ఇప్పుడు సెక్యూరిటీ కోరడం కూడా సరైనది కాదని పేర్కొంది.  ఇక గతంలోకన్నా ప్రస్తుతం పోలీసులకన్నా మిన్నగా ప్రైవేట్ సెక్యూరిటీ పని చేస్తోంది. కాబట్టి మీరు మీ సొంత సెక్యూరిటీ పెట్టుకోమని సుప్రీం కోర్టు కాటసాని న్యాయవాదులకు సూచించింది. అయితే కాటసాని రాంభూపాల్ రెడ్డి కి డబ్బు శక్తి ఉందని అనడం కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆయనకు వెయ్యి కోట్ల ఆస్తులున్నట్టుగా వార్తలు వినిపించాయి. అయితే అది నిజం కాదని అంటారాయన. ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం సుమారు వంద కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కూడా ఉండవు. అయితే కాటసానిది ఫ్యాక్షన్ కుటుంబం. మే 27, 1979న జరిగిన ఒక దారుణమైన ఘటనలో కాటసాని రాంభూపాల్ రెడ్డి తండ్రి, ఆయన ఆరుగురు దాయాదులు ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యారు. ఆ తర్వాత 1986లో ఆయన సోదరుడు కూడా హత్యకు గురయ్యారు. వీటి ఆధారంగా ఇప్పుడు ముప్పు ఉందనడమేంట సుప్రీం కోర్టు పేర్కొంది. ఒక వేళ మీకు ప్రాణహాని ఉంటే, లోకల్ పోలీసులకు తెలియక పోదు. వారు కూడా ఒక శాస్త్రీయమైన అంచనాకు వచ్చినపుడు ఆటోమేటిగ్గా మీకు భద్రత కల్పిస్తారని సుప్రీం కోర్టు పేర్కొంది. అంతేగానీ మీరు ప్రతిపక్ష నేత కాబట్టి  సెక్యూరీటీ కావాలంటే కుదరదని పేర్కొంటూ,  మీరు ఎమ్మెల్యేగా గెలిచినా ఆ సెక్యూరిటీ ఉండేది. అది కూడా లేక పోవడంతోనే 2ప్లస్2 భద్రత తొలగించారు. ఇవాళ,రేపు ఏదో ఒక పార్టీల్లో చేరడం చాలా చాలా సులువు. అలాంటిది మేం ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం.. సెక్యూరిటీ కలిపించమని అందరూ వచ్చి అడిగితే.. ఉన్న పోలీసు వ్యవస్థ చాలదని సుప్రీం కోర్టు కామెంట్ చేసింది. 
గత కొద్ది కాలంగో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం అంశం ఆంధ్రప్రదేశ్ లో పెను రాజకీయ దుమారం రేపుతున్న సంగతి విదితమే.  దీనిపై అధికార తెలుగుదేశం కూటమి, వైసీపీ మధ్య మాటల యుద్ధం ఎడతెగకుండా కొనసాగుతోంది.  సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన  ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై దర్యాప్తు చేసి.. కల్తీ వాస్తవమేనని థృవీకరించింది. నిర్ధారించింది.  వాస్తవానికి ఇక్కడితో ఈ అంశంవై వివాదానికి ఫుల్ స్టాప్ పడాలి. ఇక కల్తీకి కారకులెవరు? అన్నది చట్టం చూసుకుంటుంది.  అయితే వైసీపీ మాత్రం కల్తీ  విషయం అలా ఉంచండి.. లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో చంద్రబాబు చెప్పినట్లుగా జంతువుల కొవ్వు లేదుగా అంటే నానా హంగామా చేస్తోంది. చంద్రబాబు అవాస్తవాలను ప్రచారం చేశారని ఎదురుదాడి చేస్తున్నది. అక్కడితో ఆగకుండా  తన కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్ కు లబ్ధి చేకూర్చడం కోసమే చంద్రబాబు లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వినియోగం అంటూ ఆరోపణలు గుప్పించారంటూ విమర్శలు మొదలు పెట్టింది.  ఇందాపూర్ డైరీ తో కలిపి హెరిటేజ్ పై ఆరోపణలు మొదలుపెట్టింది. దీనిపై మండలిలో చర్చకు సిద్ధం అంటూ సవాల్ విసిరింది. ఆ సవాల్ ను స్వీకరించిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. చర్చ మండలిలో కాదు.. అసెంబ్లీలో చేద్దామంటూ అందుకు మంగళవారం (ఫిబ్రవరి 24)ముహూర్తం నిర్ణయించింది.  ప్రభుత్వం వ్యూహాత్మకంగా శాసనసభలో ఈ అంశాన్ని మంగళవారం (ఫిబ్రవరి 24) చర్చకు పెట్టింది. దమ్ముంటే సభకు వచ్చి చర్చలో పాల్గొనాలని వైసీపీకి సవాల్ కూడా విసిరింది.   వాస్తవానికి వైసీపీకి ఇదో బంగారంలాంటి అవకాశం. సభకు హాజరై కల్తీ నెయ్యి వినియోగం విషయంలో తమ పార్టీపై వస్తున్న ఆరోపణలను ఖండించడమే కాకుండా.. ఇందాపూర్ డైరీ, హెరిటేజ్ పై తాను చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపడానికి అంది వచ్చిన ఒక అవకాశం. అయితే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి వైసీపీ ముందుకు రావకపోవడంతో లడ్డూ ప్రసాదం తయారీలో వైసీపీ చేస్తున్న వాదనలకు, ఆరోపణలకు విశ్వసనీయత లేకుండా పోయింది.   ఇక అసెంబ్లీలో మంగళవారం (ఫిబ్రవరి 14) జరిగిన  చర్చలో చంద్రబాబు ప్రసంగం.. హైలైట్ గా మారింది. మొత్తంగా కల్తీ నెయ్యి అంశంలో తాను చేసిన ఆరోపణలు, అందుకు ఆధారమైన ఎన్డీడిబీ రిపోర్టు, మొత్తంగా  2022 నుంచి ఏం జరిగింది అనే దానిపై చంద్రబాబు ప్రసంగం సాగింది. ఇందుకు సంబంధించిన వివరాలు, ఆధారాలను సభ ముందుంచారు.  ఇక హెరిటేజ్ పై వైసీపీ ఆరోపణల డొల్ల తనాన్ని ఎండగట్టడమే కాకుండా.. భరతీ సిమోంట్స్ కోసం జగన్ నిబంధనలను ఎలా తుంగలో తొక్కారో కూడా కళ్లకు కట్టారు. హెరిటేజ్ తన కుటుంబ సంస్థ అని చెప్పిన చంద్రబాబు,  హెరిటేజ్ ఉత్పత్తులను ఎన్నడూ ప్రభుత్వ శాఖలు తీసుకోలేదని విస్పష్టంగా చెప్పారు. అందుకు భిన్నంగా జగన్ హయాంలో  భారతి సిమెంట్స్ ను ప్రభుత్వ నిర్మాణాల కోసం ఉపయోగించిన వైనాన్ని  ప్రస్తావించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళనకు పూనుకున్నామని.. అప్పుడే నెయ్యి కల్తీ వ్యవహారం బయటపడిందన్న చంద్రబాబు,  రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమిస్తే.. వైసీపీయే  సుప్రీంకోర్టుకు వెళ్లి సిబిఐ నేతృత్వంలోని సిట్ ను కోరిందని గుర్తు చేసిన చంద్రబాబు   ఆ సిట్ నెయ్యిలో కల్తీ జరిగిందని నివేదిక ఇచ్చిందనీ, చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిందనీ చెప్పారు. దీనిపైనే  ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై  ఏకసభ్య కమిషన్ నియమించామని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఆ ఏక సభ్య కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ  వైసీపీ సుబ్రహ్మణ్యస్వామితో పిటిషన్ వేయించిదన్న ఆయన ఆ పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసిందనీ,  తప్పులు చేయడం, విచారణను  అడ్డుకోవడాలని ప్రయత్నించడం వైసీపీకి అలవాటేనన్న ఆయన  ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయనీ, ఆ పార్టీ చేసిన తప్పిదాలే ఇప్పుడు వారికి శాపాలుగా మారాయనీ చంద్రబాబు చెప్పారు.  హెరిటేజ్ పై వైసీపీ తప్పుడు ఆరోపణలను సభ సాక్షిగా చంద్రబాబు ఎండగట్టారు. ఆత్మరక్షణ కోసమే వైసీపీ హెరిటేజ్ ను ఇందులోకి లాగిందన్న ఆయన, ఇండాపూర్ అనేది ప్రముఖ డైరీలకు కో మ్యానుఫ్యాక్చరింగ్ అందిస్తూ ఉంటుందని.. అందులో హెరిటేజ్ ఒకటని పేర్కొన్న చంద్రబాబు..   ఏ ప్రభుత్వ శాఖలో కూడా హెరిటేజ్ ఉత్పత్తులను వినియోగించుకున్న దాఖలాలు కుండబద్దలు కొట్టారు.  అదే సమయంలో తమ ఆరోపణలకు ఆధారాలు చూపుతూ వాదనలు వినిపించాల్సిన వైసీపీ సభ్యులు మాత్రం అసెంబ్లీకి గైర్హాజరయ్యారు. అటెండెన్స్ కోసం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున సభకు వచ్చి వెళ్లిన జగన్  అండ్ కో.. అత్యంత కీలక విషయంలో చర్చ జరుగుతున్న సమయంలో మాత్రం  సభకు డుమ్మా కొట్టి పలాయనం చిత్తగించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిశీలకులు సైతం సభకు వైసీపీ గైర్హాజర్.. కల్తీ నెయ్యి విషయంలో తప్పు ఒప్పుకున్నదన్న భావన కలిగించేలా ఉందని అంటున్నారు.  మొత్తం మీద కల్తీ నెయ్యి విషయంలో  చర్చ నుంచి పలాయనం చిత్తగించడంతో వైసీపీ వాదనలు విశ్వసనీయత కోల్పోయాయని రాజకీయవర్గాలు అంటున్నాయి. 
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రతినిథులకు ఏపీ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం (ఫిబ్రవరి 23) ఇచ్చిన ఆత్మీయ విందు నవ్వుల విందుగా, పరిచయాలు, పలకరింపుల మేళవింపులుగా మారింది. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, పరస్పరం కుటుంబ సభ్యులను పరిచయం చేసుకుంటూ ఆద్యంతం ఆహ్లాదంగా సాగింది.  ఆ ఆత్మీయ విందులో పాల్గొన్న వారెవరి మెబైల్ ఫోనూ ఒక్కసారి కూడా రింగ్ అవ్వలేదు. అంతెందుకు ఆ సమయంలో ఎవరూ ఫోన్ జోలికే పోలేదు. వాట్సాప్ చాటింగ్ ల ఊసే లేదు. కుటుంబాల ముచ్చట్లు, పెళ్లిళ్లు, పిల్లల చదువులు, కుటుంబాలా క్షేమ సమాచారాలు పంచుకోవడంతో అంతా ఆనందంగా ఆహ్లాదంగా గడిపారు. తమతమ ప్రాంతాల ప్రత్యేకతలను పంచుకున్నారు.   శ్రీకాకుళం వెటకారం, విజయనగరం చతురతతో సంభాషణలు రక్తి కట్టాయి. మంత్రి నారా లోకేష్ ఈ విందు సమావేశంలో  మంగళగిరి చేనేత ప్రమోషన్  చేస్తూ శ్రీకాకుళం ప్రజాప్రతినిథులు  పొందూరు ఖాదీతో బదులిచ్చారు. ఆత్మీయ వేదికకు హాజరైన ప్రజాప్రతినిథుల కుటుంబసభ్యులకు మంగళగిరి పట్టుచీరలు లోకేష్ బహుకరించారు.  ఈ ఆత్మీయ విందు సమావేశానికి శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి కింజరాపు రామమోహన నాయుడు, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు  ఎమ్మెల్యేలు  బెందాళం అశోక్, గౌతు శిరీష, మామిడి గోవిందరావు, గొండు శంకర్, కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, మంత్రి కొండపల్లి సాయి శ్రీనివాస్, కొండ్రు మురళీ మోహన్, బొబ్బిలి ఆర్ఎస్వీకేకే రంగారావు బేబీనాయన, కిమిడి కళా వెంకటరావు, పి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు, లోకం మాధవి, నడికుదిటి ఈశ్వరరావు కుటుంబసభ్యులతో హాజరయ్యారు.  
తమిళనాడు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పూర్తి కావడంతో   ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను సోమవారం (ఫిబ్రవరి 23)   విడుదల చేసింది. సవరించిన జాబితా కింద రాష్ట్రంలోని 74 లక్షల మంది ఓట్లను ఓటర్ల జాబితా నుంచి ఈసీ తొలగించింది. తుది జాబితాలో మొత్తం 5.67 కోట్ల మంది   బాజితాలో ఉన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు ముందు రాష్ట్రంలో 6.41 కోట్ల మంది రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారు. సోమవారం ఫిబ్రవరి 23)  చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమిళనాడు చీఫ్ ఎలక్షన్ అధికారి అర్చనా పట్నాయక్ ఈ జాబితాను విడుదల చేశారు. తాజా జాబితాలో 5.67 కోట్ల మంది ఓటర్లు నమోదు కాగా, వీరిలో 2.77 కోట్ల మంది పురుషులు, 2.89 కోట్ల మంది మహిళలు 7,617 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. క్లెయిమ్‌లు, అబ్జెక్షన్ పీరియడ్‌లో దాఖలు చేసిన దరఖాస్తులను సమీక్షించి మార్పులు చేసినట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది. 2025 డిసెంబర్ 19 నుంచి 2026 జనవరి 30 వరకూ ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించాల్సిందిగా 4.38 లక్షల అప్లికేషన్లు వచ్చాయని, వీటిలో 4.23 లక్షల ఎంట్రీలను వెరిఫికేషన్ అనంతరం తుది ఓటర్ల జాబితా నుంచి తొలగించామని పేర్కొంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదేజరగనున్న సంగతి తెలిసిందే. అలాగే కేరళ, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరి, అస్సాం ఎన్నికలు ఈ ఏడాదే జరుగుతాయి. 
ALSO ON TELUGUONE N E W S
  -మన శంకర వరప్రసాద్ చేసిన హంగామా కళ్ళ ముందే ఉంది -400 కోట్ల రూపాయిలు కూడా రాబట్టింది -ఓటిటి లోను రెస్పాన్స్ అదుర్స్  -మరి ఆ సీనియర్ రైటర్ చెప్తున్న లాజిక్ ఏంటి!  వింటే భారతం వినాలి.. తింటే గారేలే తినాలి అనే సామెత కాస్త మెగాస్టార్ మానియాతో  వింటే భారతం వినాలి.. చూస్తే మన శంకర వరప్రసాద్ గారు(Mana shankara Varaprasad Garu)చూడాలి అనే సామెతగా మారింది. ఆ విధంగా మారింది కాబట్టే మేకర్స్ కూడా అంచనా వేయని విధంగా 400 కోట్ల రూపాయలని మన శంకర వరప్రసాద్ కి తెలుగు ప్రేక్షకులు కట్టబెట్టారు. ఓన్లీ తెలుగు ప్రేక్షకులే సుమీ. ఆ 400 కోట్లలో ఇతర లాంగ్వేజెస్ వాళ్ళది రూపాయి కూడా లేదు.దీన్ని బట్టి పైన చెప్పుకున్న భారతం, గారెల సామెత నిజమే కదా! రీసెంట్ గా మన శంకర వరప్రసాద్ గారు గురించి లెజండ్రీ రైటర్ పరుచూరి గోపాల కృష్ణ గారు  కొన్ని విషయాలు చెప్పారు. దాంతో మన శంకర వరప్రసాద్ గారు ఘన విజయానికి గల కారణమేంటో అందరికి తెలిసొచ్చింది. మరి ఆ విషయాలేంటో చూద్దాం. పరుచూరి గోపాల కృష్ణ(Paruchuri Gopala krishna)మాట్లాడుతు అనిల్ రావిపూడి(Anil Ravipudi)మొదటి నుంచి ఎంటర్ టైన్మెంట్ మూవీ అని చెబుతూ వచ్చాడు. చిరంజీవిని పెట్టుకుని ఇలాంటి సినిమా చేస్తున్నారు ఏంటని కొంత మంది ఆశ్చర్యపోయి ఉండొచ్చు.ఫుల్ లెంత్ కామెడీ సినిమాలు రాజేంద్ర ప్రసాద్, నరేష్ లాంటి వాళ్ళు చేశారు. కానీ చిరంజీవి ఇమేజ్ కి అలాంటి సినిమాలు చేయడం సాహసమే. కానీ సినిమా స్టార్ట్ అయిన మొదటి పది నిమిషాల తర్వాత అసలైన చిరంజీవి బయటకు వచ్చాడు. అప్పుడు అర్ధమైంది ఇది కామెడీ సినిమా కాదు అని. నా దృష్టిలో మన శంకర వరప్రసాద్ గారు ఎంటర్ టైన్మెంట్  అండ్ యాక్షన్ సబ్జెట్.  ఓటీటీలో వచ్చే వరకు ఎదురుచూడకుండా ప్రేక్షకులంతా థియేటర్స్ కి వెళ్లి శంకర వర ప్రసాద్ ని కలిశారు. అందుకే 400 కోట్లు వచ్చాయి. భార్య భర్తలు విడిపోయిన కథ అంటే వాళ్లిద్దరూ మళ్ళీ కలుస్తారని ఆడియన్స్ కి ముందే తెలుస్తుంది. ఆ కలిసే విధానాన్నిఅనిల్ రావిపూడి చాలా బాగా ప్రెజెంట్ చేసాడు.వెంకటేష్ క్యారక్టర్ చాలా బాగా ఉపయోగపడింది. నయనతార(Nayanthara),సచిన్ ఖేడ్కర్ లపెర్ఫార్మ్ కూడా అదనపు బలం. సుస్మిత(Susmitha konidela)మొదటి సినిమాతోనే తండ్రిని మళ్ళీ సింహాసనంపై ఇంద్రసేనుడిలా కూర్చోబెట్టింది.  మా చిరంజీవి (Chiranjeevi)ఎప్పటికి మా చిరంజీవి అనిపించుకున్నారని పరుచూరి గోపాల కృష్ణ  చెప్పుకొచ్చారు. also read:  తిరుమల శ్రీవారి దర్శనంపై లిటిల్ హార్ట్స్ హీరోయిన్ కీలక వ్యాఖ్యలు  పరుచూరి గోపాల కృష్ణ, చిరంజీవి కాంబో ఎప్పటికప్పుడు బూజు పట్టి ఉన్న తెలుగు సినిమా రికార్డులన్నిటిని చెరిపేసి సరికొత్త రికార్డ్స్ ఫ్రేమ్ ని ఉంచింది. ఖైధీ  ఘరానా మొగుడు, ఇంద్ర, ఠాగూర్,శంకర్ దాదా ఏంబిబి ఎస్ వంటి చిత్రాలే ఉదాహరణ.      
    -లిటిల్ హార్ట్స్ తో యూత్ హార్ట్స్ లో స్టే చేస్తున్న శివాని  -ఇప్పుడు హే బలవంత్ తో థియేటర్స్ లో సందడి  -వేంకటేశ్వర స్వామి దర్శనంపై తను ఏం మాట్లాడింది -అసలు ఎందుకు మాట్లాడవలసి వస్తుంది శివాని నాగారం(Shivani Nagaram)..తెలుగు సినిమా సిల్వర్ స్క్రీన్ కి దొరికిన అచ్చ తెలుగు నటి. ఫస్ట్ మూవీ  అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ నుంచి రీసెంట్ గా వచ్చిన 'హే బల్‌వంత్' (Hey balwanth)వరకు శివాని ప్రదర్శించే పెర్ఫార్మ్ కి ఆమె అసలు పేరుని మర్చిపోయి సదరు సినిమాలోని క్యారక్టర్స్ పేరుతో పిలుస్తుంటాం. అంతలా తన సెటిల్డ్ పెర్ఫార్మ్ తో మెస్మరైజ్ చేస్తుంది. రీసెంట్ గా ఈ అమ్మడు కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి(Tirumala Tirupati Sri venkateswara Swami)విషయంలో తనపై వస్తున్న కొన్ని విమర్శలకి సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ విషయమేంటో చూద్దాం. శివాని నాగారం ఇటీవల హే బలవంత్ ప్రమోషన్స్ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'తిరుమలలో 15 నిమిషాల పాటు స్వామివారి దర్శనం కలిగిందనే విషయాన్నీ వెల్లడి చేసింది. శివాని అలా చెప్పిందో లేదో నిమిషాల్లోనే ఆ మాట వైరల్ గా మారడంతో పాటు సెలబ్రిటీలకు టీటీడీ పెద్దపీట వేస్తోందని నెటిజన్స్ విమర్శనాస్త్రాలు గుప్పిస్తు కామెంట్స్ చేయడం  స్టార్ట్ చేసారు. దీంతో విమర్శలు చేస్తున్న వాళ్ళకి దర్శనంపై తన పూర్తి ఆంతర్యం అర్ధం కావాలని శివాని తాజాగా ఒక వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చింది. ఆమె మాట్లాడుతు మా అమ్మ,నేను 10500 రూపాయిల శ్రీవాణి దర్శనం టికెట్లు తీసుకొని దర్శనానికి వెళ్ళాం. లైన్‌లో వెళ్తున్నపుడు స్వామి వారిని కొంచెం కొంచెం చూస్తూ వెళ్తుంటాం కదా. ఆ విధంగా కనిపించే మొత్తం సమయం కలిపి 15 నిమిషాలు అయ్యింది. దాంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎగ్జైట్మెంట్ తో అందరితో షేర్ చేసుకున్నాను. అంతేకానీ స్వామి ముందు గర్భాలయంలో నన్ను ఎవరు 15 నిమిషాల పాటు ఉంచలేదు. మీలో కూడా ఎవరైనా ఎప్పుడైనా సరే శ్రీవాణి దర్శనం టికెట్ తీసుకొని వెళ్తే కచ్చితంగా స్వామివారి దర్శనం చాలా మంచిగా జరుగుతుంది. మీరు కూడా నేను పొందిన అనుభూతినే పొందుతారని శివాని చెప్పుకొచ్చింది. శ్రీవాణి దర్శనం టికెట్ ని కూడా ఆమె చూపించడం విశేషం. Also read:Pawan kalyan: పవన్ కళ్యాణ్ హీరోయిన్ కి చేదు అనుభవం.. ఎవరి నుంచో తెలిస్తే షాక్ అవుతారు  దీంతో విమర్శలు చేసే వాళ్ళు శివాని ఇచ్చిన క్లారిటీ పై సంతృప్తి చెందటం ఖాయం.    ప్రస్తుతం తన నుంచి కొత్త చిత్రం ప్రకటన రాకపోయినా పలు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్టుగా తెలుస్తుంది.  
నందమూరి అభిమానులకు శుభవార్త! మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఖరారు! నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. నిజానికి 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అనౌన్స్ మెంట్ వచ్చింది. కానీ, ఏవో కారణాలతో అది పట్టాలెక్కలేదు. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు? డైరెక్టర్ ఎవరు? అంటూ అప్పటినుంచి చర్చ జరుగుతూనే ఉంది. త్వరలోనే దీనికి ఫుల్ స్టాప్ పడనుంది. (Nandamuri Mokshagna) క్లాసిక్ ఫిల్మ్ 'ఆదిత్య 369'కి సీక్వెల్ గా 'ఆదిత్య 999'ను బాలకృష్ణ తలపెట్టిన సంగతి తెలిసిందే. స్వయంగా బాలయ్యే కథ రాసుకోవడం విశేషం. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తారని, ఈ క్రేజీ ప్రాజెక్ట్ తోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఆ మధ్య వార్తలు వినిపించాయి. కానీ, కొంతకాలంగా మళ్ళీ ఎటువంటి చప్పుడు లేదు. అయితే త్వరలోనే సాలిడ్ అప్డేట్ రాబోతున్నట్లు తెలుస్తోంది. (Aditya 999) బాలకృష్ణ ఇచ్చిన స్టోరీ లైన్ ని తీసుకొని క్రిష్ తన టీమ్ తో కలిసి ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్ ని సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందట. ఉగాది కానుకగా మార్చిలో అధికారికంగా ప్రకటించి, త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారట. కాగా, 'ఆదిత్య 999'లో మోక్షజ్ఞ హీరోగా నటించనుండగా, బాలకృష్ణ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారని వినికిడి. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అలాంటిది మొదటి సినిమాలోనే తండ్రితో కలిసి నటిస్తుండటం ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్ అని చెప్పవచ్చు. Also Read: 15 ఏళ్ళ ప్రేమ కావాలి.. ఇలాంటి డ్రీమ్ డెబ్యూకి అదృష్టం ఉండాలి!
    -ఎగిరే చిలకమ్మ గా పవన్ ఫ్యాన్స్ లో ప్రత్యేక గుర్తింపు  -నిన్న కార్ బుక్ చేసుకుంది  -ఆ తర్వాతనే అసలు విషయం తెలిసింది -ఆలా చెయ్యడం తప్పు కదా!  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)తో ఒక్క సినిమా చేసినా చాలు సదరు హీరోయిన్ ఛాయలు అంత త్వరగా  తెలుగు ప్రేక్షకుల ఆలోచనల నుంచి వెళ్లవు. మరి స్వయంగా పవన్ కళ్యాణ్ నే ఆ హీరోయిన్ ని ఉద్దేశించి 'ఎగిరే చిలకమ్మా నా ముద్దుల మొలకమ్మ' అని అంటూ పాడితే, ఇక ఆ హీరోయిన్ ని మరవడం కొంచం కష్టమే కదా! అలాంటి ఒక హీరోయిన్ మీరాచోప్రా.. బంగారం(Bangaram)సినిమాలో పవన్ తో  కలిసి చేసింది. నిన్న ఉదయం మీరాచోప్రా(Meerra Chopra)బయటకి వెళ్ళడానికి ఉబర్ నుంచి క్యాబ్ బుక్ చేసుకుంది. ఆరు గంటల పాటు తనతో ఉండాలనేది డీల్. కాసేపటికి కారు వచ్చింది. కానీ కారు నిండా దుమ్ము.డ్రైవర్ కూడా  డర్టీ గా ఉన్నాడు.కారు ఎందుకు  దుమ్ముగా ఉందని అడిగితే  స మాధానం లేదు. కారు నడుతూనే నిద్రపోతున్నాడు. దాంతో ఆమె ఇరవై నిమిషాల్లోనే కారు దిగి వేరే క్యాబ్ బుక్ చేసుకుంది. కానీ ఆరు గంటల సమయానికి ఛార్జి వసూలు చేసాడు. జరిగిన ఈ విషయం మొత్తాన్ని సోషల్ మీడియా ద్వారా మీరా చోప్రా నే వెల్లడి చేసింది. కస్టమర్స్ భద్రతని గాలికొదిలేసి డబ్బు సంపాదించడం మాత్రమే వారి పని అని తన ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసింది.  Also read :Varanasi:వారణాసి కోసం ఎదురుచూస్తున్నారా! ఐతే ది బ్లఫ్ మూవీ చూడండి మీరాచోప్రా బంగారం తో పాటు వాన, గ్రీకు వీరుడు వంటి చిత్రాల్లో  చేసింది.బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు కొన్ని వెబ్ సిరీస్ లోను చేసింది.  కానీ స్టార్ డమ్ విషయంలో పెద్దగా క్లిక్ అవ్వలేదు.         
హీరోగా 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఆది సాయికుమార్ 'ప్రేమ కావాలి'తో డ్రీమ్ డెబ్యూ దర్శకుడు విజయ భాస్కర్ కీ స్పెషల్ మూవీ ఒక మంచి హిట్ ఫిల్మ్ తో హీరోగా ఎంట్రీ ఇవ్వాలని చాలామంది కలలు కంటుంటారు. అలాంటి డ్రీమ్ డెబ్యూ సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ కి లభించింది. అదే 'ప్రేమ కావాలి'. ఈ సినిమా విడుదలై నేటితో 15 వసంతాలు పూర్తయింది. (Prema Kavali) ఆది, ఇషా చావ్లా జంటగా ప్రముఖ దర్శకుడు కె. విజయ భాస్కర్ రూపొందించిన చిత్రం 'ప్రేమ కావాలి'. ఆదితో పాటు ఇషా చావ్లాకు కూడా ఇది తొలి చిత్రం కావడం విశేషం. మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె. అచ్చిరెడ్డి నిర్మించిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఫిల్మ్.. 2011 ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ప్రేమ కథకు టెర్రరిస్ట్ నేపథ్యాన్ని జోడిస్తూ 'ప్రేమ కావాలి' సినిమాని మలిచిన తీరు ఆకట్టుకుంది. లవ్ సీన్స్, కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. పలు సెంటర్లలో వంద రోజులు ఆడిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.14 కోట్ల షేర్ రాబట్టి ఘన విజయం సాధించింది. 'ప్రేమ కావాలి' విజయంలో అనూప్ రూబెన్స్ సంగీతం కూడా కీలక పాత్ర పోషించింది. 'చిరునవ్వే విసిరావే', 'మనసంతా ముక్కలు చేసి', 'నువ్వే నువ్వే' వంటి పాటలు ఆ సమయంలో మారుమోగిపోయాయి. తొలి సినిమా అయినా తనదైన నటన, డ్యాన్స్ లతో ఆది మెప్పించాడు. బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్, సైమా అవార్డులు అందుకున్నాడు.  దర్శకుడు విజయ భాస్కర్ కి కూడా ఇది స్పెషల్ ఫిల్మ్. దర్శకుడిగా నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన విజయ భాస్కర్.. ఏడేళ్ళ తరువాత అందుకున్న విజయమిది. Also Read: చికిరి vs ఆయా షేర్.. ప్యారడైజ్ సౌండ్ మామూలుగా లేదు!
    -పాన్ వరల్డ్ అభిమానుల మనస్సులో వారణాసి  -శరవేగంగా చిత్రీకరణ  -ఓటిటి లోకి వచ్చేసిన ది బ్లఫ్  ఎందుకు చూడాలి  మహేష్(Mahesh Babu),రాజమౌళి(SS Rajamouli)ల ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ 'వారణాసి'(Varanasi)గురించి తెలుసుకుంటూ ఉండటం ఇప్పుడు పాన్ వరల్డ్ సినీ అభిమానుల నిత్యదిన చర్యలలో భాగమైంది. అంతలా వారణాసి తో కనెక్ట్ అవుతు వస్తున్నారు. దీంతో సినిమాకి ఉన్న శక్తి ఏ పాటిదో తెలియచేసిన కీర్తిని కూడా వారణాసి పొందుతుంది. అంతే కాకుండా మందాకినీ వల్ల ఏ రోజుకైనా ప్రపంచాన్ని ఏకం చేసే శక్తీ సినిమాకి మాత్రమే ఉందనే మాట కూడా నిజమవుతుందనే వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వినపడుతున్నాయి. మరి అసలు మ్యాటర్ ఏంటో చూద్దాం. ది బ్లఫ్(The Bluf).. ప్రియాంక చోప్రా(Priyanka chopra)హాలీవుడ్ లో చేసిన మూవీ. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కగా  'యెర్సెల్ బోర్డెన్' అనే క్యారక్టర్ లో ప్రియాంక చోప్రా చేసింది. తనదే మెయిన్ క్యారక్టర్ కూడా. యాక్షన్ సన్నివేశాలలో అయితే ఒక రేంజ్ పెర్ఫార్మ్ ప్రదర్శించింది. ది బాయ్స్ మూవీ ఫేమ్ 'కార్ల్ అర్బన్(Karl Urban)మేల్ లీడ్ కాగా  ఫ్రాంక్ ఈ ఫ్లవర్స్(Frank E Flowers)దర్శకుడు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ సాలిడ్ యాక్షన్ చిత్రం అమెజాన్ ప్రైమ్(Amazon Prime)వీడియోలో ఈ రోజు  మధ్యాహ్నం నుంచి అందుబాటులో ఉండనుంది. ఒరిజినల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ తో పాటు  తెలుగు డబ్బింగ్ సహా మొత్తం 19 భాషల్లో స్ట్రీమింగ్ కి రెడీ. Also read: Poona Kaur:  కాపు వారసత్వాన్ని క్రైస్తవ మతంలోకి మార్చారు దీంతో వారణాసి హోదాలో 'ది బ్లఫ్' ని చూసే సౌత్ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు. హాలీవుడ్ తో పాటు  హిందీ లో అయితే చెప్పక్కర్లేదు.ఇప్పుడు ఆల్రెడీ ఆ పని లోనే ఉంటారు. మరి ఈ లెక్కన వారణాసి కి హాలీవుడ్,బాలీవుడ్  లో ఎంత ఉపయోగం ఉంటుందో వివరంగా చెప్పక్కర్లేదనుకుంట అనే కామెంట్స్ నెట్టింట వినపడుతున్నాయి.      
'చికిరి' బాటలో 'ఆయా షేర్' సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'ప్యారడైజ్' సాంగ్ ఆడియన్స్ నుంచి పొలిటీషియన్స్ వరకు అందరూ ఫిదా సినిమా ప్రమోషన్స్ లో సాంగ్స్ కీలక పాత్ర పోషిస్తుంటాయి. ఆడియో పరంగా, విజువల్ పరంగా సాంగ్ హిట్ అయిందంటే.. సినిమాకి బోలెడంత మైలేజ్ వస్తుంది. ఇటీవల 'పెద్ది'(Peddi) విషయంలో అది జరిగింది. తాజాగా ఆ లిస్టులో 'ది ప్యారడైజ్'(The Paradise) చేరింది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ 'పెద్ది'. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న 'పెద్ది' నుంచి ఫస్ట్ సింగిల్ గా 'చికిరి చికిరి' విడుదలై చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఆడియో పరంగా హిట్ అవ్వడమే కాకుండా, అందులో హుక్ స్టెప్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. అప్డేట్స్ వచ్చినా రాకపోయినా కొద్దినెలలుగా సోషల్ మీడియాలో 'పెద్ది' గురించి తెగ చర్చ జరుగుతుంది అంటే దానికి ప్రధాన కారణం 'చికిరి చికిరి' సాంగ్ అనడంలో డౌట్ లేదు. ఇప్పుడు 'ఆయా షేర్' రూపంలో 'ప్యారడైజ్' టైం స్టార్ట్ అయింది. (Aaya Sher) 'దసరా' తరువాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న ఫిల్మ్ 'ది ప్యారడైజ్'. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ 'ఆయా షేర్' విడుదలైంది. 'ప్యారడైజ్'లో జడల్ అనే పాత్రలో నెవర్ బిఫోర్ లుక్ లో నాని కనిపిస్తున్నాడు. ఆ జడల్ పాత్రను ఎలివేట్ చేస్తూ 'ఆయా షేర్' సాంగ్ సాగింది. అనిరుధ్ మ్యూజిక్ పవర్ ఫుల్ గా ఉంది. విజువల్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. ముఖ్యంగా హుక్ స్టెప్స్ అదిరిపోయాయి. సిగరెట్ వెలిగిస్తూ వేసే స్టెప్, జడ పట్టుకొని వేసే స్టెప్ హైలైట్ గా నిలిచాయి. 'ఆయా షేర్' సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యూట్యూబ్ ట్రెండింగ్ లో నెం.1 ప్లేస్ లో ఉంది. ఈ సాంగ్స్ తో ప్రముఖ రాజకీయ నాయకుల ఎడిట్స్ కూడా సోషల్ దర్శనమిస్తున్నాయి. కేసీఆర్ ఎడిట్ ని కేటీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేయడం విశేషం. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఎడిట్స్ కూడా తెగ వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో అందరి నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ని అందుకుంటూ, తక్కువ టైంలోనే ఇంత రీచ్ పొందిన పాటలు చాలా తక్కువ ఉన్నాయి. 'ఆయా షేర్'కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. ప్యారడైజ్ కి బోలెడంత మైలేజ్ వచ్చినట్టే అని చెప్పవచ్చు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 21న రిలీజ్ కానుంది. Also Read: 'అతడు' సెకండ్ రీ రిలీజ్ బుకింగ్స్.. మహేష్ బాబు మాస్ ర్యాంపేజ్!  
-వైరల్ గా మారిన పూనమ్ కౌర్ ట్వీట్  -తన ట్వీట్ లో ఏముంది  -క్రైస్తవంలోకి మారిన కాపు కమ్యూనిటీ వారసత్వం ఎవరు  -అర్ధం కానీ ఎన్నో ప్రశ్నలు    పూనమ్ కౌర్(Poonam kaur)..సినీ నటిగా కంటే సోషల్ మీడియాని రఫ్ఫాడించడం ద్వారా ఎక్కువ  ఫాలోయింగ్ ని సంపాదించిందని చెప్పుకోవడంలో ఎలాంటి దాపరికం లేదు. బహిరంగ రహస్యమే. ఆ విషయం పూనమ్ కౌర్ కి కూడా తెలుసు. ఆమె చేసే ట్వీట్ లకి అయితే  భారీ అభిమాన గణం ఉంది. అసలు ఉదయాన్నే ఆమె ఎక్స్ అకౌంట్ ని చెక్ చేసే పనినే జాబ్ గా మలచుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎవర్ని ఉద్దేశించి చేస్తుందో  చెప్పకపోయినా ఆ వ్యక్తి ఎవరో మాకు తెలుసనీ  సంబరపడిపోతుంటారు. దీన్ని బట్టి పూనమ్ ట్వీట్స్ కి ఉన్న రేంజ్ ని అర్ధం చేసుకోవచ్చు. లేటెస్ట్ గా 'అంతకి మించి' అనే రీతిలో  సంచలన ట్వీట్ చేసింది. ట్వీట్ లో ఏముందో చూద్దాం. also read: ఆ సినిమాకి  మాత్రం నో.. వెంకటేష్ నిర్ణయంలో న్యాయముందా!   కొంతమంది హిందూ మతాన్ని కేవలం దుస్తులలో మాత్రమే అనుసరిస్తారు. ఆ లబ్ధిదారులు తమ పిల్లలకి  మూడు నెలల వయసు ఉన్నప్పుడే క్యాథలిక్ చర్చిలో బాప్టిజం ఇప్పించడం జరిగింది. మేమెప్పుడూ మా వారసత్వాన్ని మార్చుకోలేదు. కాపు కమ్యూనిటీ యొక్క గొప్ప పాత వారసత్వం ఆర్థడాక్స్ కాథలిక్ క్రైస్తవ మతంగా మార్పించడంలో రాయబారిగా వ్యవహరిస్తున్నారు. యూపీలో దీన్ని లవ్ జిహాద్ అంటారు. ఏపీలో ఇది సెలెక్టివ్ గా మారుతుందని ట్వీట్ చేసింది. పూనమ్ గతంలో కొన్ని సంచలన ట్వీట్స్ చేసి ఆ వెంటనే డిలీట్ చేయడంతో, ప్రెజెంట్ ట్వీట్స్ ని స్క్రీన్ షాట్స్ గా  తీసుకొని కొంత మంది నెట్టింట షేర్ చేస్తున్నారు.                        https://x.com/poonamkaurlal/status/2026318259293958165?s=20            
భారతీయ సినిమా పుట్టిన నాటి నుంచి ఎంతో మంది నటీమణులు చిత్ర పరిశ్రమకు వచ్చారు. తమ అందచందాలతో, అభినయంతో ప్రేక్షకుల్ని కట్టి పడేశారు. అయితే ఒక్కో హీరోయిన్‌కి ఒక్కో ప్రత్యేకత ఉండేది. అలా భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్న అతిలోక సుందరి శ్రీదేవి. ఏ హీరోయిన్‌కీ లభించని ఆద‌ర‌ణ‌ ఆమె సొంతం. దాదాపు 50 సంవత్సరాల పాటు తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 300కి పైగా సినిమాలో నటించి ఎవరూ అందుకోలేని రికార్డును సొంతం చేసుకున్నారు. ఏ భాషలో తీసుకున్నా.. ఆమెతో నటించని హీరో లేరంటే అతిశయోక్తి కాదు. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జునల సరసన హీరోయిన్‌గా నటించారు. తండ్రీ కొడుకులతో నటించిన అరుదైన ఘనత ఆమెది. సాధారణ ప్రేక్షకులే కాదు, చిత్ర రంగంలో ఉన్న ఎంతో మందికి శ్రీదేవి ఆరాధ్య దేవత. ఆ తర్వాత వచ్చిన ఎంతో మంది హీరోయిన్లకు ఆమె ఇన్‌స్పిరేషన్‌గా నిలిచారు. భౌతికంగా ఆమె మన మధ్య లేనప్పటికీ లెక్కకు మించి ఆమె చేసిన సినిమాలను ఇప్పటికీ ప్రేక్షకులు చూస్తూ మ‌న‌నం చేసుకుంటున్నారు. ఫిబ్రవరి 24 శ్రీదేవి వర్థంతి. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెను స్మరించుకుంటున్నారు. శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌కి తల్లి అంటే ఎంతో ఇష్టం. కుమార్తెను తనంతటి హీరోయిన్‌ని చెయ్యాలని శ్రీదేవి కలలు కనేవారు. ఆ దిశగానే ఆమెను అన్ని విధాలుగా సిద్ధం చేశారు. ఇప్ప్పుడు జాన్వీ హీరోయిన్‌గా పలు భాషల్లో సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అయితే అవేవీ చూడకుండానే శ్రీదేవి అందరికీ దూరమయ్యారు.  తన తల్లి వర్థంతి సందర్భంగా సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు జాన్వీ. చిన్నతనంలో తల్లితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ ‘అమ్మా.. నిన్ను తలుచుకోకుండా ఒక్క రోజు కూడా గడవదు. నీ గొంతు, నీ కౌగిలి, నీ ధైర్యం.. ఇవే నన్ను ప్రతి రోజూ నడిపిస్తున్నాయి. ఎక్కడున్నా సరే, నువ్వు గర్వపడేలా చేస్తానని భావిస్తున్నాను. మాటల్లో చెప్పలేనంతగా నిన్ను మిస్ అవుతున్నాను. ఎప్పటికీ నీ చిన్న పాపనే’ అంటూ జాన్వీ కపూర్ పెట్టిన ఎమోషనల్ పోస్ట్ అందర్నీ కదిలించింది. ఆమె పోస్ట్‌కు నెటిజన్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.
  -వరుస హిట్స్ తో జోరుమీద ఉన్న వెంకటేష్  -త్రివిక్రమ్ మూవీ పై భారీ అంచనాలు  -కానీ ఆ చిత్రాన్ని ఎందుకు వద్దని అంటున్నాడు -అందుకు కారణాలేంటి  -రూమరా, నిజామా!   'ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్' అనే రీతిలో విక్టరీ వెంకటేష్(Venkatesh)సృషించుకున్న సినీ సామ్రాజ్యంకి పెద్ద హిస్టరీ నే ఉంది. రీసెంట్ గా చిరంజీవి(Chiranjeevi)తో కలిసి మన శంకర వరప్రసాద్ గారులో చేయడం ద్వారా సదరు సినిమా రేంజ్ ని మరింత పెంచాడు. ఎంతలా అంటే తెలుగు సినిమా రికార్డుల బుక్ లో స్థానాన్ని పొందేలా. దీంతో త్రివిక్రమ్(trivikram)తో చేస్తున్న ఆదర్శకుటుంబం హౌస్ నెంబర్ 47 పై  అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. అభిమానులు, మూవీ లవర్స్ ఈ చిత్రానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తుంటే, వెంకటేష్ సినీ జర్నీకే సంబంధించిన మరో న్యూస్ ఆ అందరి కంట పడింది. కాకపోతే రూమర్ హోదాలో. రూమర్ అయినా విక్టరీ ది కాబట్టి చూసేద్దాం. వెంకటేష్, మీనా జంటగా  వచ్చినక్రైమ్ థ్రిల్లర్ దృశ్యం రెండు భాగాలుగా వచ్చి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. వెంకటేష్ తన అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ తో  రీమేక్ అనే ఛాయల్ని తెలుగు ప్రేక్షకుల దరిదాపుల్లోకి కూడా తీసుకురాలేదు.దీంతో మూడవ భాగానికి సంబంధించిన అధికార ప్రకటన కోసం అందరు ఎదురుచూస్తున్నారు. ఆల్రెడీ మూడవ భాగం షూటింగ్ మలయాళంలో కంప్లీట్ కాబోతుండటమే అందుకు కారణం. ఏప్రిల్ 2 రిలీజ్ డేట్ అనే అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. కానీ  దృశ్యం 3(Drishyam 3)రీమేక్ లో నటించకూడదని వెంకటేశ్ నిర్ణయించుకున్నట్టుగా ఫిలిం సర్కిల్స్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి. అందుకు గల కారణాలు కూడా రూమర్స్ నే వివరిస్తున్నాయి. ప్రస్తుతం వెంకటేశ్ 'ఆదర్శకుటుంబం'లో చేస్తున్నాడు.ఆ తర్వాత అనిల్ రావిపూడి తో ఉందనేది టాక్. అంటే ఆ రెండు చిత్రాలు అయ్యాకే 'దృశ్యం 3 చేయాల్సి వస్తుంది.  also read:  నటుడు మయాంక్ పవార్ ఆకస్మిక మరణం.. అబద్దమని చెప్పమంటున్న ఫ్యాన్స్  మరి అప్పటికే ఒరిజినల్ మళయాళ వెర్షన్  ఓటీటీలో వచ్చి ఉంటుంది. సదరు ఓటిటి సంస్థలు పాన్ ఇండియాలోని అన్ని లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నారు.వెంకటేష్ రీమేక్ చేయాలంటే నెక్స్ట్ ఇయర్ లోనే కుదురుతుంది. ఒక వేళ ఇప్పటికిప్పుడు చేసినా ఒరిజినల్ వెర్షన్ ఓటిటి మాత్రం ఆగదు. అజయ్ దేవగన్ తో హిందీ రీమేక్ కూడా కంప్లీట్ కావలసి వస్తుంది. దీంతో తను చేసే టైంకి రీమేక్ ని  ఎవరు చూస్తారనే అభిప్రాయంలో  వెంకటేష్ ఉన్నట్టుగా ఫిలిం సర్కిల్స్ రూమర్స్.     
నేటి కాలంలో ప్రజల ఉద్దేశాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. బయటకు ఒకటి చెబుతారు, కానీ తరువాత వారు చేసేది మరొకటి ఉంటుంది. దీని వలన ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడం కష్టమవుతుంది.  కొందరు ఇలాంటి సందిగ్ధంలో ఎవరినీ నమ్మకుండా ఒంటరిగా ఉండిపోతారు, మరికొందరు  అందరూ మంచోళ్లే అనే అబిప్రాయంతో ఏదో ఒక రోజు ఇతరుల స్వార్థానికి బలి అయిపోతారు. కానీ ఎవరినీ నమ్మకుండా ఉంటే ఏదో ఒకరోజు తమ మీద తాము నమ్మకం కోల్పోయే పరిస్థితికి చేరుకుంటారు.  అలాగని అందరినీ గుడ్డిగా కూడా నమ్మకూడదు. దీనికి పరిష్కారమే ఆచార్య చాణక్యుడు చెప్పిన మార్గం.  మనిషిలో ఉండే కొన్ని లక్షణాల ఆధారంగా ఆ మనిషి వ్యక్తిత్వాన్ని నిర్ణయించవచ్చట.  ఇంతకూ ఆ లక్షణాలు ఏంటో తెలుసుకుంటే.. స్వార్థం.. ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడానికి మంచి  సమయం ఏదంటే.. వారు స్వార్థపరులుగా ఉన్న సమయమే.. ప్రతిఫలం కోసం, ప్రశంసల కోసం ఆశించకుండా,   వ్యక్తిగత లాభం లేని సమయాల్లో,  సందర్భాలలో వ్యక్తి నిజమైన స్వభావం బయటపడుతుంది. సంకోచం లేకుండా తమ బాధ్యతలను నెరవేర్చేవారు, నష్టాన్ని ఎదుర్కొన్నప్పుడు కూడా నిజాయితీగా ఉండేవారు, వారి నిజమైన ఉద్దేశాలను బయటపెడతారు. ఒకరి మంచితనం లాభానికి మాత్రమే పరిమితం అయితే, అదే వారి నిజమైన స్వభావం. ఇది వారి స్వార్థం అవుతుంది.  అలాంటి వ్యక్తులు స్వార్థపరులు. బాధ్యత..  వాయిదా వేయడం అనేది చాలామందిలో కనిపించే గుణం.  మరీ ముఖ్యంగా ఎదుటివారికి ఏదైనా మాట ఇచ్చి, తప్పడం అనేది బాధ్యతను విస్మరించడం అవుతుంది. స్పష్టమైన సమాధానాలు ఇవ్వకపోవడం లేదా  సరైన సమాధానాలు చెప్పకుండా ఉండేందుకు కావాలని గొడవలు క్రియేట్ చేయడం అనేది వారి మనసులో వేరే ఉద్దేశ్యం ఉందని సూచిస్తుంది.  చాలామంది  సహజంగానే వారి ప్రణాళికలు లేదా సౌలభ్యానికి  వ్యతిరేకంగా ఏదైనా ఉంటే దాన్నుండి తప్పించుకోవడానికి లేదా వాటిని దూరం పెట్టడానికి ప్రయత్నిస్తారు.  పదే పదే వాయిదా వేయడం లేదా మాట తప్పడం అనేది  బలహీనతకు సంకేతం అని కొందరు అనుకుంటారు. కానీ నిజానికి బలహీనత కంటే వారి ఉద్దేశ్యమే వేరు అని అర్థం.  ఎందుకంటే వారు తమ పనుల్లో ఇలాంటి అలసత్వం అస్సలు చూపించరు. ఒత్తిడి, బాధ.. ఒత్తిడి,  బాధ కూడా వ్యక్తి  నిజమైన స్వభావాన్ని వెల్లడిస్తాయి. ఒత్తిడి ఒక వ్యక్తిని మార్చదు, కానీ అది వారిలో అంతర్గతంగా దాగి ఉన్న స్వభావాన్ని వెల్లడిస్తుంది. పరిస్థితులు చాలా ఛాలెంజింగ్ గా  ఉన్నప్పుడు ఒక వ్యక్తి నిజాయితీగా ఉంటాడా లేదా చాకచక్యంగా ఉంటాడా, ప్రశాంతంగా ఉంటాడా లేదా దూకుడుగా ఉంటాడా అని గమనిస్తే..  ఆ సమయంలో వారి స్వభావం,  వారి ప్రవర్తనను బట్టి వారి వ్యక్తిత్వం బయటకు తెలుస్తుంది. విధేయత.. ప్రజల పొగడ్తల కంటే కూడా ఒక వ్యక్తి వ్యక్తిగతంగా ఎవరిని గౌరవిస్తాడనేది చాలా ముఖ్యం. ఎవరి అభిప్రాయాలకు విలువ ఇస్తారు,  ఎవరి సరిహద్దులను వారు సహజంగా గౌరవిస్తారు అనే విషయాల మీదే  వారి ప్రాధాన్యతలు  ఉంటాయి. ఒక సంఘటన ఆధారంగా ఎవరి గురించి జడ్డ్  చేయకూడదు. నిజమైన ఉద్దేశాలు కాలక్రమేణా పదే పదే రిపీట్ గా జరిగే పనులలో బయటకు తెలుస్తాయి.  ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంటే అదే వారి నిజాయితీకి బలమైన సాక్ష్యం  అవుతుంది.                                              *రూపశ్రీ
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు. కానీ చాలామంది చేసే మిస్టేక్.. సైడ్ ఇన్కమ్ కోసం ప్రయత్నించకపోవడం. ఉద్యోగం చేస్తూనే ఎక్స్టాగా ఇన్కమ్ సంపాదించడం వల్ల ఆర్థికంగా ఎంతో వృద్ధి చెందవచ్చు.  దీనికోసం మంచి మార్గాలు,  ఎక్ట్సా ఇన్కమ్ సంపాదించాలనుకునే వారు చేయకూడని తప్పులు తెలుసుకుంటే.. ఫ్రీలాన్సింగ్..  రైటింగ్, డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, డిజిటల్ మార్కెటింగ్ లేదా కోడింగ్ వంటి స్కిల్స్  ఉంటే  ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు చేయవచ్చు. ఇది  మంచి ఆదాయాన్ని ఇస్తుంది. ఫ్రీలాన్సర్,  ఫైవర్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో క్లయింట్ లు ఉంటారు. వారానికి 10–12 గంటలు కేటాయించడం ద్వారా, ₹10,000 నుండి ₹25,000 వరకు సంపాదించవచ్చు. బ్లాగింగ్, కంటెంట్ క్రియేషన్.. రాయడం పట్ల మంచి అభిరుచి ఉంటే  బ్లాగింగ్, యూట్యూబ్ లేదా ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్‌ను క్రియేట్ చేయవచ్చు. సబ్స్క్రైబర్స్,  వ్యూస్ బాగా వచ్చిన తరువాత  యాడ్స్ , స్పాన్సర్‌షిప్‌లు కూడా వస్తాయి. వీటి ద్వారా అదనపు ఆదాయం కూడా ఉంటుంది. అయితే దీనికి మంచి కంటెంట్, క్లిక్ అయ్యేవరకు సమయం అవసరం అవుతాయి. ఆదాయం వెంటనే ఉండదు. కాస్త ఓపిక అవసరం. ఆన్లైన్ ట్యూటరింగ్.. కోర్సెస్.. ఏదైనా ఒక  సబ్జెక్టులో బాగా గ్రిప్ ఉంటే అలాంటి వారు  ఆన్‌లైన్ క్లాసెస్ చెప్పవచ్చు.  లేదా డిజిటల్ కోర్సులను క్రియేట్ చేసి  కూడా టీచింగ్ చేయవచ్చు. YouTube, Unacademy వంటి ప్లాట్‌ఫామ్‌లలో చేరవచ్చు.  లేదా Google Meetలో స్వయంగా  క్లాసెస్ చెప్పవచ్చు. ఇది   విద్యార్థులకు,  టీచింగ్ చేసేవారికి కూడా  చాలా బాగుంటుంది. ఈ-బుక్స్.. రాయడం పట్ల మంచి అబిరుచి ఉంటే ఈ-బుక్స్  రాసి కిండిల్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో అమ్మడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఇంటి నుండి వ్యాపారాన్ని ప్రారంభించడానికి రీసెల్లింగ్ లేదా ఈ-కామర్స్ కూడా ఒక గొప్ప మార్గం. ఈ కామర్స్-రీసెల్లింగ్.. అమెజాన్,  ఫ్లిప్‌కార్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఉత్పత్తులను అమ్మడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.  ఇంటి నుండి చిన్నగా ప్రారంభించవచ్చు. దుస్తులు, హస్తకళలు లేదా గృహోపకరణాలను అమ్మవచ్చు. ఇది క్రమంగా లాభదాయకమైన వ్యాపారంగా మారవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్.. సైడ్ ఇన్‌కమ్ అంటే కేవలం పని చేయడం ద్వారా సంపాదించేది మాత్రమే కాదు, డబ్బు సంపాదించడం గురించి. మ్యూచువల్ ఫండ్ SIPలు, స్టాక్ మార్కెట్, బాండ్లు లేదా డిజిటల్ గోల్డ్‌లో  వంటి వాటిలో క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల క్రమంగా అదనపు నిధులు వస్తాయి. సరైన సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల దీర్ఘకాలికంగా మంచి ఆదాయం సృష్టించవచ్చు. ఈ తప్పులు చేయకండి.. సైడ్ ఇన్‌కమ్‌ను మొదలుపెట్టే ముందు  త్వరగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో  తరచుగా తప్పులు చేస్తాము. ఆ తప్పులేంటంటే.. తొందరపాటు చాలామందికి ఉంటుంది.  సైడ్ ఇన్కమ్ కావాలనే తొందరలో తప్పటడుగు వేయకూడదు. సైడ్ ఇన్కమ్ మీద ఆశతో ఎలాంటి పరిశోధనలు చేయకుండా లేదా డబ్బులు పెట్టుబడి పెట్టడం లేదా డబ్బు సరిగా చెల్లించని చోట వర్క్ చేయడానికి ఒప్పుకోవడం వంటివి చేయకూడదు. సైడ్ ఇన్కమ్ మోజులో పడిచాలామంది  ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎక్కువ లాభం వస్తుందని ఇచ్చే ప్రకటనలు చూసి మోసపోయి డబ్బులు పెట్టకూడదు. కేవలం అదనంగా చేసే పని ద్వారా సైడ్ ఇన్కమ్ ఉండేలా చూసుకోవాలి. అంతేకానీ డబ్బు కోసం ఎక్కువ ఒత్తిడి తీసుకుని పని చేయకూడదు. సైడ్ ఇన్కమ్ అయిన, ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం అయినా కుటుంబం కోసమే.. కానీ పని కోసం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. గొప్పలు చెప్పుకోవడానికి  సైడ్ ఇన్కమ్ సంపాదించడం మంచిది కాదు. భవిష్యత్ కోసం పొదువు చేయడానికి  సైడ్ ఇన్కమ్ సంపాదించాలి.                               *రూపశ్రీ.
కొత్త వస్తువులు కొంటేనే చాలామంది చాలా సంతోషంగా ఉంటారు.  ఇక మహిళలు అయితే వంటింటి వస్తువుల నుండి వారు కొనుగోలు చేసే వస్తువు పట్ల చాలా ఇష్టంతో ఉంటారు.  కానీ కొత్త వస్తువుల లుక్ పాడు చేసే వాటిలో వాటి మీద ఉండే స్టిక్కర్లు ప్రధానంగా ఉంటాయి.  స్టిక్కర్లను అలాగే ఉంచడం ఇష్టం ఉండదు, పోనీ వాటిని తీసేద్దాం అనుకుంటే స్టిక్కర్ల తాలూకు గమ్ వాటి మీద కనిపిస్తూ వస్తువుల లుక్ పాడు చేస్తుంది.  పైగా ఈ గమ్ మీద దుమ్ము దూళి చాలా తొందరగా పేరుకుపోతుంది.  అయితే కొత్త వస్తువుల మీద స్టిక్కర్లు సులువుగానే తొలగించవచ్చని చాలా మందికి తెలియదు. కేవలం కొన్ని టిప్స్ ఫాలో కావడం వల్ల స్టిక్కర్లను వాటి మూలాలు కనిపించకుండా తొలగించవచ్చు.  ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే.. హెయిర్ డ్రైయర్ వేడి.. స్టిక్కర్‌ను వేడి చేయడం వల్ల దాని జిగట మృదువుగా మారుతుంది, దీని వలన స్టిక్కర్ తీయడం సులభం అవుతుంది.  మీడియం వేడి మీద హెయిర్ డ్రైయర్‌ను ఆన్ చేయాలి. స్టిక్కర్ కు 2-3 అంగుళాల దూరంలో 30-40 సెకన్ల పాటు హెయిర్ డ్రైయర్ ను పట్టుకోండి. తర్వాత ఒక మూల నుండి స్టిక్కర్‌ను పట్టుకుని మెల్లిగా లాగితే   స్టిక్కర్ సులువుగా వచ్చేస్తుంది.  ఒకవేళ స్టిక్కర్ సరిగా రాకపోతే మరికొంతసేపు డ్రైయర్ తో స్టిక్కర్ ఉన్న ప్రాంతాన్ని వేడి చేయాలి. బేకింగ్ సోడా, నూనె పేస్ట్.. ఈ ఇంట్లో తయారుచేసిన బేకింగ్ సోడా,  నూనె పేస్ట్ స్టిక్కర్ల జిగటను తొలగిస్తుంది. బేకింగ్ సోడా,  వంట నూనె లేదా కొబ్బరి నూనె సమాన భాగాలుగా కలిపి పేస్ట్ లా చేయాలి. దానిని స్టిక్కర్ లేదా జిగురు మరక ఉన్న ప్రాంతంలో అప్లై చేయాలి. 15 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై ఒక గుడ్డతో రుద్దాలి.  ఎలాంటి ఆనవాళ్లు లేకుండా స్టిక్కర్ కానీ దాని తాలూకు జిగురు కానీ తొలగిపోతుంది. వెనిగర్ వాటర్.. వెనిగర్ స్టిక్కర్ మీద ఉన్న జిగురును వదిలిస్తుంది. ఒక కాటన్ బాల్ లేదా క్లాత్ ను వెనిగర్ లో ముంచి స్టిక్కర్ మీద ఉంచాలి. 10-15 నిమిషాల తర్వాత స్టిక్కర్ సులభంగా ఊడిపోతుంది. తర్వాత  మృదువైన గుడ్డతో ఆ ప్రాంతాన్ని తుడవాలి. నెయిల్ పాలిష్ రిమూవర్.. గట్టి స్టిక్కర్లకు నెయిల్ పాలిష్ రిమూవర్  ఒక గొప్ప ఛాయిస్. దీన్ని ఉపయోగించడానికి నెయిల్ పాలిష్  రిమూవర్‌ను ఒక కాటన్ బాల్‌పై అద్ది, స్టిక్కర్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. 5-7 నిమిషాల తర్వాత  సున్నితంగా గీకాలి. జిగురు గుర్తులు పూర్తిగా మాయమవుతాయి. వేడినీరు..  వాటర్ ప్రూఫ్ ఉన్న ప్రాంతాలలో స్టిక్కర్లు ఉంటే వేడి నీరు చాలా బాగా సహాయపడుతుంది. దీని కోసం  గోరువెచ్చని నీటితో కొద్దిగా డిష్ సోప్ కలపాలి. ద్రావణంలో స్పాంజ్ ముంచి స్టిక్కర్ మీద సున్నితంగా రుద్దాలి. స్టిక్కర్ లేదా జిగురు   పదార్థం సులభంగా తొలగిపోతాయి.                                    *రూపశ్రీ.
శరీరంలో ఏదైనా వ్యాధి లేక జబ్బు వస్తే.. అది వెంటనే బయటపడకపోయినా.. శరీరం మాత్రం వాటికి సంబంధించి సంకేతాలు ఇస్తూనే ఉంటుంది.  వీటినే ఆయా జబ్బుకు సంబంధించిన లక్షణాలు అంటుంటాం.  శరీరం పదే పదే  సంకేతాలు ఇస్తుంటే వాటిని నిర్లక్ష్యం చేయడం అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా  థైరాయిడ్ పనిచేయకపోవడం కూడా అలాంటి సమస్యే.. థైరాయిడ్ సరిగా పనిచేయకపోతే  సమస్య నెమ్మదిగా పెరుగుతూ మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. థైరాయిడ్ అనేది మెడ ముందు భాగంలో ఉన్న ఒక చిన్న, సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి. ఇది శరీర జీవక్రియను నియంత్రిస్తుంది. ఇది సరిగ్గా పనిచేయనప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. థైరాయిడ్ సమస్య ఉందని ఎలా తెలుసుకోవాలో.. ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలో తెలుసుకుంటే.. చలిగా అనిపించడం.. వాతావరణం సాధారణంగా ఉన్నప్పటికీ,  ఇతరులకన్నా చల్లగా అనిపిస్తే అది  జీవక్రియ మందగిస్తున్నదానికి సంకేతం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు శరీరం తక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల చల్లగా అనిపిస్తుంది. ఏకాగ్రత.. తరచుగా మరచిపోవడం, దృష్టి కేంద్రీకరించలేకపోవడం లేదా నీరసంగా అనిపించడం కూడా థైరాయిడ్ వ్యాధికి  సంకేతాలు కావచ్చట.  ఇది హార్మోన్ల అసమతుల్యత మానసిక పనితీరును ప్రభావితం చేస్తుంది. నెలసరి సమస్యలు.. స్త్రీలలో, అధికంగా లేదా  క్రమరహిత ఋతుస్రావం లేదా సాధారణం కంటే ఎక్కువ రక్తస్రావం థైరాయిడ్ సమస్యతో ముడిపడి ఉండే అవకాశం ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యత నేరుగా ఋతు చక్రంపై ప్రభావం చూపుతుంది. బరువు పెరగడం..  ఆహారంలో ఎటువంటి  మార్పులు చేయకపోయినా  బరువు పెరుగుతున్నట్లయితే, అది నెమ్మదిగా జీవక్రియ జరుగుతుందనడానికి సంకేతం కావచ్చు. థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు, శరీరం కేలరీలను చాలా నెమ్మదిగా బర్న్ చేస్తుంది. దీని వల్ల బరువు పెరుగుతారు. చర్మం.. నిస్తేజంగా,  పొడిబారిన చర్మం, గరుకుగా ఉండే జుట్టు కూడా థైరాయిడ్ అసమతుల్యతను సూచిస్తుంది. ఎవరికి థైరాయిడ్ వ్యాధులు ప్రమాదం  ఉంటుంది?  ఆరోగ్య నిపుణుల ప్రకారం కొంతమందికి థైరాయిడ్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పురుషుల కంటే మహిళలకు ఎక్కువ ప్రమాదం ఉంటుంది. కుటుంబ సభ్యులకు థైరాయిడ్ సమస్యల చరిత్ర ఉంటే వారికి  ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన మహిళల్లో ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది. తల లేదా మెడకు రేడియేషన్ థెరపీ పొందిన లేదా అధిక మొత్తంలో అయోడిన్ ఉన్న మందులు తీసుకుంటున్న టర్నర్ సిండ్రోమ్ ఉన్నవారు  జాగ్రత్తగా ఉండాలి. వైద్యుడిని ఎప్పుడు కలవాలి.. పైన చెప్పుకున్న లక్షణాలు చాలా వారాల పాటు కొనసాగితే లేదా క్రమంగా పెరిగితే, TSH, T3,  T4  రక్త పరీక్షలు చేయించుకోవాలి. చికిత్సను ముందుగానే ప్రారంభిస్తే థైరాయిడ్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. థైరాయిడ్ వ్యాధి సాధారణం, కానీ వెంటనే గుర్తించి చికిత్స చేయకపోతే అది  గుండె, బరువు, మానసిక ఆరోగ్యం,  సంతానోత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుంది. అందువల్ల శరీరం ఇచ్చే సంకేతాలను తేలికగా తీసుకోకూడదు.  వైద్యుడిని కలిసి చికిత్స తీసుకోవాలి.                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  నేటి వేగవంతమైన ప్రపంచంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ఒక విలాసం కాదు, అది ఒక అవసరం. మీ ఫిట్‌నెస్ ప్రయాణాన్ని సరైన దిశలో నడిపించడానికి ఈ క్రింది సమగ్ర సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం: మీ ఫిట్‌నెస్ ప్రయాణం ఇక్కడే మొదలు! మన పూర్వీకులు జిమ్ అంటే ఏంటో తెలియకపోయినా ఎంతో దృఢంగా, ఆరోగ్యంగా ఉండేవారు. ఎందుకంటే వారి జీవనశైలిలో శారీరక శ్రమ ఒక భాగంగా ఉండేది. కానీ నేటి కాలంలో మనం చిన్న పనికి కూడా స్విగ్గీ లేదా జెప్టో వంటి యాప్స్ పై ఆధారపడుతూ, కనీసం నడవడానికి కూడా బద్ధకిస్తున్నాము. మన శరీరం కదలడానికి పుట్టింది, కూర్చోవడానికి కాదు. కదలిక లేని జీవితం వ్యాధులకు నిలయంగా మారుతోంది. మనం ఎందుకు వర్కవుట్ చేయాలి? • మనుగడ కోసం: నడక అనేది ఒక వ్యాయామం కాదు, అది మన మనుగడకు ప్రాథమిక అవసరం. మనం ఆరోగ్యంగా బతకాలంటే శారీరక కదలిక తప్పనిసరి. • ఒత్తిడిని జయించడానికి: నిత్యం ఉండే మానసిక ఒత్తిడి, ఆందోళనల నుండి ఉపశమనం పొందడానికి రెసిస్టెన్స్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలు ఎంతో మేలు చేస్తాయి. • శరీర పునరుజ్జీవనం కోసం: సరైన వర్కవుట్ మరియు తగినంత నిద్ర మీ బాడీని రిజూవినేట్ (Rejuvenate) చేసి, రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. ఏం చేయకూడదు?  • లిఫ్ట్‌లు మరియు యాప్స్ పై అతిగా ఆధారపడటం: చిన్న దూరాలకు కూడా వాహనాలు వాడటం లేదా లిఫ్ట్‌లు వాడటం మానేయండి. మెట్లు ఎక్కడం వంటి చిన్న చిన్న పనులను వ్యాయామంగా కాకుండా దైనందిన కృత్యంగా మార్చుకోండి. • రాత్రిపూట ఆలస్యంగా వర్కవుట్ చేయడం: వీలైనంత వరకు రాత్రి 7 గంటల తర్వాత భారీ వర్కవుట్స్ చేయకండి. దీనివల్ల బాడీలో కార్టిసోల్ లెవెల్స్ పెరిగి, మీ నిద్రకు భంగం కలిగే అవకాశం ఉంది. • నిద్రకు ముందు స్క్రీన్ చూడటం: నిద్రలేమి (Insomnia) సమస్యలను నివారించడానికి పడుకునే ముందు ఫోన్ లేదా టీవీ చూడటం మానేయాలి. • వర్కవుట్ సమయంలో నీళ్లు తాగకపోవడం: వర్కవుట్ చేసేటప్పుడు లిక్విడ్స్ తీసుకోకూడదనేది తప్పుడు ప్రచారం. నీరు తాగకపోతే ఎలక్ట్రోలైట్స్ కోల్పోయి నీరసం (Dizziness) వచ్చే ప్రమాదం ఉంది. సరైన పద్ధతిలో వర్కవుట్ ఎలా చేయాలి? • సరైన సమయం: జిమ్ చేయడానికి ఉదయం 5 నుండి 9 గంటల లోపు అత్యంత అనుకూలమైన సమయం. • వ్యాయామ కాలపరిమితి: రోజుకు కనీసం ఒక గంట వెయిట్ ట్రైనింగ్ మరియు ఆ తర్వాత 20 నుండి 30 నిమిషాల కార్డియో చేయడం ఉత్తమం. మొత్తం మీద 1.5 గంటల రొటీన్ సరిపోతుంది. • సహజ ఎలక్ట్రోలైట్స్: వర్కవుట్ మధ్యలో ఉప్పు నీరు, నిమ్మరసం లేదా పుదీనా కలిపిన నీటిని సిప్ చేస్తూ ఉండటం వల్ల కోల్పోయిన లవణాలు తిరిగి లభిస్తాయి. • ఆహారం మరియు విశ్రాంతి: ఒకవేళ సాయంత్రం వర్కవుట్ చేసినా, ఆ తర్వాత ప్రోటీన్ మరియు ఫ్యాట్ అధికంగా ఉండే ఆహారం తీసుకుని, వేడి నీటి స్నానం చేసి పడుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది. ప్రశ్నలు - సమాధానాలు  1. నడకను ఫిట్‌నెస్‌లో భాగంగా చూడవచ్చా:  లేదు, నడక అనేది మన శరీరం ప్రాథమికంగా చేసే పని. ఫిట్‌నెస్ కోసం అదనపు వ్యాయామాలు అవసరం. 2. జిమ్ చేయడానికి రోజులో ఏ సమయం ఉత్తమం: ఉదయం వేళల్లో చేయడం వల్ల హార్మోన్ల సమతుల్యత బాగుంటుంది. అయితే సమయం లేని వారు తగిన జాగ్రత్తలతో సాయంత్రం కూడా చేయవచ్చు. 3. బాడీ రికవరీ అవ్వాలంటే ఏం చేయాలి: తగినంత నిద్ర చాలా ముఖ్యం. నిద్రలోనే శరీరం తనను తాను మరమ్మతు చేసుకుంటుంది. నిద్ర తగ్గితే 'బ్రెయిన్ ఫాగ్' మరియు నీరసం వచ్చే అవకాశం ఉంది. ముగింపు: మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. కేవలం ఆహార నియమాలు పాటిస్తే సరిపోదు, తగినంత కదలిక మరియు వ్యాయామం కూడా ఉండాలి. సీడ్ ఆయిల్స్ మరియు కల్తీ పాల పదార్థాలకు దూరంగా ఉంటూ, ఒత్తిడిని నియంత్రించుకోవడం అలవాటు చేసుకోండి. మీ ఫిట్‌నెస్ ప్రయాణంలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మరియు నిపుణుల సలహాల కోసం మా YouTube Channel (Video link: https://youtu.be/u4uDJUP7Fw0?si=j6YfUFILXu2eJwcc ) ని సందర్శించండి. అక్కడ మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోలు మరియు వర్కవుట్ చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి!
చాలామందికి బాదం పప్పు గురించి తెలిసి ఉంటుంది. కానీ బాదం బంక అనే పేరు బహుశా చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది.  కానీ బాదం బంక ఆరోగ్యానికి చాలామంచిదని చెబుతారు.  బాదం బంకను నీటిలో నానబెట్టుకుని తింటుంటారు.  ముఖ్యంగా వేసవి కాలంలో బాదం బంక వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇది చిన్న బంక గడ్డల్లా ఉంటుంది. నీటిలో వేసి సుమారు 2 గంటల సేపు నానబెడితే బాదం బంక కాస్తా జెల్లీ లాగా మారుతుంది. దీన్ని నేరుగా తింటారు,  నీటిలో కలిపి తాగుతారు,  ఇందులో సబ్జా, పంచదార వంటివి కూడా కలుపుకుని తాగుతారు.  వేసవిలో పానీయాలలో బాదం బంకను యాడ్ చేసుకుంటారు. ఇది శరీరానికి చలువ చేస్తుందని చెబుతారు. అయితే.. బాదం బంక తినడం వల్ల మొటిమలు తగ్గుతాయని కొందరు అంటుంటారు.  దీని వెనుక గల నిజం ఏమిటో తెలుసుకుంటే.. మొటిమలకు కారణం.. చర్మం మీద మొటిమలు, కురుపులు వంటివి వేడి వల్ల వస్తాయి. దీని వల్ల చర్మం చాలా దెబ్బతింటుంది. ఈ వేడిని తగ్గించడం ద్వారా మొటిమలు, కురుపులు తగ్గించడంలో బాదం బంక చక్కగా.. ఔషధంలా పనిచేస్తుంది. బాదం బంక.. చర్మ ప్రయజనాలు.. బాదం బంకను తీసుకోవడం వల్ల చాలా రకాల చర్మ సమస్యలు తగ్గిపోతాయి.   బాదం బంకను రాత్రంతా నీటిలో నానబెట్టాలి.  ఉదయానికి ఈ బంక కాస్తా జెల్లీ లాగా మారుతుంది.  దీనికి కొంచెం చల్లని నీరు కలపాలి.  ఇందులో కొంచెం నిమ్మరసం కలపాలి.  దీన్ని డీహైడ్రేట్ పానీయంలా తీసుకోవాలి.  కనీసం 3 నుండి 4 రోజులు రెగ్యులర్ గా తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. బాదం బంక ఎందుకు మంచిది? బాదం బంక తినడం వల్ల సహజంగానే శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇది చర్మాన్ని తేమ చేస్తుంది.  బాదం బంకలో ఉండే  యాంటీ-ఏజింగ్ లక్షణాల కారణంగా చాలా ప్రయోజనాలు అందిస్తుంది. ఇది శరీరం లోపలి నుండి విషాన్ని తొలగిస్తుంది.  మొటిమలు, ముడతలు,  వడదెబ్బ వంటి సమస్యలను తగ్గిస్తుంది. బాదం బంక తినడం వల్ల  చర్మానికి మెరుపు, యవ్వనం   లభిస్తుంది. ఇది చర్మ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా శరీర ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.                                    *రూపశ్రీ.